ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సొంత జిల్లాలో పర్యటిస్తున్నారు… ఇవాళ రెండో రోజు కడప జిల్లాలో ఆయన పర్యటన కొనసాగనుంది.. ఇడుపులపాయలోని వైఎస్ రాజశేఖరెడ్డి సమాధి దగ్గర నివాళులర్పించనున్న సీఎం.. ఆ తర్వాత పలు అభివృద్ధి కార్యక్రమాలు, శంకుస్థాపనల్లో పాల్గొననున్నారు.. ఇక, పులివెందులలో జరగనున్న బహిరంగసభలో పాల్గొని ప్రసంగించనున్నారు. సీఎం వైఎస్ జగన్ రెండో రోజు పర్యటన వివరాలను పరిశీలిస్తే.. ఉదయం ఇడుపులపాయలో వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధి వద్ద నివాళులర్పించనున్నారు.. అనంతరం ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం…
ఏపీలో సినిమా టిక్కెట్ రేట్లపై మంత్రి బొత్స ఇచ్చిన వ్యాఖ్యలకు ప్రముఖ నిర్మాత శోభు యార్లగడ్డ కౌంటర్ ఇచ్చారు. ప్రతి వస్తువుకు ఎమ్మార్పీ ఉంటుందని.. అలాగే సినిమా టిక్కెట్లకు కూడా ఎమ్మార్పీ అవసరమని.. ఇష్టం వచ్చినట్లు టిక్కెట్ రేట్లను పెంచుకుంటామంటే ఎలా అని మంత్రి బొత్స చేసిన వ్యాఖ్యలపై నిర్మాత శోభు యార్లగడ్డ స్పందిస్తూ… ఎమ్మార్పీ అనేది ఓ వస్తువు ఉత్పత్తిదారులు నిర్ణయిస్తారని స్పష్టం చేశారు. అంతే తప్ప.. ఎమ్మార్పీ ధరలు ప్రభుత్వం నిర్ణయించదని చురకలు అంటించారు.…
ఏపీలో సినిమా టిక్కెట్ల అంశం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. సినిమా టికెట్ల రేట్లు తక్కువగా ఉంటే ప్రజలకు మంచిదంటూ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలకు టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి కౌంటర్ ఇచ్చారు. ‘సినిమా అందరికి అందుబాటులో ఉండాలి. అందుకే ధరలు తగ్గించాం- మంత్రి బొత్స. మరి నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉండక్కర్లేదా వైఎస్ జగన్ గారూ. అవి కూడా తగ్గించండి- ప్రజలు’ అంటూ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ట్వీట్ చేశారు. Read…
ఏపీలో సినిమా టిక్కెట్ రేట్ల విషయంలో హీరో నాని చేసిన వ్యాఖ్యలు పొలిటికల్ హీట్ రేపుతున్నాయి. ఇప్పటికే హీరో నాని వ్యాఖ్యల పట్ల పలువురు మంత్రులు స్పందించగా.. తాజాగా మంత్రి కన్నబాబు కూడా కౌంటర్ ఇచ్చారు. హీరో నాని చేసిన వ్యాఖ్యలకు అర్థం ఏమిటో తనకు తెలియలేదని ఎద్దేవా చేశారు. థియేటర్లలో టికెట్ల రేట్లు సహా పార్కింగ్, తిను బండారాలపై దోపిడీ జరుగుతోందని మంత్రి కన్నబాబు వ్యాఖ్యానించారు. టికెట్ ధరలను నియంత్రించడం కూడా ప్రభుత్వ బాధ్యత అని…
ఆంధ్రప్రదేశ్ లో రోజు కరోనా కేసులు పెరుగుతూ… తగ్గుతూ వస్తున్నాయి. ఇక తాజా బులిటెన్ ప్రకారం గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 31, 158 శాంపిల్స్ పరీక్షించగా.. 135 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. మరో ముగ్గురు కరోనా బాధితులు మృతిచెందారు. ఇక, ఇదే సమయంలో 164 మంది కోవిడ్ నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నారు. దీంతో.. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య 3,10,98,568 కు చేరుకోగా… మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య…
ఆ మాజీ మంత్రి నోట కొత్త పలుకులు వినిపిస్తున్నాయ్. ఎప్పుడూ రాజకీయాలు, ఎత్తుగడలు మాట్లాడే ఆయన.. ఈసారి కులం కెపాసిటీ గురించి చర్చిస్తున్నారు. అదీ ఎన్నికలకు రెండున్నరేళ్ల ముందు నుంచీ. అంతర్మథనంలో ఉన్న సామాజికవర్గానికి దిక్సూచిగా మారాలనే ఆలోచన ఉందా? లేక రాజకీయాల్లో చురుకైన పాత్రకు వేసిన వ్యూహమా? గంటా చూపు జనసేన వైపు అని పుకార్లు షికారు..! గంటా శ్రీనివాసరావు. మాజీ మంత్రి. టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన రెండున్నరేళ్లుగా మౌనంగా ఉంటున్నారు. అధికారం…
ఏపీలో ప్రస్తుతం సినిమా టిక్కెట్ల రేట్ల అంశం మరోసారి హాట్ టాపిక్గా మారింది. ఎంతోమంది కార్మికులు ఆధారపడ్డ సినిమా థియేటర్ల కంటే వాటి పక్కన ఉండే కిరాణాషాప్ వాళ్లు ఎక్కువ సంపాదిస్తున్నారంటూ హీరో నాని చేసిన కామెంట్లు అధికార పార్టీలో వేడిని పుట్టించాయి. మార్కెట్లో ప్రతిదానికి ఎమ్మార్పీ ఉన్నట్లే సినిమా టిక్కెట్లకు కూడా ఎమ్మార్పీ అవసరమని.. ఇష్టం వచ్చినట్లు టిక్కెట్ రేట్లను పెంచుకుంటామంటే ఎలా అని హీరో నానికి మంత్రి బొత్స కౌంటర్ ఇచ్చారు. అయితే హీరో…
చిత్తూరు జిల్లాలో మొత్తం 37 సినిమా థియేటర్ల మూసివేతకు ఆదేశాలు ఇచ్చారు. మదనపల్లిలో 7, కుప్పంలో 4, వి కోట 3, బి.కొత్తకోట 2, పీలేరు 4, పుంగనూరు 4, పలమనేరు 4, రొంపిచర్ల 2, కలికిరి 2, సదుం మొలకల చెరువు, గుర్రంకొండ, కలకడ, తంబల్ల పల్లిలలో ఒక్కే థియేటర్ కు నోటీసులు ఇచ్చారు. అయితే ఈ మధ్యాహ్నం నుంచే 30కి పైగా థియేటర్లు మూతపడ్డయి. అయితే ఈ విషయం పై మీడియాతో మదనపల్లె సబ్…