AP Elections 2024: అభ్యర్థుల తరపున బరిలోకి కుటుంబసభ్యులు, బంధువులు.. అన్నీ తామై..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Elections 2024: తూర్పుగోదావరి జిల్లాలో పార్టీలు ప్రచార జోరు పెంచాయి. మరీ ముఖ్యంగా అభ్యర్థుల తరపున ప్రచార బరిలోకి బంధు బలగం రంగంలోకి దిగింది. అభ్యర్థులు.. సమీప బంధువులు, దగ్గరి స్నేహితులకు ఎన్నికల ప్రచారం, పర్యవేక్షణతో పాటు ఆర్ధిక వ్యవహారాల బాధ్యతలను కట్టబెడుతున్నారు. నియోజకవర్గాలలో నేతలను సమన్వయ పరుస్తూనే ప్రచార కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. తెరవెనుక ఎన్నికల వ్యూహరచన చేస్తూనే ఆర్థిక వ్యవహారాలకు చక్కబెడుతున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖర్చులు, ప్రచారంలో పాల్గొనే నేతలు, కార్యకర్తలకు భోజనాలు, ఇతర సదుపాయాలు కల్పించడం, వాహనాలు ఏర్పాటు చేయడం వంటి పనులను ఒక్కొక్కరు మీదేసుకుంటున్నారు. కొందరు అభ్యర్థుల కుటుంబసభ్యులు, భార్యాపిల్లలు, విదేశాల్లో, ఇతర ప్రాంతాల్లో ఉంటున్నప్పటికీ ఎన్నికల సమయం కావడంతో అందరూ ఇంటికి చేరుకుంటున్నారు. వీరి ఉద్యోగాలు, వ్యాపారాలకు తాత్కాలిక విరామం ప్రకటించి ప్రచారంలో అభ్యర్థులకు చేదోడు వాదోడుగా నిలుస్తున్నారు.. బంధువులు, స్నేహితుల రంగ ప్రవేశం.. పార్టీ నేతల్లోనూ ఉత్సాహం. నింపుతోంది.
Read Also: Shamshabad Airport: కొనసాగుతున్న ఆపరేషన్ చిరుత.. బోన్ లో మేక ను ఉంచి..
Also Read
- Mumbai: భార్యకు తెలియకుండా ప్రియురాలితో విదేశీ టూర్.. సీన్ కట్ చేస్తే..!
- DUSU Elections: ఢిల్లీ యూనివర్సిటీలో ABVP విజయం.. జెన్-జీ తర్వాత తొలి తీర్పు
- Heavy Rain Alert: ఏపీకి భారీ వర్ష సూచన.. ఈ ప్రాంతంలో పిడుగులతో కూడిన వర్షం..
- H-1B Visa: H-1B వీసాలపై ట్రంప్ ఆర్డర్.. భారతీయ ఉద్యోగుల్లో కొత్త టెన్షన్..
చిన్న చిన్న తగాదాలతో దూరమైన బంధువులు, మిత్రులతో అభ్యర్థులు సమావేశమై వీరిని ఏకం చేసి తనను సహకరించేలా చేసుకుంటున్నారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ప్రాంతాలవారీగా బాధ్యతలు అప్పగిస్తున్నారు. తమ సమీప బంధువులు, స్నేహితులకు గ్రామాలు, మండలాలు లేదా డివిజన్లవారీగా బాధ్యతలు అప్పగిస్తున్నారు. నామినేషన్ దాఖలు చేసే తేదీ, ఎన్నికల తేదీ సమీపిస్తుండడంతో సమయాభావం వల్ల అభ్యర్థి స్వయంగా నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలలో ఇంటింటి ప్రచారం నిర్వహించలేరు కాబట్టి ప్రాంతానికి ఒకరు లేదా ఇద్దరిని తమ ప్రతినిధిగా బాధ్యతలు అప్పగిస్తున్నారు. ఆయా ప్రాంతాలకు చెందిన పార్టీ నేతలు, కార్యకర్తలకు ఏదైనా సమస్య ఉంటే వెంటనే వీరిని సంప్రదించేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ప్రాంతాలవారీగా వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసుకుని కార్యకర్తలను సమన్వయం చేస్తున్నారు. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ ప్రత్యర్థుల ప్రచార వ్యూహాలకు అనుగుణంగా వ్యూహాలను మార్చుకుంటున్నారు.
Read Also: Israel strikes: రఫాపై ఇజ్రాయెల్ దాడి.. 15 మంది మృతి
అయితే..అభ్యర్థుల బంధువులు, స్నేహితులకు కీలక బాధ్యతలు అప్పగిస్తున్న వ్యవహారం కొన్ని చోట్ల బెడిసి కొడుతున్నట్లు తెలిసింది. ఎంతోకాలంగా అభ్యర్థికి చేదోడు వాదోడుగా ఉంటూ నమ్మకం మెలిగిన తమని కాదని అభ్యర్థి తన బంధువులు, స్నేహితులకు బాధ్యతలు అప్పగిస్తున్నారని కొంతమంది నేతలు అంతర్మథనం చెందుతున్నట్లు సమాచారం. కొంతమంది బంధువులు, స్నేహితులు తమపై పెత్తనం చేస్తున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
తాజావార్తలు
-
Mumbai: భార్యకు తెలియకుండా ప్రియురాలితో విదేశీ టూర్.. సీన్ కట్ చేస్తే..!
-
DUSU Elections: ఢిల్లీ యూనివర్సిటీలో ABVP విజయం.. జెన్-జీ తర్వాత తొలి తీర్పు
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
The Paradise: నైజాంలో ‘ది ప్యారడైజ్’ టికెట్ హైక్స్ దాదాపు ఫిక్స్ ? ఇక జీవో కాపీయే తరువాయి..
-
Srikanth Odela: నాలుగేళ్లు గేటు బయటే నుంచుంటే సుకుమార్ కంట పడ్డా!
ట్రెండింగ్
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!