KARNATAKA WIFE DRAMA: భర్త.. భార్య.. మధ్యలో ప్రియుడు
- బట్టలు, చెప్పులు వదిలేసి ప్రియుడితో పారిపోయిన ప్రియాంక..
- ఒంటి మీద రూ. 30 లక్షల విలువైన నగలు..
- బంగారం కోసమే కిడ్నాప్ చేశారేమోనని అనుమానం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KARNATAKA WIFE DRAMA: వివాహేతర బంధం కోసం ప్రియుడి సాయంతో భర్తను చంపుతున్న ఘటనలు ఈ మధ్య దేశవ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్నాయి. ఐతే అలాంటి కేసుల్లో చాలా వరకు ప్రియుడితోపాటు భార్యను కూడా పోలీసులు అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి నెట్టారు. ఈ కేసులన్నింటినీ చూసిన ఓ భార్య.. తన భర్తను చంపకుండానే.. ప్రియుడితో కలిసి పారిపోయేందుకు ఓ డ్రామాటిక్ స్కెచ్ వేసింది. ఇటు భర్తను హత్య చేయకుండా.. అటు నైస్గా ప్రియుడితో వెళ్లిపోవడం వల్ల.. విన్ విన్ సిచ్యుయేషన్ ఉంటుందని భావించింది. కానీ సీన్ రివర్స్ అయి పోలీసులకు దొరికిపోయింది. ఐతే భార్య చేసిన పనికి ఆ భర్త షాకయ్యాడు. ఈ కేసులో అసలేం జరిగింది? భార్య ఏం చేసింది?
Read Also: Nilave: మ్యూజికల్ లవ్ డ్రామాగా ఆకట్టుకుంటున్న నెలవే
Also Read
- Refrigerator Blast: ఇంట్లో ఫ్రిజ్ పేలి భారీ అగ్ని ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సజీవ దహనం
- Nayeem Mu*rder: నాగోల్లో రౌడీషీటర్ నయీమ్ హత్య.. అదుపులో ఆరుగురు నిందితులు.!
- Korukonda Tragedy: వినాయక చవితి వేళ విషాదం.. కలువ పువ్వుల కోసం వెళ్లి ఇద్దరు మృతి
- Mother Murder Case: గుంటూరులో దారుణం.. ప్రియుడితో కలిసి తల్లిని హత్య చేసిన కూతురు..! డబ్బుల కోసమేనా..?
ముందుగా అందరూ చేసిన విధంగానే భర్తను చంపేసి..ప్రియుడితో వెళ్లిపోవాలని ప్లాన్ చేసుకుంది. కానీ పోలీసులు అరెస్ట్ చేస్తారు.. ఆ తర్వాత సీన్ అంతా రివర్స్ అవుతుందని భావించి ప్లాన్లో చిన్న చేంజ్ ఇచ్చింది. కానీ అలా చేసినా పోలీసులకు అడ్డంగా దొరికిపోయింది. ప్రియాంక. తుమకూరులో భర్త రుద్రేష్తో కలిసి నివసిస్తోంది. ఈ ఠక్కులాడికి డేవిడ్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అది కాస్తా వివాహేతర బంధానికి దారి తీసింది. ఇద్దరూ కలిసి ఎంజాయ్ చేద్దామంటే భర్త రుద్రేష్ అడ్డుగా ఉన్నాడు. దీంతో అతన్ని హతమార్చాలని ప్రియాంక ప్లాన్ చేసింది. ఐతే దేశవ్యాప్తంగా జరుగుతున్న ఘటనలు గుబులు పుట్టించాయి. దీంతో ప్రియుడ్ డేవిడ్ ప్లాన్ మార్చేశాడు.
తుమకూరులోని ఓ చెరువు వద్ద ప్రియాంక బట్టలు, చెప్పులు వదిలేసి ప్రియుడుతో కలిసి పారిపోయింది. ఐతే రుద్రేష్ భార్య కోసం ఫోన్ చేశాడు. కానీ స్విచ్చాఫ్ వచ్చింది. తెలిసిన వారి ఇళ్లు, బంధువులు వద్ద వాకబు చేశాడు. కానీ ఎక్కడా కనిపించలేదు. దీంతో ఆందోళనకు గురైన అతడు.. తన భార్యను ఎవరో కిడ్నాప్ చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆమె ఒంటి మీద దాదాపు 30 లక్షల రూపాయల విలువైన నగలు ఉన్నాయని తెలిపాడు. ఆ బంగారం కోసమే కిడ్నాప్ చేశారేమోనని అనుమానం వ్యక్తం చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి..దర్యాప్తు చేశారు. ఇంతలో పోలీసులకు బేలూరు బస్టాండ్ వద్ద సీసీ ఫుటేజీలో ప్రియాంక కనిపించింది. ఆ ఆధారంతో వెతకడంతో ఓ చెరువు వద్ద ఆమె దుస్తులు, చెప్పులను గుర్తించారు. చెరువు వద్ద భార్య దుస్తులు, చెప్పులు చూసి భర్త రుద్రేష్ మరింత ఆందోళనకు గురయ్యాడు. ఆమెను చంపేశారని అని అనుకున్నాడు. కానీ పోలీసులు చెరువులో వెతకడంతో ఎలాంటి డెడ్ బాడీ లభించలేదు. ఆమె సెల్ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా మరింత లోతుగా దర్యాప్తు చేయడంతో అసలు విషయం బయటపడింది. చివరికి సిగ్నల్స్ ఆధారంగా లొకేషన్ ట్రేస్ చేసి పట్టుకున్నారు. ప్రియుడితో వెళ్లిపోయినట్లు గుర్తించారు. ప్రియుడు డేవిడ్తోపాటు ప్రియాంకను అరెస్ట్ చేశారు. భార్య చేసిన నిర్వాకం బయట పడడంతో భర్త రుద్రేష్ ఒక్కసారిగా షాక్కు గురయ్యాడు.
తాజావార్తలు
-
ICC Rankings: ఆసియా కప్ దెబ్బకు ఐసీసీ ర్యాంకింగ్స్ తారుమారు.. టాప్లోకి దూసుకెళ్లిన ఇండియన్ ప్లేయర్స్..
-
Chandrasekhar Reddy: గేట్లు బద్దలు కొట్టి, సెక్యూరిటీని బెదిరించి.. అల్లు అర్జున్ మామ దౌర్జన్యం..?
-
Saudi-Israel: హౌతీల నుంచి భారీ ముప్పు.. ఇజ్రాయెల్ సాయం కోరిన సౌదీ!
-
Irctc Tickets Booking: OpenAI మరో సంచలనం.. ఏఐతో ఆటోమేటిక్గా రైలు టికెట్లు బుకింగ్
-
CV Anand : పంతాలకు పోవద్దు.. పదోన్నతులు కోల్పోవద్దు
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?