జగదీష్రెడ్డి ఫైర్.. తండ్రిని మించిన దుర్మార్గుడు జగన్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు రాష్ట్రాల మధ్య జల జగడంలో మాటల యుద్ధం రోజురోజుకీ తారస్థాయికి చేరుతోంది… ఏపీ సీఎం వైఎస్ జగన్పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు తెలంగాణ విద్యుత్శాఖ మంత్రి జగదీష్రెడ్డి… ప్రధాని నరేంద్ర మోడీకి ఏపీ సీఎం లేఖ రాయడంపై మండిపడ్డ ఆయన.. తండ్రిని మించిన దుర్మార్గుడు వైఎస్ జగన్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.. సమస్యను సృష్టించిందే ఆంధ్ర సర్కార్ అని విమర్శించిన ఆయన.. హైదరాబాద్ నీటి అవసరాలు పట్టవా? కోర్టుకిచ్చిన మాటను తప్పిందేవరు.? సర్వేల పేరిట నిర్మాణాలు కొనసాగిస్తోంది నిజం కాదా..? జీవోల పేరిట చిలకపలుకులు పలుకుతున్నారు.. తెలంగాణ అవసరాల కోసం ఒక్క జీవోను ఇచ్చారా..? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.
మద్రాస్కు మంచినీటి పేరుతో వైఎస్ రాజశేఖరరెడ్డి.. కృష్ణా నీళ్లను దోచుకున్నారు.. సాగర్ ఎడమ కాలువ కింద రైతాంగానికి 50 ఏండ్లు ద్రోహమే చేశారని మండిపడ్డారు జగదీష్రెడ్డి.. ఏడేళ్లు కరువులోనూ కృష్ణా డెల్టాకు నీళ్లు వదిలారు.. ఎడమ కాలువ ఎట్టుమీద కుడికాలువ కింది భాగంలో ఉందని.. హుకుంలు జారీ చేయడం, దౌర్జన్యం, బెదిరింపులతో శ్రీశైలం, సాగర్ గేట్లు తెరిపించారని.. ఆడుకుంటాం.. వాడుకుంటాం అంటే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నంత కాలం తెలంగాణ హక్కుల్ని ఎవరూ హరించ లేరన్న జగదీష్ రెడ్డి.. చట్టపరంగా విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది.. శ్రీశైలం ప్రాజెక్టు కట్టిందే జలవిద్యుత్ ఉత్పత్తి కోసమని స్పష్టం చేశారు. రైతులు ఎక్కడైనా రైతులే.. ఇరు రాష్ట్రాలకు పనికి వచ్చే ఫార్ములాను ముందుకు తెచ్చిందే ముఖ్యమంత్రి కేసీఆర్ అని.. ఫార్ములాను పక్కన పెట్టి అహంకారంతో పోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందులో తెలంగాణది ఏ మాత్రం తప్పులేదు.. తప్పు చేసినొళ్లే లేఖల పేరుతో పరిహాసం ఆడుతున్నారని ఫైర్ అయ్యారు మంత్రి జగదీష్ రెడ్డి.
Also Read
తాజావార్తలు
-
NIA Raids : ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. రామగుండంలో NIA మెరుపు దాడులు
-
Off The Record: ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు కేటీఆర్ వార్నింగ్..?
-
AP Liquor Scam Case: కారుమూరి అరెస్ట్పై ఈడీ కీలక ప్రకటన
-
Chairmans Desk : కాంగ్రెస్లో పాతకథ పునరావృతమౌతోందా.. రేవంత్ తక్షణ కర్తవ్యమేంటి..?
-
OTR: ప్రభాకర్ చౌదరి ఆరోపణలకు స్పందించని ఎమ్మెల్యే దగ్గుబాటి.. కారణం ఇదేనా..?
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!