సామాజిక న్యాయం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వల్లే సాధ్యమని ఏపీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా పేర్కొన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు జరిగిన మేలు వివరించేందుకే బస్సు యాత్ర చేపట్టామన్నారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు వెనుకబడిన వర్గాలను విస్మరించారన్నారు.