బీజేపీ నిర్వహించే ప్రజాగ్రహ సభ చరిత్రలో బూటకంగా నిలిచిపోతుందని టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో ఉన్న బీజేపీకి ఏపీలో ఉన్న బీజేపీకి చాలా తేడా ఉందని, రాష్ట్రంలో ఉన్న బీజేపీ జగన్ కు అనుకూలంగా పనిచేస్తోందని ఆయన ఆరోపించారు.పశ్చిమబెంగాల్ లో చీమ చిటుక్కుమన్నా కేంద్ర హోంమంత్రి వెళతారని, ఏపీలో ఏమి జరిగినా కేంద్రం మాట్లాడటం లేదని ఆయన అన్నారు. కేంద్రం టెలిస్కోప్ లో రాష్ట్ర రాజకీయలను చూస్తుందని కేంద్ర…
సీఎం జగన్పై ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు. రాష్ట్రంలో జగన్ నియంత పాలన సాగిస్తున్నారని, ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నారని ఆయన అన్నారు. అంతేకాకుండా రాష్ట్రంలో ఒక ట్రాక్టర్ ఇసుక ధర రూ.18 వేలకు అమ్ముతున్నారని, మధ్య, పేద తరగతి కుటుంబాలపై తీవ్ర భారం మోపుతున్నారని ఆయన అన్నారు. గత, ప్రస్తుత ప్రభుత్వాలు అమ్మేసిన సంస్థల గురించి పవన్ ప్రస్తావించాలని ఆయన కోరారు. జగన్ ప్రభుత్వం తీసుకువచ్చిన ఓటీఎస్ పథకాన్ని నిలిపివేయాలని,…
బీజేపీ ఏపీ చీఫ్ సోము వీర్రాజుకు కోపం వచ్చింది. రాజకీయాలను రాజకీయాలుగా చూడకుండా.. పాత విషయాలను పదేపదే ప్రస్తావించడాన్ని ఆయన తట్టుకోలేకపోతున్నారా? అందుకే ఎన్నడూ లేనివిధంగా అధికారపార్టీపై విరుచుకుపడ్డారా? అయితే 2024 తర్వాత రాజకీయాలకు గుడ్బై కొట్టేస్తానని ఎందుకు చెప్పారు? ఇది ఆగ్రహమా..? అసహనమా..? 2024 తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటన..! ప్రత్యర్థులను.. అందులోనూ టీడీపీని.. ఆ పార్టీ నేతలను విమర్శించడంలో ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు ఫ్రంట్ లైనులో ఉంటారు. అలాంటిది అధికార…
టార్గెట్-2024 అంటూ బీజేపీ అధినాయకత్వం ఏపీ రాష్ట్రానికి కోర్ కమిటీని ఏర్పాటు చేసింది. ఇప్పుడా కమిటీ కూర్పుపై సర్వత్రా చర్చ జరుగుతోంది. కమిటీలో అంతా బయట నుంచి వచ్చిన వారే ఎక్కువ. ఇదేం చిత్రం అంటూ కొందరు బుగ్గలు నొక్కుకుంటున్నారట. ఇదే సందర్భంలో మరో చర్చా జరుగుతోంది. పాతవారు పని చేయకపోతే కొత్తవారికి పెద్దపీట వేయక తప్పదుగా అని చెవులు కొరుక్కుంటున్నారట. అమిత్ షాతో భేటీ తర్వాత అమరావతి రైతుల పాదయాత్రలో ఏపీ బీజేపీ నేతలు..! తిరుపతిలో…
ఏదో చేయబోయారు.. ఇంకోదో అయ్యింది. వీళ్లను నిలదీయాలనుకున్నారు.. కానీ వాళ్లని నిలదీసే పరిస్థితి తెచ్చారు. ఇంతకీ వీళ్లు చేసింది.. మంచి అయ్యిందా? చెడు చేసిందా? క్రెడిట్ కొట్టేద్దాం అని వాళ్లు అనుకుంటే.. సీన్ రివర్స్ చేసిపెట్టారా? గిల్లి.. గిల్లించుకోవడం అంటే.. ఇదేనంటూ సెటైర్లు పడుతోంది అందుకేనా..? ఉపఎన్నికల ఫలితాలతో తలబొప్పికట్టి నష్టాన్ని గుర్తించిన కేంద్రం..! రోజూ అదేపనిగా పెరిగిన పెట్రో ధరలు వంద దాటిపోయాయి. అయినా ఆగలేదు. జనం గగ్గోలుపెట్టినా ఢిల్లీ పెద్దలు పట్టించుకోలేదు. దేశవ్యాప్తంగా జరిగిన…
కడప జిల్లా బద్వేల్ ఉప ఎన్నికల పోలింగ్ ముగిసింది.. మరికొన్ని గంటల్లో ఫలితం కూడా వెలువడనుంది.. ఈ ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు దూరంగా ఉండగా.. బీజేపీ, కాంగ్రెస్ పార్టీ మాత్రం అభ్యర్థులను పోటీకి పెట్టాయి.. ఇక, బీజేపీ అభ్యర్థిని టీడీపీ, జనసేన సహకరించిందనే విమర్శలు కూడా ఉన్నాయి.. ఏకంగా కొన్ని పోలింగ్ బూతుల్లో బీజేపీ ఏజెంట్లుగా టీడీపీ నేతలను కూర్చున్నారంటూ సోషల్ మీడియాలో ఫొటోలు హల్చల్ చేశాయి. అయితే, ఈ ఎన్నికల్లో తమ రిస్థితి…
ఏదో వచ్చారు… వెళ్లారు అని కాకుండా.. ఏపీ పర్యటనలో ఓ కేంద్రమంత్రి చేసిన కామెంట్స్.. బీజేపీకి టెన్షన్ తెచ్చిపెట్టాయి. రాబోయే కష్టాలు తలుచుకుని కలవర పడుతున్నారట. ఇంతకీ ఆ కేంద్రమంత్రి ఎవరు? ఆయన చెప్పిందేంటి? కమలనాథులకు రుచించని ఆ మాటలేంటి? వైసీపీని ఎన్డీయేలో చేరాలన్న అథవాలే..! రాందాస్ అథవాలే. కేంద్రమంత్రి. బీజేపీ నేతృత్వంలోని NDA కూటమిలో భాగస్వామి. మాటలతో.. వ్యంగ్యాస్త్రాలతో.. ప్రాసలతో వైరిపక్షాలకు కూడా నవ్వులు పూయిస్తుంటారు అథవాలే. ఇటీవల విశాఖపట్నం వచ్చిన ఆయన.. కొన్ని పొలిటికల్…
మోడీ బర్త్ డే రోజున 2 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్ వేయాలని ప్రణాళిక చేస్తున్నాం అని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. రేషన్ బియ్యం కి రెండు రూపాయలు సబ్సిడీ ఇచ్చి జగన్ ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోంది. ప్రజలకు వ్యాక్సిన్ అందించినందుకు 5 కోట్లు పోస్ట్ కార్డులతో కృతజ్ఞతలు చెప్పాలని నిర్ణయం తీసుకున్నాము. మోడీ జన్మదిన వేడుకలను 20 రోజుల పాటు రోజుకో ప్రాధాన్యతా కార్యక్రమాల నిర్వహణ ఉంటుంది. స్వచ్చ భారత్, మన్ కీ…
ఆయన నిన్నమొన్నటి వరకు నోటికి పనిచెప్పేవారు. సడెన్గా ఉత్తరాలతో కొత్త రూటు ఎంచుకున్నారు. సీఎమ్కు వారానికో లేఖ రాసిపారేస్తున్నారు. ఈ లెటర్ల వెనక ఆంతర్యం ఏదైనా.. లేఖల ప్రభావం భారీగానే ఉందని లెక్కలు వేసుకుంటున్నారట. ఆయన ఎవరో ఏంటో ఈ స్టోరీలో చూద్దాం. నోటికి పని తగ్గించి… లేఖలు రాస్తున్న వీర్రాజు..! సోము వీర్రాజు. ఏపీ బీజేపీ అధ్యక్షుడు. ఆయన కామెంట్స్ సంచలనంగా మారిన సందర్భాలు అనేకం. కాకపోతే వీర్రాజు వ్యాఖ్యలు ఏపీ ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటున్నాయనే…
తాడేపల్లి రాష్ట్ర ఎస్సి కార్పొరేషన్ కార్యాలయం ఎదుట బీజేపీ ఎస్సి మోర్చా ఆధ్వర్యంలో భారీ ధర్నా చేపట్టారు. ఎస్సీ కార్పొరేషన్ నిధులు, ఎస్సి, ఎస్టి సబ్ ప్లాన్ నిధులు వేంటనే విడుదల చేయాలంటూ ఎస్సీ కార్యాలయం ముందు బైఠాయించారు. ధర్నా చేస్తున్న బీజేపీ ఎస్సీ మోర్చ రాష్ట్ర అధ్యక్షుడు దేవానంద్ తో పాటు పలువురు నేతలను అరెస్టు చేసారు పోలీసులు. ఇక ఈ సందర్భంగా బీజేపీ ఎస్సీ మోర్చ రాష్ట్ర అధ్యక్షుడు దేవానంద్ మాట్లాడుతూ… రెండేళ్ల లో…