Ramoji Rao: రామోజీరావు అస్తమయంపై చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి.. లోకేష్ సహా టీడీపీ నేతల సంతాపం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ramoji Rao: ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత, మీడియా మొఘల్, పద్మవిభూషణ్ రామోజీరావు అస్తమయంపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.. రామోజీరావు తెలుగు వెలుగు. రామోజీ మృతి తీరని లోటు. ఒక సామాన్య కుటుంబంలో పుట్టిన రామోజీ అసామాన్య విజయాలు సాధించారు. రామోజీరావు మరణం తనను తీవ్ర ఆవేదనకు గురి చేసింది. అక్షర యోధుడుగా పేరున్న రామోజీ తెలుగు రాష్ట్రాలకు, దేశానికి ఎన్నో సేవలందించారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఉన్న ఆయన తిరిగి కోలుకుంటారని భావించాను. ఇలాంటి వార్త వినాల్సి వస్తుందని అనుకోలేదు అని తీవ్ర ఆవేదిన వ్యక్తం చేశారు చంద్రబాబు..
తెలుగు వారి జీవితాల్లో అత్యంత ప్రభావవంతమైన ముద్ర వేశారు రామోజీరావు అని పేర్కొన్నారు చంద్రబాబు.. సమాజ హితం కోసం అనుక్షణం పని చేసిన రామోజీ కీర్తి అజరామరం. ఈనాడు గ్రూపు సంస్థల స్థాపనతో వేల మందికి ఉపాధి కల్పించారని అన్నారు. మీడియా రంగంలో శ్రీ రామోజీది ప్రత్యేకమైన శకం. ఎన్నో సవాళ్లను, సమస్యలను అధిగమించి.. ఎక్కడా తలవంచకుండా విలువలతో రామోజీ తన సంస్థలను నడిపారు. రామోజీరావు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు తన ప్రకటనలో పేర్కొన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.
Also Read
- Arijit Singh: గూండాల్లా విద్యార్థులపై దాడి చేస్తారా? ఢిల్లీ ఘటనపై ప్రముఖ సింగర్ ధ్వజం
- Cristiano Ronaldo: అర్జెంటీనాపై వివాదాస్పద పోస్ట్ను రొనాల్డో లైక్ చేశారా? సోషల్ మీడియాలో నెటిజన్ల రచ్చ..
- Oppo Smartphone Price: షాపింగ్ చేయడానికి ముందే చెక్ చేసుకోండి.. అమల్లోకి వచ్చిన ఒప్పో కొత్త రేట్లు..
- Honeymoon Murder Case: ‘మీ భర్తపై దాడి జరిగినప్పుడు మీరేం చేశారు’ సోనమ్కు సుప్రీంకోర్టు పలు ప్రశ్నలు
ఇక, రామోజీరావు మృతికి నారా లోకేష్ సంతాపం వ్యక్తం చేశారు.. రామోజీ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపిన లోకేష్. రామోజీ గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు మృతి తెలుగు సమాజానికి తీరని లోటు అన్నారు. ప్రజా పక్షపాతి, అలుపెరుగని అక్షర యోధుడికి కన్నీటి నివాళులు. జనహితమే తన అభిమతంగా జీవితాంతం నిబద్ధతతో రామోజీ పని చేశారు. రామోజీరావు మనకు మార్గదర్శి. ప్రజాస్వామ్య పరిరక్షణకు రామోజీరావు ఉద్యమస్ఫూర్తితో పని చేశారు అని పేర్కొన్నారు నారా లోకేష్. మరోవైపు.. రామోజీరావు మృతికి యనమల రామకృష్ణుడు, కళా వెంకట్రావు, అచ్చెన్నాయుడు, సోమిరెడ్డి, కేశినేని చిన్ని, పయ్యావుల, కాల్వ శ్రీనివాసులు, నక్కా ఆనందబాబు సహా పలువురు టీడీపీ నేతలు సంతాపం ప్రకటించారు. మీడియా దిగ్గజం రామోజీరావు మృతి పట్ల సంతాపం తెలిపిన ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్.. తెలుగు రాష్ట్రాలలో సినీ, మీడియా రంగంలో ఎంతోమందికి ఆయన ఆదర్శం.. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన రామోజీ రావు కఠోర సాధనతో ఎన్నో అద్భుతాలు సృష్టించారు.. ఆయన లేని లోటు సమాజానికి తీరనిది అని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
China: కొత్త గేమ్కి రెడీ అవుతున్న చైనా.. ప్రపంచానికి షాక్ తప్పదా?
-
Arijit Singh: గూండాల్లా విద్యార్థులపై దాడి చేస్తారా? ఢిల్లీ ఘటనపై ప్రముఖ సింగర్ ధ్వజం
-
Cristiano Ronaldo: అర్జెంటీనాపై వివాదాస్పద పోస్ట్ను రొనాల్డో లైక్ చేశారా? సోషల్ మీడియాలో నెటిజన్ల రచ్చ..
-
Adluri Laxman : అధికారంలో ఉన్నప్పుడు రైతులు కనిపించలేదా..!
-
Oppo Smartphone Price: షాపింగ్ చేయడానికి ముందే చెక్ చేసుకోండి.. అమల్లోకి వచ్చిన ఒప్పో కొత్త రేట్లు..
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!