ఏపీలో థియేటర్లపై కొనసాగుతున్న సోదాలు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో నిబంధనలు ఉల్లంఘిస్తూ సినిమా ప్రదర్శనలు చేస్తున్న థియేటర్స్పై అధికారులు ఉక్కు పాదం మోపుతున్నారు. వరుసగా నాలుగోరో¤జూ థియేటర్లలో తనిఖీలు నిర్వహించారు. అన్ని రకాల అనుమతులు ఉన్నది లేనిది పరిశీలించడంతో పాటు టిక్కెట్లు అమ్మకాలపై దృష్టి సారించారు. నిబంధనలు ఉల్లంఘించిన, టిక్కెట్ల ధరలు అధికంగా అమ్ముతున్న థియేటర్లకు జరిమానాలు విధించడం తో పాటు తాళాలు వేస్తున్నారు
సినిమా టికెట్ల ధరలు తగ్గించి అమ్మాలని స్పష్టం చేసిన ప్రభుత్వం.. వరుసగా నాలుగోరోజూ రాష్ట్రవ్యాప్తంగా థియేటర్లలో సోదాలు నిర్వహిస్తోంది. కలెక్టర్, ఎస్పీ సహా పలువురు ఉన్నతాధికారులు… దియేటర్లను ఆకస్మికంగా తనిఖీలు చేస్తూ, సినిమా టిక్కెట్ ధరలు సహా ఇతర అంశాలను పరిశీలిస్తున్నారు. ధియేటర్లలో ధరలను విధిగా ప్రదర్శించాలని , అధికధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు.
Also Read
- PM Modi 12 Years Governance: డిజిటల్ విప్లవం నుంచి గ్లోబల్ ప్రభావం వరకు.. మోడీ 12 ఏళ్ల పాలనపై చంద్రబాబు ప్రశంసలు..
- Nara Lokesh: అదనంగా రూ.25 లక్షలు.. మృతుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇస్తాం!
- Pawan Kalyan: 33 ఏళ్లలో ఇలాంటి ప్రమాదం జరగలేదు.. ప్రైవేటీకరణ జరగకూడదన్నదే మా ఆకాంక్ష!
- Nara Lokesh: డబ్బులిచ్చి చేతులు దులుపుకోవడానికి రాలేదు.. మంత్రి లోకేశ్ ఫైర్!
కడప జిల్లా ప్రొద్దుటూరులోని నాలుగు థియేటర్లపై అభియోగాల నేపథ్యంలో షోకాజ్ నోటీసులు జారీకావడం థియేటర్ యజమానుల్లో చర్చనీయాంశమైంది.వెంకటేశ్వర, చాంద్, అరవేటి, సుధా థియేటర్లలో అనుమతిలేకుండా బెనిఫిట్ షోలు వేయడంతో …ఆ ధియేటర్ల యాజమాన్యాలకు జేసీ షోకాజ్ నోటీసులు పంపారు. శ్రీకాకుళం జిల్లా కొత్తూరు, పాలకొండమండలం అన్నవరంలో దియేటర్ లు మూత పడ్డాయి. తగ్గించిన ధరలతో మూవీ వేయలేమంటూ స్వచ్చందంగా దియేటర్ మూసివేశారు. పశ్చిమగోదావరి జిల్లా నల్లజర్ల లోనీ శ్రీ శ్రీనివాస థియేటర్ ను రెవెన్యూ అధికారులు మూసివేశారు. భీమవరంలోని …కిషోర్, నటరాజ్, విజయలక్ష్మి, పద్మాలయా థియేటర్లు ఫామ్ బి లైసెన్స్ లేకుండానే షోలు నిర్వహిస్తున్నట్టు గుర్తించారు.వెంటనే షోలు నిలిపివేయాలని ఆదేశించారు
మరోవైపు థియేటర్స్ను నమ్ముకుని జీవితాన్ని గడుపుతున్న ఆపరేట్లర్లు , హెల్పర్స్.. ఈ పరిణామంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత రెండేళ్లుగా కోవిడ్ కారణంగా దియేటర్లు మూసివేసి ఉంచారని , ప్రస్తుతం హాళ్లు తెరుచుకుంటున్న తరుణంలో ఇలా కావడంతో తాము తీవ్రంగా నష్టపోతామంటున్నారు.
నిబంధనలు పాటించకుంటే, కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే టికెట్లు అమ్మాల్సి ఉందని స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Dude 2: ఆ క్రేజీ ఐడియా వర్కవుట్ అయితే ‘డ్యూడ్ 2’ పక్కా.. అంచనాలు పెంచేసిన డైరెక్టర్!
-
Toxic : టాక్సిక్ రిలీజ్ ఉన్నట్టా? లేనట్టా?
-
POK Protest: పీఓకేలో రక్తపాతం.. పాకిస్తాన్ దుర్మార్గాలపై భారత్ ఆగ్రహం..
-
Rajinikanth : ‘జైలర్ 2’తో బాకీ తీర్చేందుకు వస్తున్న రజినీకాంత్
-
Budhaditya Rajyog 2026: మిథునంలో సూర్యుడు.. 5 రాశుల వారికి రాజయోగాల జాక్పాట్.!
ట్రెండింగ్
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!