YS Jagan Tour: రేపు చిత్తూరు పర్యటనలో జగన్ రైతులతో ఇంటరాక్షన్ కార్యక్రమం మాత్రమే..
- రేపు చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో వైఎస్ జగన్ పర్యటన..
- జగన్ పర్యటనపై చిత్తూరు జిల్లా పోలీసుల ఆంక్షలు అమలు..
- జగన్ రైతులతో ఇంటరాక్షన్ కార్యక్రమం మాత్రమే..
- ఎవరైనా రూల్స్ అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక: ఎస్పీ మణికంఠ చందోలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Jagan Tour: రేపు చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటించననున్నారు. ఈ సందర్భంగా కనీసం మద్దతు ధర లేక ఇబ్బంది పడుతున్న మామిడి రైతులకు ఆయన పరామర్శించనున్నారు. ఈ నేపథ్యంలో జగన్ పర్యటన నేపథ్యంలో జిల్లా పోలీసులు ఆంక్షలు విధించారు. ఇక, మీడియాతో జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు మాట్లాడుతూ.. వైఎస్ జగన్ పర్యటనకు సంబంధించి ఇప్పటి వరకు 375 మందికి నోటీసులు జారీ చేశామని తెలిపారు. ఇది కేవలం రైతులతో ఇంటరాక్షన్ కార్యక్రమం మాత్రమే.. కొంతమంది జన సమీకరణ చేసి బహిరంగ సభలా మార్చాలని చూస్తున్నారు.. ద్విచక్ర వాహనాలకు పెట్రోల్ పోయించి ర్యాలీలకు సిద్దమవుతున్నారు.. ఆటోల ద్వారా జనాలను తరలించడానికి ప్రయత్నిస్తున్నారు.. ఎవరైతే ఈ విధంగా చేస్తున్నారో వారిపై సాక్ష్యాదారాలతో సహా కేసులు నమోదు చేసి రౌడీషీట్ ఓపెన్ చేస్తామని ఎస్పీ మణికంఠ పేర్కొన్నారు.
Also Read
- RK Roja: రాజకీయాలంటేనే టెన్షన్.. ఎమ్మెల్యే అయ్యాకే బీపీ, షుగర్ ఎటాక్..!
- Chittoor Mayor Couple Murder Case: మాజీ మేయర్ కఠారి దంపతుల హత్య కేసు.. మరోసారి కోర్టు సీరియస్.. కలెక్టర్కు కీలక అదేశాలు..
- AP Crime: పేకాటలో బాకీ వివాదం.. స్నేహితుడిని తుపాకీతో కాల్చి చంపిన యువకుడు..
- Young Man D*ied with Heart Attack in Gym: జిమ్లో గుండెపోటుతో యువకుడు మృతి..
అయితే, గతంలో సత్యసాయి, ప్రకాశం, గుంటూరు జిల్లాలో జరిగిన ఘటనల నేపథ్యంలో ప్రస్తుతం కఠినంగా వ్యవహరించక తప్పదని ఎస్పీ మణికంఠ చందోలు తెలిపారు. రైతుల పరిచయ కార్యక్రమానికి 500 మందిని మాత్రమే అనుమతిస్తున్నాం.. మరో 30 మందిని హెలిప్యాడ్ వద్దకు పర్మిషన్ ఇచ్చాం.. ఈ పరిధి దాటితే ఖచ్చితంగా నిర్వాహకులపైనా చర్యలు తీసుకుంటాం అని పోలీసులు హెచ్చరించారు.
తాజావార్తలు
-
Milk: ఈ 8 ఆహారాలను పాలతో కలిపి తీసుకుంటే రిస్క్లో పడ్డట్లే..
-
Veerabhadrudu : అన్నపూర్ణ స్టూడియోస్ ద్వారా సూర్య ‘వీరభద్రుడు’ రిలీజ్
-
Tamil Nadu: గవర్నర్ను కలిసిన విజయ్.. ఎమ్మెల్యేల మద్దతు లేఖ అందజేత
-
Terror Threat to Delhi BJP HQ: ఢిల్లీ బీజేపీ కార్యాలయానికి ఉగ్ర ముప్పు.. రాజధానిలో హై అలర్ట్ ప్రకటించిన భద్రతా సంస్థలు!
-
Uttar Pradesh: బీజేపీ “మిషన్ యూపీ 2027” స్టార్ట్ .. యోగీ సర్కార్ కీలక చర్య..