ఎన్టీఆర్ జిల్లాలో కౌంటింగ్కు సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు వెల్లడించారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక నిఘా కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు.
అనుకున్న సమయానికి ముందే మే 30న కేరళ తీరాన్ని తాకిన నైరుతి రుతుపవనాలు... క్రమంగా ముందుకు కదులుతున్నాయి. నైరుతి రుతుపవనాల రాకతో కేరళవ్యాప్తంగా గత రెండు రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక, అక్కడ నుంచి కర్ణాటక మీదుగా ఆంధ్రప్రదేశ్లోకి రుతుపవనాలు ప్రవేశించాయి. నైరుతి రుతుపవనాలు ఏపీని తాకాయి.
వారసుడు కావాలి అని అత్తింటి వారు వేధింపులు తాళలేక గర్భిణీ మృతి చెందిన ఘటన కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది. పెనమలూరు మండలం రామలింగేశ్వర నగర్కు చెందిన చందు కావ్య శ్రీ (19) ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నం చేయగా.. కొన ఊపిరితో ఉన్న కావ్యశ్రీని కామినేని హాస్పిటల్కు భర్త, తల్లిదండ్రులు తరలించగా చికిత్స పొందుతూ కావ్యశ్రీ మృతి చెందింది.
ఎగ్జిట్ పోల్స్పై స్పందించిన వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి.. ట్రెండ్ అయితే క్లియర్ గా కనబడుతుందన్నారు. వైసీపీకి సైలెంట్ ఓటింగ్ ఎక్కువగా ఉందని మా అంచనాగా పేర్కొన్న ఆయన.. ఎగ్జిట్ పోల్స్ కంటే ఫలితాలు ఇంకా మెరుగ్గా ఉంటాయని అనుకుంటున్నాం అన్నారు.