Perni Nani: లోకేష్ కోసం ఐదుగురు మంత్రులను పీకేశారు.. బాంబ్ పేల్చిన పేర్నినాని..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి నారా లోకేష్పై మరోసారి ధ్వజమెత్తారు వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్నినాని.. లోకేష్ కి ట్విట్టర్ ఒకటి తేరగా దొరికింది.. ఏదంటే అది ట్వీట్ చేస్తున్నాడు అంటూ ఎద్దేవా చేశారు.. లోకేష్ మంత్రి ఎలా అయ్యాడు…? అని ప్రశ్నించారు. ఆ రోజు మంత్రి పదవి పీకేస్తే పీతల సుజాత బోరు బోరున విలపించారన్న ఆయన.. మరి అప్పుడు ఇదే మాట తండ్రికి ఎందుకు చెప్పలేదు? మీ హయాంలో బొజ్జల, పల్లె రఘునాథ్ రెడ్డి లాంటి వారిని పీకెస్తే అప్పుడు ఎందుకు మీ నాన్నకి చెప్పలేదు..? నీకు మంత్రి పదవి ఇవ్వడానికి ఆ రోజు ఐదుగురి మంత్రి పదవులు పీకారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.. చంద్రబాబుకి ఒక చిన్న సూచన… ఇంత వయసు వచ్చాక కొడుకును అదుపులో పెట్టుకొకపోతే సభ్యత అనిపించుకోదన్నారు.. ఇష్టారాజ్యంగా కారుకూతలు కూస్తుంటే సమాజం హర్షించదు… మీ కొడుకు చేడిపోయాడు అనే మాట బాగుండదు అంటూ సెటైర్లు వేశారు..
Read Also: Venkaiah Naidu: అప్పుడు చాలా బాధపడ్డా.. వెంకయ్య నాయుడు సంచలన వ్యాఖ్యలు..
Also Read
- Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
- Home Minister Anitha: విశాఖలో జగన్ పర్యటనపై హోంమంత్రి కౌంటర్.. మీకు ఆ హక్కు లేదు..!
- Amaravati Development: అమరావతికి కేంద్రం భారీ శుభవార్త.. రాజధాని రూపురేఖలు మారనున్నాయా..?
- Heavy Rain and Thunderstorms: రెడ్ అలర్ట్.. రాబోయే 3 గంటల్లో ఈ జిల్లాల్లో పిడుగుల వర్షం..!
ఇక, సీఆర్డీఏ చట్ట సవరణ చేసినట్లు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు పేర్నినాని.. దుష్టచతుష్టయంకి రాజధాని అంటే అర్థాలు వేరు, సొంత ఇల్లు లేనటువంటి నిరుపేదలకు మాత్రం అమరావతిలో స్థలం ఇవ్వకూడదంట.. అలా ఇస్తే సమతుల్యత దెబ్బతింటుంది అంటారు.. జగన్ పై విషం చిమ్మడానికే కొంతమంది ఉన్నారని ఫైర్ అయ్యారు. చంద్రబాబు స్థలాలు ఇస్తే మాత్రం వీళ్ళకి సమ్మగా ఉంటుంది.. అదే పేదలకి స్థలాలు ఇస్తే మాత్రం తప్పు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.. రాజధానిలో ఎవరుండాలి.. మనుషులు వద్దా…? ఇన్ని వేల ఎకరాలు తీసుకుని ఏమీ చేద్దామని…? ఈ దుష్ట చతుష్టయానికి బీదా బిక్కీ రాజధానిలో ఉండకూడదు అనేది లక్ష్యం.. పేదలకి గూడు కల్పిద్దామని జగన్ ఆలోచన మాత్రం తప్పు అని మండిపడ్డారు. రాజధానిలో వేరే వారు రాకూడదు.. కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారం జరగాలి అనేది వాళ్ల ఆలోచన అని ఆరోపించారు.
గుంటూరు, కృష్ణా జిల్లాల వారికి స్థలాలు ఇస్తే స్టే తెచ్చారని ఆరోపించారు పేర్నినాని.. మరి మేం దాన్ని మా రాజధాని అని ఎందుకు అనుకోవాలి…? ఇప్పుడు పాదయాత్ర 2 అట… కలెక్షన్ ఫుల్.. ప్రజాదరణ నిల్ అని సెటైర్లు వేశారు. బ్లాక్ ను వైట్ చేసుకోవడానికే ఈ యాత్ర… దేనికైనా వ్యాపారమే చేస్తారు అని విమర్శించారు.. విశాఖ పరిపాలన రాజధాని చేయాలని సీఎం అనుకుంటే అక్కడి వారిని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. రాజధానిలో పేదలకు ఇళ్లు ఇస్తామని ఒక చిన్న సవరణ చేస్తేనే వీళ్ళు కిరాతకంగా వ్యవహరిస్తున్నారు. 600 హామీల్లో ఒక్క హామీ అమలు చేయకపోయినా చంద్రబాబు వీరుడు శూరుడు అంటారు.. ఇచ్చిన హామీల్లో 95 శాతం అమలు చేసిన జగన్ విషయంలో ఆ 5 శాతం గురించి రాస్తారని ఫైర్ అయ్యారు పేర్నినాని.
తాజావార్తలు
-
Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
-
Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
-
PM Modi: ఎన్డీఏ రాకతో దేశ తలరాత మారిపోయింది.. 12 ఏళ్ల వేడుకలో మోడీ కీలక వ్యాఖ్యలు
-
CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటే ప్రజలే బండకేసి కొడతారు.. సీఎం రేవంత్రెడ్డి ఫైర్
-
Nithya Menen: మెగాఫోన్ పట్టనున్న నిత్యా మీనన్?
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!