వైసీపీలో పాలకొల్లు సీటు ఎవరిది? ఎన్నికలకు ఇంకా చాల టైమ్ ఉన్నా.. అధికారపార్టీలో స్థానికంగా ఈ అంశంపై పెద్ద చర్చే జరుగుతోంది. గతంలో పార్టీ నుంచి వెళ్లిపోయిన నాయకుడు తిరిగి వైసీపీ కండువా కప్పుకోవడంతో సమీకరణాలపై ఆసక్తి రేగుతోంది. దీంతో టికెట్ ఆశిస్తున్న నేత పరిస్థితి ఏంటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో పాలకొల్లు టికెట్ తనదే అన్న ధీమాలో కవురు..! కవురు శ్రీనివాస్. పశ్చిమగోదావరి జిల్లా పరిషత్ ఛైర్మన్. పాలకొల్లు వైసీపీ ఇంఛార్జ్. రాష్ట్రంలో వైసీపీ…
ఓ వైపు ఇప్పటికే పీఆర్సీ ప్రిక్రియ పూర్తి అయ్యింది.. మరో పది రోజుల్లో పీఆర్సీ ప్రకటన చేస్తామంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెబుతుంటే.. తమ ఆందోళన మాత్రం ఆపేదిలేదని స్పష్టం చేస్తున్నారు ఉద్యోగ సంఘాల నేతలు.. తిరుపతిలో పీఆర్సీపై సీఎం వైఎస్ జగన్ చేసిన కామెంట్లపై స్పందించిన ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు, ఫ్యాప్టో అధ్యక్షుడు శ్రీధర్… మా ఉద్యమ కార్యాచరణ కొనసాగుతుందని ప్రకటించారు… మాకు పీఆర్సీ పై ప్రభుత్వం నుంచి ఎటువంటి అధికారిక…
ఓటీఎస్ పేరుతో పేద ప్రజలను ప్రభుత్వం ఇబ్బంది పెడుతుంది అని టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. గత ప్రభుత్వాలు పేదలకు ఇళ్లు, ఇళ్ల స్థలాలు ఇచ్చాయి. రూ. 6 వేల కోట్ల దోపిడీ లక్ష్యంగా ఓటీఎస్ అమలుకు ప్రయత్నం చేస్తుంది. డ్వాక్రా గ్రూపుల నుంచి మహిళ పొదుపు సొమ్ము కూడా బలవంతంగా ప్రభుత్వం లాక్కుంటుంది.జగనన్న కాలనీలను అభివృద్ధి చెయ్యడం చేతకాని ప్రభుత్వం .. పేదలను ఓటీఎస్ పేరుతో పీడిస్తుంది. ఆంధ్రప్రదేశును అమ్మకానికి పెట్టారు..…
ఏపీలో జవాద్ తుఫాన్ రూపంలో మరో వాన గండం వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ తుఫాన్ హెచ్చరికలతో ఏపీ రైతాంగం ఆందోళనలో ఉంది. 20 రోజుల క్రితం కురిసిన వర్షాలకు ఇంకా కోలుకోని రైతాంగం… ఈ వర్షాల కారణంగా సగం పండిన వరిని కోసి కల్లాల్లో భద్రపరుస్తున్నారు. కుప్పలు వేసి భద్రపరచినా ధాన్యం రంగు మారే అవకాశం ఉండడంతో ఆందోళన చెందుతున్నారు రైతులు. ధాన్యం రంగు మారినా, మొలక వచ్చినా ప్రభుత్వం కొనుగోలు చేయాలని రైతులు…
ఆంధ్రప్రదేశ్లో పీఆర్సీ కోసం ఉద్యోగ సంఘాలు ఆందోళనబాట పట్టాయి… ఇందులో భాగంగా భవిష్యత్ కార్యాచరణపై సీఎస్ సమీర్ శర్మకు ఇప్పటికే నోటీసులు ఇచ్చారు. వారంలోగా ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమంలోకి వెళ్తామని హెచ్చరించాయి.. అయితే, ఇవాళ పీఆర్సీపై కీలక ప్రకటన చేశారు ఏపీ సీఎం వైఎస్ జగన్.. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న సీఎం జగన్ను తిరుపతిలోని సరస్వతీ నగర్లో ఉద్యోగుల తరపున కొందరు ప్రతినిధులు కలిశారు.. ఈ సందర్భంగా.. పీఆర్సీపై సీఎంకు విజ్ఞప్తి చేశారు.. దీనిపై స్పందించిన…
ఏపీపై వైపు మరో తుఫాన్ తూసుకొస్తోంది.. ఇప్పటికే ఉత్తరాంధ్రపై తీవ్ర వాయుగుండం ప్రభావం ప్రారంభమైంది.. తీరం వెంబడి క్రమేపీ గాలుల తీవ్రత కూడా పెరుగుతోంది.. సముద్రం అలజడిగా మారిపోయింది.. ఈదురు గాలులు తీవ్రత క్రమంగా పెరగడంతో.. వాతావరణంలో కూడా మార్పులు చోటు చేసుకుంటున్నాయి.. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల అధికారులు, DMHOలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని కీలక సూచనలు చేశారు.. తుఫాన్ నేపథ్యంలో…
ఏపీ సీఎం జగన్పై టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్ వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్లింది ఎందుకంటూ ఆయన సూటిగా ప్రశ్నించారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా ఓ ఫోటోను షేర్ చేశారు. ‘ముఖ్యమంత్రి గారూ… మీరు వెళ్లింది మీ ఇసుక మాఫియాల కోసం జలసమాధి అయిపోయిన 60 మంది కుటుంబసభ్యులను పరామర్శించడానికి. మీ వంధిమాగదులతో సెల్ఫీలు తీసుకోవడానికి కాదు’ అని లోకేష్ ఆరోపించారు. ‘మీరు వెళ్లింది..…
దూసుకొస్తున్న జవాద్ తుఫాన్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ను భయపెడుతోంది… తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థకు జవాద్ తుఫాన్ టెన్షన్ పట్టుకుంది.. గంటలకు 100 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వస్తే నష్టం తప్పదని అంచనా వేస్తున్నారు అధికారులు… ముందస్తు చర్యల్లో భాగంగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు.. గాలుల వేగం గంటలకు 50 కిలోమీటర్లు దాటితే ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తుగా విద్యుత్ సరఫరా నిలిపివేయాలని నిర్ణయించారు.. ఇక, సమస్య తలెత్తిన సబ్ స్టేషన్లు, ఫీడర్లు మరమ్మత్తు కోసం ప్రత్యేక…
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వర రావు ఇంట్లో విషాదం నెలకొంది… దేవినేని ఉమ తండ్రి దేవినేని శ్రీమన్నారాయణ (చిన్ని) కన్నుమూశారు.. విజయవాడలోని రమేష్ ఆస్పత్రిలో గుండెపోటుతో ఆయన మృతిచెందినట్టు కుటుంబసభ్యులు చెబుతున్నారు.. ఆయన వయస్సు 88 సంవత్సరాలు.. కంకిపాడు మండలం నెప్పల్లి శ్రీమన్నారాయణ స్వగ్రామం కాగా.. కంచికచర్లలో స్థిరపడ్డారు. క్రియాశీలక రాజకీయాల్లో ఎప్పుడూ పాల్గొనకపోయినప్పటికీ ఆయన ఇద్దకు కుమారులు స్వర్గీయ దేవినేని వెంకటరమణ, దేవినేని ఉమామహేశ్వరరావుల ఎన్నికల ప్రచారంలో పలు సందర్భాల్లో…
బంగాళాఖాతంలో వాయుగుండం తీవ్ర తుఫానుగా మారనుంది. ప్రస్తుతం వాయుగుండం విశాఖకు దక్షిణ ఆగ్నేయంగా 960 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఈ వాయుగుండం తీవ్ర తుఫాన్గా మారే అవకాశం ఉందని… ఇది డిసెంబర్ 4న వేకువజామున ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా మధ్య తీరం దాటుతుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ తుఫాన్కు అధికారులు జవాద్ అని నామకరణం చేశారు. జవాద్ తుఫాన్ నేపథ్యంలో ఉత్తరాంధ్ర వాసులు భయం గుప్పిట్లో బతుకుతున్నారు. జవాద్ తుఫాన్ ప్రభావంతో…