సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారు.. బూతులతో ప్రయోజనంలేదు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నేతల మధ్య మాటల యుద్ధానికి కారణమైన జల వివాదం.. చినికి చినికి గాలివానగా మారుతూనే ఉంది.. ప్రధానికి, కేంద్రానికి, కృష్ణా రివర్ బోర్డుకు తాజాగా ఏపీ లేఖలు రాయడంపై భగ్గుమంటున్నారు తెలంగాణ మంత్రులు, నేతలు.. ఆ విమర్శలపై స్పందించిన ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్.. తెలంగాణ నేతలు సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డ ఆయన.. రెండు రాష్ట్రాలు అన్నదమ్ముల్లా విడిపోయారు.. అక్కడా తెలుగువాళ్లున్నారు… ఇక్కడా తెలుగువాళ్లున్నారని.. బూతులు తిట్టుకోవడం వల్ల ప్రయోజనం ఏమీ లేదన్నారు.. ఎప్పుడో చనిపోయిన వైఎస్సార్ గురించి మాట్లాడటం వారి సంస్కారానికే వదిలేస్తున్నామన్న ఆయన.. వైఎస్సార్ తెలంగాణకు నిజంగా అన్యాయం చేస్తే 2009లో అత్యధిక సీట్లు ఎలా గెలిచారు..? అని ప్రశ్నించారు.. తెలంగాణ ప్రజలు వైఎస్సార్ ను గుండెల్లో పెట్టుకున్నారన్న మంత్రి అనిల్.. ఏపీకి కేటాయించిన వాటాకు లోబడే ప్రాజెక్టులు కడుతున్నాం అని స్పష్టం చేశారు.
తెలంగాణ నేతలకు చిత్తశుద్ధి ఉంటే వారి పరిధిలో ఉన్న ప్రాజెక్టులను కేఆర్ఎంబీ పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్… పదే పదే అన్యాయం చేశామంటున్నారు… మేం ఏమి అన్యాయం చేశామని ప్రశ్నించిన ఆయన.. వ్యవసాయానికి నీరందకుండా పవర్ ఆన్ చేశారు … అది ఎంత దుర్మార్గమైన చర్య అని ఆవేదన వ్యక్తం చేశారు.. పులిచింతల , నాగార్జున సాగర్ , శ్రీశైలం నుంచి నీరు సముద్రాల్లోకి వదిలేయాల్సి వస్తోందన్నారు. మరోవైపు.. ఇద్దరు సీఎంలకు లోపాయికారి ఒప్పందం ఉందని ఒకాయన మాట్లాడుతున్నాడు తున్నారని ప్రతిపక్ష నేతలపై మండిపడ్డ మంత్రి అనిల్.. అలా మాట్లాడటానికి ఆయనకు బుద్ధుందా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయలసీమకు సంబంధించి సానుకూలంగా ఒక్కమాటైనా మాట్లాడారా? అని ప్రశ్నించిన ఆయన.. ఏపీ ప్రాజెక్టులను తెలంగాణ వ్యతిరేకిస్తుంటే.. ఈ రోజుకీ టీడీపీ స్టాండ్ ఏంటో చెప్పలేకపోతున్నారు.. ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయాలను పక్కనపెట్టి ఒకే తాటిపై నిలబడాలన్న ఇంగిత జ్ఞానం కూడా లేదని ఫైర్ అయ్యారు. ఓటుకు నోటుకు తంతే ఏపీలో పడ్డాడు.. ఏపీ ప్రజలు తంతే హైదరాబాద్ లో పడ్డాడు.. హైదరాబాద్ లో దాక్కున్న బాబు , చినబాబులను కేసీఆర్ ఎక్కడ మొత్తుతాడోనని భయం పట్టుకుందని.. మళ్లీ ఎక్కడ తంతాడోనని హైదరాబాద్ లో కూర్చుని వాళ్లకు వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు అనిల్.. కేఆర్ఎంబీకి, ప్రధానికి , కేంద్ర మంత్రులకు లేఖలు రాశాం.. మేం రాసిన లేఖలు కనిపించడం లేదా..? అంటూ నిలదీశారు.
Also Read
- AP Heatwave Alert: ఏపీలో ఎండల తీవ్రత.. వారం రోజుల పాటు హీట్వేవ్స్ హెచ్చరిక
- Explainer: పిడుగులు చంపుతున్నాయ్.. తెలుగు రాష్ట్రాలకు డేంజర్ అలెర్ట్!
- Byreddy Siddharth Reddy: “నన్ను తిట్టేవారికి బహుమతులు ఇస్తున్నారు”.. మంత్రి టీజీ భరత్పై బైరెడ్డి విమర్శలు..
- Ambati Rambabu: పెట్రో ధరలపై రిక్షా తొక్కి అంబటి నిరసన.. రెడ్ బుక్ నా మీదే కాదు.. జనసేన వాళ్లపై కూడా అమలు..!
తాజావార్తలు
-
Twisha Sharma: పెళ్లైన 5 నెలలకే తెలుగు హీరోయిన్ మృతి!
-
Noida Woman: ‘అమ్మా ఇక్కడ నరకంగా ఉంది’.. నోయిడా యువతి మర్డర్ కేసులో వాట్సాప్ చాట్ వైరల్..
-
Peddi Trailer Review: పెద్ది గుళ్ళో దేవుడు కాదు, గ్రౌండ్’లో దేవుడు.. ఆసక్తి రేకెత్తిస్తున్న ట్రైలర్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
Chiru – Bobby Movie: ‘చిరు 158’లోకి అదిరిపోయే ఎంట్రీ ఇచ్చిన ‘జైలర్’ డీవోపీ!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..