తాడేపల్లి రాష్ట్ర ఎస్సి కార్పొరేషన్ కార్యాలయం ఎదుట బీజేపీ ఎస్సి మోర్చా ఆధ్వర్యంలో భారీ ధర్నా చేపట్టారు. ఎస్సీ కార్పొరేషన్ నిధులు, ఎస్సి, ఎస్టి సబ్ ప్లాన్ నిధులు వేంటనే విడుదల చేయాలంటూ ఎస్సీ కార్యాలయం ముందు బైఠాయించారు. ధర్నా చేస్తున్న బీజేపీ ఎస్సీ మోర్చ రాష్ట్ర అధ్యక్షుడు దేవానంద్ తో పాటు పలువురు నేతలను అరెస్టు చేసారు పోలీసులు.
ఇక ఈ సందర్భంగా బీజేపీ ఎస్సీ మోర్చ రాష్ట్ర అధ్యక్షుడు దేవానంద్ మాట్లాడుతూ… రెండేళ్ల లో జగన్ సర్కార్ దళితలకు ఒక్క రూపాయి కూడా ఇవ్వ లేదు. ఎన్నికల ముందు హామిలను ఇచ్చి అతర్వాత దళితలను జగనః మొసగించాడు. రాష్ట్రం లో దళిత ఎంపీ, మంత్రులు,ఎమ్మెల్యేలు ఎందుకు నోరు మెదపటం లేదు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఎన్ఎస్ఎఫ్.డిసి నిధులు కూడా పక్కదారి పట్టించడాన్ని ఖండిస్తున్నాం. రాష్ట్రంలో ఎస్సి కార్పొరేషన్ రద్దు చేసిన 30 పథకాలను వెంటనే అమలు చేయాలు. ప్రాణాలేన అర్పిస్తాం..ఎస్సీ కార్పొరేషన్ నిధులు, ఎస్సి, ఎస్టి సబ్ ప్లాన్ నిధులు విడుదలను సాధించి తీరుతాం అని పేర్కొన్నారు.