అమరావతిపై సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి గుడివాడ అమర్నాథ్… అమరావతి దేవతల రాజధాని కాదు దెయ్యాల రాజధానిగా పేర్కొన్న ఆయన.. మూడు రాజధానులపై కొత్త బిల్లుతో వస్తాం అన్నారు.. వచ్చే సమావేశాల్లో బిల్లు పెట్టేందుకు అవకాశం ఉండొచ్చు అని సంకేతాలిచ్చారు. అసెంబ్లీ సమావేశాల తర్వాత భోగాపురం ఎయిర్ పోర్ట్ శంకుస్థాపన చేస్తామని ప్రకటించారు.. మరోవైపు.. చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు మంత్రి… హైదరాబాద్ అభివృద్ధి నేనే శిల్పినని చంద్రబాబు చెప్పుకోవడం చూస్తే కులీకుతుబ్ షా ఉరేసుకుంటాడని సెటైర్లు వేసిన…
ప్రధాని నరేంద్ర మోడీపై ప్రశంసలు కురిపించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఆయనకు ఒక విజ్ఞప్తి కూడా చేశారు.. వలసవాద పాలనా చిహ్నాలను చెరిపేస్తున్న మోడీ అభినందనీయులని పేర్కొన్న పవన్.. కర్తవ్య పథ్ అనేది భారతీయత ఉట్టిపడే నామ ధేయం.. బ్రిటీష్ పాలనలో కింగ్స్ వే .. ఆ తరవాత రాజ్ పథ్ గా మారి ఇప్పుడు కర్తవ్య పథ్ గా అవతరించింది.. బ్రిటీష్ రాచరిక పాలన అంతరించి 75 ఏళ్ళు గడిచినా వారి వలసవాద పాలనకు…
అమరావతి రైతుల మహా పాదయాత్రకు అనుమతి ఇచ్చింది ఆంధ్రప్రేదశ్ హైకోర్టు.. అయితే, కొన్ని పరిమిత ఆంక్షలతో మహా పాదయాత్రకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది… పాదయాత్రకు అనుమతి కోరుతూ అమరావతి పరిరక్షణ సమితి.. హైకోర్టులో పిటిషన్ ధాఖలు చేసింది.. 600 మంది పాదయాత్రలో పాల్గొనేలా అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది… వాదనలు విన్న హైకోర్టు పాదయాత్రకు అనుమతి ఇవ్వడగా.. పాదయాత్రలో పాల్గొనే వారికి ఐడీ కార్డులివ్వాలని సూచించింది.. ఇక, పాదయాత్ర ముగింపు రోజు మహాసభకు ముందుగానే అనుమతి…
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ… తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. తెలంగాణ గవర్నర్ వ్యవహార శైలి సరికాదు… ఆమె ప్రజల చేత ఎన్నుకోబడిన వ్యక్తిలా పనిచేస్తున్నారు… ఆమెకు సంబంధం లేని వాటిలో జోక్యం చేసుకుంటున్నారని మండిపడ్డారు.. అంతే కాదు.. తెలంగాణ గవర్నర్ ను వెంటనే రీకాల్ చేయాలని డిమాండ్ చేశారు నారాయణ.. మరోవైపు.. పుచ్చలపల్లి సుందరయ్య, రావి నారాయణ రెడ్డి విగ్రహాలను పార్లమెంట్ లో ఏర్పాటు…
నేను క్షేత్ర స్థాయి నుండి భారత దేశ రెండో అత్యున్నత పదవి వరకు వెళ్లాను.. నాకు ఇచ్చిన బాధ్యత నేను సమర్ధవంతంగా నిర్వహించాను.. కానీ, నాకు నచ్చిన పదవులు రాజ్యాంగ పదవులు కాదు.. ప్రజలతో మమేకమయ్యే పదవులు నాకు ఎంతో ఇష్టం అంటూ మరోసారి తన మనసులోని మాటలను బయటపెట్టారు భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు.. ఏపీలో పర్యటిస్తున్న ఆయన.. పలు కార్యక్రమాల్లో పాల్గొంటూ.. తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.. నిన్నటి నిన్నే ఆయన.. తాను…
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే వర్షాలు దంచికొడుతున్నాయి.. ఆంధ్రప్రదేశ్తో పాటు హైదరాబాద్ సహా తెలంగాలోని కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి.. అయితే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మళ్లీ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ చెబుతోంది.. పశ్చిమ మధ్య మరియు ఆనుకుని ఉన్న తూర్పుమధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది… ఇది రానున్న 48 గంటల్లో పశ్చిమ మధ్య మరియు ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతం ఉత్తరాంధ్ర – దక్షిణ ఒడిశా తీరాల వెంబడి బలపడుతోందని తెలిపారు…
* నేడు గణేష్ నిమజ్జన కార్యక్రమం… హుస్సేన్సాగర్ సహా హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో ఏర్పాట్లు.. * నేడు గంగమ్మ ఒడికి ఖైరతాబాద్ మహాగణపతి… * నేడు హైదరాబాద్ మెట్రో రైళ్ల సమయం పెంపు.. ఉదయం 6 గంటల నుంచి అర్ధరాత్రి 2 గంటల వరకు మెట్రో సర్వీసులు * గణేష్ నిమజ్జనం కోసం హుస్సేన్సాగర్ దగ్గర భారీ ఏర్పాట్లు * ఇవాళ ఉదయం నుంచి రేపు ఉదయం వరకు హుస్సేన్సాగర్ పరిసర ప్రాంతాలు సహా పలు ప్రాంతాల్లో…
వ్యవసాయ అనుబంధ రంగాలపై సమీక్ష నిర్వహించారు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి.. అధికారులకు కీలక సూచనలు చేశారు.. ఆర్బీకేల పరిధిలో వైయస్సార్ యంత్రసేవ కింద ఇస్తున్న పరికరాలు, యంత్రాలు అన్నీ కూడా రైతులకు అందుబాటులో ఉండాలని.. సంబంధిత ఆర్బీకేల పరిధిలో ఉన్న యంత్రాలు ఏంటి? పరికరాలు ఏంటి? వాటిద్వారా ఎలాంటి సేవలు లభిస్తాయన్న వివరాలు ఆర్బీకేల్లో ఉంచాలన్నారు. ఈ వివరాలతో సమగ్రమైన పోస్టర్లను ఆర్బీకేల్లో డిస్ప్లే చేయాలన్న ఆయన.. అందుబాటులో ఉన్న యంత్రాలు, వాటి సేవల వివరాలను సమగ్రంగా…
గత ప్రభుత్వం అమరావతిని రాజధానిగా నిర్ణయిస్తే.. వైసీపీ సర్కార్.. రాష్ట్రంలో మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని చెబుతోంది.. ఆ దిశగా అడుగులు వేస్తోంది.. అయితే, ఏపీ లెజిస్లేటివ్ క్యాపిటల్గా మారనున్న అమరావతిని.. మున్సిపాలిటీ చేసే దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.. 22 గ్రామపంచాయతీలతో అమరావతి మున్సిపాలిటీ ఏర్పాటు చేయసేందుకు సిద్ధమైంది.. తుళ్లూరు, మంగళగిరి మండలాల్లోని 22 గ్రామాలతో మున్సిపాలిటీ ఏర్పాటు కానున్నట్టు సమాచారం.. ఈ మేరకు, గ్రామ సభలు నిర్వహించాలని కలెక్టర్ కు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ…
టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి నారా లోకేష్పై మరోసారి ధ్వజమెత్తారు వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్నినాని.. లోకేష్ కి ట్విట్టర్ ఒకటి తేరగా దొరికింది.. ఏదంటే అది ట్వీట్ చేస్తున్నాడు అంటూ ఎద్దేవా చేశారు.. లోకేష్ మంత్రి ఎలా అయ్యాడు…? అని ప్రశ్నించారు. ఆ రోజు మంత్రి పదవి పీకేస్తే పీతల సుజాత బోరు బోరున విలపించారన్న ఆయన.. మరి అప్పుడు ఇదే మాట తండ్రికి ఎందుకు చెప్పలేదు? మీ హయాంలో బొజ్జల,…