కోవిడ్ విజృంభణతో చాలా రాష్ట్రాలు టెన్త్ పరీక్షలు రద్దు చేశాయి.. పరీక్షల ఫీజులు చెల్లించిన అందరు విద్యార్థులు పాస్ అయినట్టు ప్రకటించాయి.. వాళ్లకు ఇరత పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా గ్రేడ్లు కూడా కేటాయించారు. అయితే, ఏపీ మాత్రం.. పరీక్షలు వాయిదా వేసింది.. విద్యార్థుల భవిష్యత్ దృష్టిలో ఉంచుకుని పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధమైంది.. ఇక, పదవ తరగతి పరీక్షల నిర్వహణపై ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని.. జులై 26 నుంచి ఆగస్టు 2వ తేదీ వరకు పదవ తరగతి…
కరోనా సెకండ్ వేవ్ కేసులు తగ్గుముఖం పట్టినా.. ఇంకా పూర్తిగా కంట్రోల్ లోకి వచ్చిన పరిస్థితి మాత్రం లేదు.. ఇదే సమయంలో కరోనా థర్డ్ వేవ్ హెచ్చరికలు అందరినీ కలవరపెడుతున్నాయి.. ఈ నేపథ్యంలో కీలక వ్యాఖ్యలుచేశారు ఏపీ సీఎం వైఎస్ జగన్.. కలెక్టర్లతో సమావేశమైన ఆయన.. వివిధ అంశాలపై దిశనిర్దేశం చేస్తూ.. కోవిడ్ థర్డ్ వేవ్పై కూడా స్పందించారు.. థర్డ్వేవ్ వస్తుందో, లేదో మనకు తెలియదు.. కానీ, మనం ప్రిపేర్గా ఉండడం అన్నది మన చేతుల్లోని అంశం..…
కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న కర్ఫ్యూ మంచి ఫలితాలనే ఇచ్చింది.. ఓ దశలో రికార్డు స్థాయిలో నమోదైన కోవిడ్ పాజిటివ్ కేసులు.. ఇప్పుడు క్రమంగా దిగివస్తున్నాయి.. అయినా.. కేసుల సంఖ్య ఇంకా భారీగానే ఉందని చెప్పాలి.. దీంతో.. మరోసారి కర్ఫ్యూను పొడగించే ఆలోచనలో ఉన్నారు సీఎం వైఎస్ జగన్.. కర్ప్యూ కొనసాగింపుపై ఆయన సంకేతాలిచ్చారు.. ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన ప్రకారం ఈ నెల 20వ తేదీ వరకు ఏపీలో కర్ఫ్యూ అమల్లో…
ఏపీలో పేకాట రాజకీయం హీటెక్కిందా? పేకాట క్లబ్ల వెనక ఎవరున్నారో.. ఆ చిట్టా మొత్తం చేరాల్సిన వారి దగ్గరకు చేరిందా? ఆ జాబితాలో ఉన్న ప్రజాప్రతినిధులు ఎవరు? అధినేత ఎంత చెప్పినా చెవికి ఎక్కించుకోని వారికి బ్యాండ్ బాజాయేనా? ఆ కథేంటో స్టోరీలో చూద్దాం. పేకాటపై వచ్చే ఆదాయం వదులుకోవడం ఇష్టం లేని కొందరు నేతలు గతంలో ఏపీలో పేకాట యధేచ్చగా సాగేది. ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడకు వచ్చి కార్డ్స్ ఆడేవారు. జగన్ ముఖ్యమంత్రి…
డీఎస్సీ 2008 అభ్యర్థులకు గుడ్న్యూస్ చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. టీడీపీ హయాంలో డీఎస్సీ అభ్యర్థులను పట్టించుకోలేదని.. వారికి ఉద్యోగ భద్రత కల్పిస్తున్నామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు.. డీఎస్సీ-2008 సమస్య 13 ఏళ్లుగా పెండింగ్లో ఉందన్న ఆయన.. అభ్యర్థుల భవితవ్యంపై సీఎం వైఎస్ జగన్ మానవతా దృక్పథంతో వ్యవహరించారని పేర్కొన్నారు. డీఎస్సీ అభ్యర్ధులను ఎస్జీటీలుగా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారని వెల్లడించారు.. త్వరలోనే డీఎస్సీ అభ్యర్ధులకు పోస్టింగ్లు ఇస్తామని.. త్వరలోనే దీనికి సంబంధించిన జీవో విడుదల…
రోనా మహమ్మారి నేపథ్యంలో టెన్త్, ఇంటర్ పరీక్షలను ఇతర రాష్ట్రాలు రద్దు చేసినా.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం వాయిదా వేసింది.. విద్యార్థుల భవిష్యత్ను దృష్టిలో ఉంచుకుని పరీక్షలు నిర్వహించితీరుతామని ఇప్పటికే పలు సార్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు.. తాజాగా టెన్త్, ఇంటర్ పరీక్షలపై స్పందించిన మంత్రి.. పరీక్షలను రద్దు చేయడానికి ఒక్క నిమిషం చాలు.. కానీ, ఆ తర్వాత పర్యావసనాలను కూడా గుర్తించాలన్నారు.. ఇక, జులై మొదటి వారంలో ఇంటర్ పరీక్షలు నిర్వహించే…
కరోనా మహమ్మారి ఎక్కడ ఎప్పుడు ఎలా సోకుతుందో తెలియని పరిస్థితి.. ముఖ్యంగా ఎక్కువమంది గుమ్మిగూడే ప్రాంతాల్లో వేగంగా విస్తరిస్తోంది ఈ వైరస్.. తాజాగా శ్రీకాకుళం నగరంలోని వైటీసీలో కోవిడ్ కలకలమే సృష్టించింది.. సూపర్-60 కోచింగ్ తీసుకుంటున్న 28 మంది విద్యార్ధులకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది.. ఇటీవలే వారం రోజులు సెలవులపై ఇళ్లకు వెళ్లిన విద్యార్థులు తిరిగి కోచింగ్ సెంటర్ చేరుకున్నారు.. ఈనెల 2వ తేదీ నుంచి శిక్షణా తరగతులు తిరిగి ప్రారంభం అయ్యాయి.. ఇళ్ల నుంచి…
కరోనా సెకండ్ వేవ్ క్రమంగా తగ్గుముఖం పట్టడంతో అంతా ఊపిరి పీల్చుకుంటున్నారు.. మరోవైపు.. కోవిడ్ థర్డ్ వేవ్ ముప్పు హెచ్చరికలు కలవరపెడుతున్నాయి.. ఈ తరుణంలో కోవిడ్ పరిస్థితి, థర్డ్ వేవ్ సన్నద్ధత పై గ్రూప్ అఫ్ మిమిస్టర్స్ సమావేశం జరిగింది.. మంత్రి ఆళ్లనాని అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సబ్ కమిటీ సభ్యులు, మంత్రులు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, కన్నబాబు, అప్పలరాజు, ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు…