గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక ఛైర్మన్ బిల్గేట్స్తో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. సోమవారం ఉదయం గన్నవరం ఎయిర్పోర్ట్కి వచ్చిన బిల్గేట్స్కు మంత్రి నారా లోకేష్ స్వగతం పలికారు. ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా అమరావతిలోని రాష్ట్ర సచివాలయానికి చేరుకున్నారు. అక్కడ బిల్గేట్స్కు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా పలువురు మంత్రులు ఘనస్వాగతం పలికారు. అనంతరం వారితో బిల్గేట్స్ బృందం ప్రత్యేకంగా సమావేశమైంది. బిల్గేట్స్ వెంట ఆయన ప్రతినిధి బృందం సభ్యులు మైఖేల్ థియోడార్ జాయోగృలస్, క్రిస్టియాన మరియా ఇస్కుందర్, అంకుర్ చంద్రకాంత్ ఓరా, అర్చన వ్యాస్ ఉన్నారు.
Also Read: Ishan Kishan: పాకిస్థాన్పై గెలుపు ఎప్పుడూ ప్రత్యేకమే.. ఇక టీ20 ప్రపంచకప్లో రెచ్చిపోతాం!
సచివాలయంలో రియల్ టైమ్ గవర్నెన్స్ (ఆర్టీజీఎస్) కేంద్రాన్ని బిల్గేట్స్ సందర్శించారు. ఆర్టీజీఎస్ విధానాలు, సాధిస్తున్న ఫలితాల్ని గేట్స్కు సీఎం వివరించారు. పరిపాలనలో టెక్నాలజీ వినియోగం ద్వారా ప్రజలకు సేవలు మరింత వేగంగా, పారదర్శకంగా అందించేందుకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలను వివరించారు. గేట్స్ ఫౌండేషన్ సహకారంతో విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో కూటమి ప్రభుత్వం చేపట్టిన వివిధ ప్రాజెక్టులను మరింత విస్తరించే అంశంపై గేట్స్తో సీఎం చర్చించనున్నారు. ముఖ్యంగా గేట్స్ ఫౌండేషన్ సహకారంతో నడుస్తున్న సంజీవని ప్రాజెక్టు గురించి సీఎం వివరించనున్నారు.