AP Elections 2024: అభ్యర్థుల తరపున బరిలోకి కుటుంబసభ్యులు, బంధువులు.. అన్నీ తామై..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Elections 2024: తూర్పుగోదావరి జిల్లాలో పార్టీలు ప్రచార జోరు పెంచాయి. మరీ ముఖ్యంగా అభ్యర్థుల తరపున ప్రచార బరిలోకి బంధు బలగం రంగంలోకి దిగింది. అభ్యర్థులు.. సమీప బంధువులు, దగ్గరి స్నేహితులకు ఎన్నికల ప్రచారం, పర్యవేక్షణతో పాటు ఆర్ధిక వ్యవహారాల బాధ్యతలను కట్టబెడుతున్నారు. నియోజకవర్గాలలో నేతలను సమన్వయ పరుస్తూనే ప్రచార కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. తెరవెనుక ఎన్నికల వ్యూహరచన చేస్తూనే ఆర్థిక వ్యవహారాలకు చక్కబెడుతున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖర్చులు, ప్రచారంలో పాల్గొనే నేతలు, కార్యకర్తలకు భోజనాలు, ఇతర సదుపాయాలు కల్పించడం, వాహనాలు ఏర్పాటు చేయడం వంటి పనులను ఒక్కొక్కరు మీదేసుకుంటున్నారు. కొందరు అభ్యర్థుల కుటుంబసభ్యులు, భార్యాపిల్లలు, విదేశాల్లో, ఇతర ప్రాంతాల్లో ఉంటున్నప్పటికీ ఎన్నికల సమయం కావడంతో అందరూ ఇంటికి చేరుకుంటున్నారు. వీరి ఉద్యోగాలు, వ్యాపారాలకు తాత్కాలిక విరామం ప్రకటించి ప్రచారంలో అభ్యర్థులకు చేదోడు వాదోడుగా నిలుస్తున్నారు.. బంధువులు, స్నేహితుల రంగ ప్రవేశం.. పార్టీ నేతల్లోనూ ఉత్సాహం. నింపుతోంది.
Read Also: Shamshabad Airport: కొనసాగుతున్న ఆపరేషన్ చిరుత.. బోన్ లో మేక ను ఉంచి..
Also Read
- Cockroach Janta Party: ఎంతకీ వదలని కాక్రోజ్.. ఎక్స్ అకౌంట్ బ్లాక్ చేసిన వెంటనే కొత్త అకౌంట్ ప్రత్యక్షం!
- Dog Nanny Jobs: ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం.. కుక్కను చూసుకుంటే చాలు.. లక్షల్లో జీతం..!
- Cabinet Meeting: ప్రధాని మోడీ నేతృత్వంలో 4.5 గంటల కేబినెట్ భేటీ.. ఏం చర్చించారంటే..?
- Rooftop Water Tank Cooling Tips: ఎండ వేడితో ఇంటిపైన ఉన్న ట్యాంక్ నీరు మరుగుతోందా..? ఈ చిన్న చిట్కాలతో చల్లగా మారిపోతుంది..!
చిన్న చిన్న తగాదాలతో దూరమైన బంధువులు, మిత్రులతో అభ్యర్థులు సమావేశమై వీరిని ఏకం చేసి తనను సహకరించేలా చేసుకుంటున్నారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ప్రాంతాలవారీగా బాధ్యతలు అప్పగిస్తున్నారు. తమ సమీప బంధువులు, స్నేహితులకు గ్రామాలు, మండలాలు లేదా డివిజన్లవారీగా బాధ్యతలు అప్పగిస్తున్నారు. నామినేషన్ దాఖలు చేసే తేదీ, ఎన్నికల తేదీ సమీపిస్తుండడంతో సమయాభావం వల్ల అభ్యర్థి స్వయంగా నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలలో ఇంటింటి ప్రచారం నిర్వహించలేరు కాబట్టి ప్రాంతానికి ఒకరు లేదా ఇద్దరిని తమ ప్రతినిధిగా బాధ్యతలు అప్పగిస్తున్నారు. ఆయా ప్రాంతాలకు చెందిన పార్టీ నేతలు, కార్యకర్తలకు ఏదైనా సమస్య ఉంటే వెంటనే వీరిని సంప్రదించేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ప్రాంతాలవారీగా వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసుకుని కార్యకర్తలను సమన్వయం చేస్తున్నారు. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ ప్రత్యర్థుల ప్రచార వ్యూహాలకు అనుగుణంగా వ్యూహాలను మార్చుకుంటున్నారు.
Read Also: Israel strikes: రఫాపై ఇజ్రాయెల్ దాడి.. 15 మంది మృతి
అయితే..అభ్యర్థుల బంధువులు, స్నేహితులకు కీలక బాధ్యతలు అప్పగిస్తున్న వ్యవహారం కొన్ని చోట్ల బెడిసి కొడుతున్నట్లు తెలిసింది. ఎంతోకాలంగా అభ్యర్థికి చేదోడు వాదోడుగా ఉంటూ నమ్మకం మెలిగిన తమని కాదని అభ్యర్థి తన బంధువులు, స్నేహితులకు బాధ్యతలు అప్పగిస్తున్నారని కొంతమంది నేతలు అంతర్మథనం చెందుతున్నట్లు సమాచారం. కొంతమంది బంధువులు, స్నేహితులు తమపై పెత్తనం చేస్తున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
తాజావార్తలు
-
ITR Filing Deadline Alert: పన్ను చెల్లింపుదారులకు అలర్ట్.. ఈ తేదీ తర్వాత ITR దాఖలు చేస్తే రూ. 5,000 జరిమానా!
-
Shubman Gill: “ఆ ఒక్క విజయం మమ్మల్ని మార్చేసింది”.. గుజరాత్ విజయరహస్యం చెప్పిన కెప్టెన్ గిల్
-
Cockroach Janta Party: ఎంతకీ వదలని కాక్రోజ్.. ఎక్స్ అకౌంట్ బ్లాక్ చేసిన వెంటనే కొత్త అకౌంట్ ప్రత్యక్షం!
-
Rakul Preet Singh: “మోసం చేస్తే వదిలేస్తా”.. పెళ్లి తర్వాత రిలేషన్పై రకుల్ షాకింగ్ కామెంట్స్!
-
Dog Nanny Jobs: ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం.. కుక్కను చూసుకుంటే చాలు.. లక్షల్లో జీతం..!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!