25 వేల కోట్ల పెట్టుబడుల లక్ష్యంతో స్పేస్ పాలసీ రూపొందిస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. దీని ద్వారా ప్రత్యక్షంగా 5 వేలు, పరోక్షంగా 30 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా వేస్తున్నారు.. లేపాక్షి, తిరుపతిలో స్పేస్ సిటీల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందిస్తోంది ప్రభుత్వం.. 25 నుంచి 45 శాతం వరకు పెట్టుబడి రాయితీలు కూడా కల్పించనుంది.. విద్యార్ధులను భాగస్వాములు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.. ఆకర్షణీయంగా ఆంధ్రప్రదేశ్ స్పేస్ పాలసీ 4.0 ఉండాలని ఆదేశించారు…
అమరావతిలో రాష్ట్ర సచివాలయం, హెచ్వోడీ టవర్ల నిర్మాణానికి టెండర్లు ఖరారు చేసింది ప్రభుత్వం.. టెండర్లలో L1 గా నిలిచిన సంస్థలకు బిడ్లు ఆమోదిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.. ఎపీ సెక్రటేరియట్, హెచ్వోడీ కార్యాలయాలు (GAD టవర్) నిర్మాణ పనులను ఎన్ సీసీ లిమిటెడ్.. రూ. 882.47 కోట్లకు దక్కించుకుంది.. సచివాలయంలోని జీఏడీ టవర్ను నిర్మించనుంది ఎన్ సీసీ లిమిటెడ్ సంస్థ.. ఇక, సచివాలయంలోని 1, 2, హెచ్వోడీ టవర్ల నిర్మాణ పనులను షాపూర్ జీ పల్లోంజీ కంపెనీ…
నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలంలో కొణిదెల అనే గ్రామం ఉంది.. ఆ గ్రామంలో తాగునీటి ట్యాంకు నిర్మాణానికి పవన్ కల్యాణ్ ట్రస్టు ద్వారా 50 లక్షల రూపాయలు ఇచ్చారు.. ఎన్నికలకు ముందు నియోజకవర్గ పర్యటనలో పవన్ కల్యాణ్ కొణిదెల గ్రామాన్ని సందర్శించినప్పుడు తన ఇంటిపేరుతో ఊరు ఉందన్న విషయం తనకు తెలియదని.. తాము అధికారంలోకి వస్తే ఈ కొణిదేల గ్రామాన్ని దత్తాతకు తీసుకుంటానని హామీ ఇచ్చారు..
తూర్పు గోదావరి జిల్లా రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ పేరు చెబితేనే నియోజకవర్గంలో చాలామంది హడలిపోతున్నారట. అలాగని ఆయనేమన్నా... అసాంఘిక శక్తుల్ని ఉక్కుపాదంతో అణిచివేస్తున్నారా.. అవినీతిపరుల భరతం పడుతున్నారా అంటే.... అబ్బే.. అలాంటిదేం లేదు. అసలు ఎమ్మెల్యే అనుచరుల తీరే తేడాగా ఉందన్న గుసగుసలు వినిపిస్తున్నాయట లోకల్గా. టీడీపీ, బీజేపీతో పొత్తు ఉన్నా... అది రాజకీయం వరకేగానీ... మిగతా వ్యవహారాల్లో మన రూటే సపరేటు అంటున్నారట ఈ జనసేన శాసనసభ్యుడి అనుచరులు.
మంచు విష్ణు హీరోగా, ప్రభాస్, మోహన్లాల్, శరత్ కుమార్, అక్షయ్ కుమార్ వంటి వారు కీలక పాత్రలలో నటించిన తాజా చిత్రం కన్నప్ప. ఈ చిత్రం ఇప్పటికే పలుమార్లు వాయిదా పడినప్పటికీ, ఎట్టకేలకు జూన్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే, సినిమా విడుదలకు కొద్ది గంటల ముందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంచు విష్ణు టీమ్కు శుభవార్త చెప్పింది. Also Read: Raashi Khanna : టాప్ లెస్ ట్రీట్ ఇస్తున్న రాశిఖన్నా.. ఈ సినిమాకు…
రెడ్ బుక్.... ఏపీ పాలిటిక్స్లో ఇదో హాట్ సబ్జెక్ట్. దీనికి సంబంధించే అధికార, ప్రతిపక్ష నాయకుల మధ్య తరచూ ఆరోపణలు, సవాళ్ళ పర్వం నడుస్తూ ఉంటుంది. మంత్రి లోకేష్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ రెడ్బుక్ ఓపెన్ చేస్తే... ఇప్పుడు టీడీపీ నాయకులు కొందరు లోకల్ బుక్స్ని ఓపెన్ చేసేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. పైగా... లోకేష్ తన రెడ్బుక్ని క్లోజ్ చేసినా... నేను మాత్రం సంగతి తేలేదాకా మూసే ప్రసక్తే లేదని అంటున్నారట గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం.
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిపోయింది. సుపరిపాలనకు సంవత్సరం పేరిట వేడుకలు కూడా చేసుకుంటున్నారు. ఇదే... ఫస్ట్ ఇయర్లో ఏ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది? ఎవరి ప్లస్లు ఏంటి? ఎవరి మైనస్లు ఏంటి? ఎవరెవరు ఏమేం చేస్తున్నారు? ఎక్కడెక్కడ తిరుగుతున్నారు? ఎలాంటి లావాదేవీలు చేస్తున్నారు, ఇరుక్కుంటున్నారంటూ.... డీటెయిల్డ్ రిపోర్ట్ తెప్పించుకుంటున్నారట సీఎం చంద్రబాబు.
విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణలో కీలక దశ ప్రారంభమైంది. 100శాతం ఉత్పత్తి లక్ష్యంగా మూడవ బ్లాస్ట్ ఫర్నేస్ పునఃరుద్ధరణకు ముహూర్తం ఫిక్స్ అయింది. మరోవైపు, 11వేల కోట్ల ఆర్ధిక సహాయం కేంద్రం ప్రకటించిన తర్వాత RINLలో కీలక మార్పులు సంభవించాయి. సంస్కరణలు అమలు చేస్తున్న యాజమాన్యం తాజాగా రెండు కీలక విభాగాలను ప్రయివేటీకరించేందుకు నిర్ణయించింది.
ఇందిరాగాంధీ మెడలు వంచి ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు.. అది ప్రజాస్వామ్య విజయం అన్నారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు.. ఎన్టీఆర్కు మెజార్టీ ఎమ్మెల్యేలు ఉన్నా ఆయన ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేశారు.. ప్రజాస్వామ్యవాదులతో కలిసి 30 రోజులు పోరాటం చేసి ఎన్టీఆర్ విజయం సాధించారు.. ఇందిరా గాంధీ మెడలు వచ్చారని పేర్కొన్నారు..