Kolikapudi Srinivasa Rao: తిరువూరు నియోజకవర్గ అభివృద్దే నా ప్రధాన లక్ష్యం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎన్టీఆర్ జిల్లాలోని తిరువూరు పట్టణంలో 20వ వార్డులో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసరావు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ప్రచారంలో ప్రతి ఇంటింటికి తిరుగుతూ చంద్రబాబు నాయుడు ప్రవేశ పెట్టబోయే సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరిస్తూ.. అందరూ కూడా టీడీపీకి ఓటు వేయాలని ప్రజలను కొలికపూడి కోరారు. 20 వార్డులో సరైన డ్రైనేజీ వ్యవస్థ లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని కొలికపూడి శ్రీనివాసరావుకి తమ సమస్యను వార్డు సభ్యులు చెప్పడంతో అధికారంలోకి వచ్చిన వంద రోజులలో మీ సమస్యను తీరుస్తాను అని వార్డు సభ్యులకు హామీ ఇచ్చారు. తిరువూరు నియోజకవర్గ అభివృద్దే నా ప్రధాన లక్ష్యం, మీ అందరూ టీడీపీకి ఓటెయ్యండి, తిరువూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి నేను చూపిస్తాను అని కొలికపూడి శ్రీనివాసరావు వెల్లడించారు.
Read Also: Supreme Court : ఉత్తరాఖండ్ అడవుల్లో అగ్నిప్రమాదం.. సుప్రీంకోర్టులో విచారణకు డిమాండ్
Also Read
- Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
- Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
- Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
- First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ఈ ప్రచార కార్యక్రమంలో మీడియాతో కొలికపూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఇంటింటికి ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈరోజు తిరువూరు పట్టణంలోని 20వ వార్డులో యాదవ బజార్లో ప్రచారం చేస్తున్న నాకు యాదవ సామజ వర్గానికి చెందిన కొంతమంది యాదవ సోదరులు, మహిళలు వారి సమస్యను చెప్పుకున్నారన్నారు. యాదవుల సంప్రదాయం ప్రకారం కుల వృత్తిలో భాగంగా పశువుల పెంపకం చేస్తారు.. యాదవులు ఎన్ని ఇబ్బందులు వచ్చిన పశు పోషణ ఆపలేదు, చాలా రైతు కుటుంబాలు పశువులను వదిలేసిన, పశుపోషణ ఆపేసిన యాదవ సోదరులు ఇంకా పశుపోషణ కొనసాగిస్తున్నారు అని ఆయన చెప్పుకొచ్చారు. పట్టణాల్లో చాలా చోట్ల వెటర్నరి హాస్పిటల్స్ యాదవులు నివసించే ప్రాంతానికి దూరంగా ఉన్నాయి.. దీని వల్ల పశువుల పోషణ చేస్తున్న యాదవ సామాజిక వర్గం పశువులకు ఏదైనా సమస్య వస్తే వాటిని హాస్పిటల్ కి తీసుకెళ్ళటానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.. ఒకొక్కసారి పశువులు కూడా మృతి చెందుతున్నాయని కొలికపూడి శ్రీనివాసరావు తెలిపారు.
Read Also: Ruhani Sharma: చూపులతో మాయ చేస్తున్న రుహాణి శర్మ…
యాదవులు వెటర్నరి హాస్పిటల్స్ వారు నివసించే ప్రాంతానికి దగ్గర ఉండాలని కోరుకుంటున్నారని తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసరావు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి, అలాగే రేపు రాబోయే టీడీపీ- జనసేన- బీజేపీ ప్రభుత్వ నాయకులకు తెలియజేస్తానన్నారు. ఎక్కడైతే పట్టణాల్లో యాదవులు ఎక్కువగా నివాసిస్తున్నారో.. పశుపోషణ ఎక్కువ జరుగుతుందో అక్కడ వెటర్నరి హాస్పిటల్స్ నిర్మాణం చేపట్టాలని కోరారు. దీని వల్ల యాదవ సామాజిక వర్గాంతో పాటు పశుపోషణ చేసే మిగతా వర్గాలకు కూడా ఉపయోగపడుతుంది అని కొలికపూడి శ్రీనివాసరావు వెల్లడించారు.
తాజావార్తలు
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
-
Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
-
Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
-
First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!