AP Bifurcation Bill: ఈనెల 27న ఉదయం 11 గంటలకు కేంద్ర హోంశాఖ కీలక సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశంలో ఏపీ విభజన చట్టం అమలుపై చర్చించనుంది. ఈ సమావేశం ఏజెండాలో మొత్తం 14 అంశాలు ఉన్నాయి. ఏడు అంశాలు రెండు రాష్ట్రాలకు సంబంధించినవి కాగా మరో ఏడు ఏపీకి సంబంధించిన అంశాలు ఉన్నాయి. ఈ మేరకు ఈనెల 27న కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా ఆధ్వర్యంలో నిర్వహించే సమావేశానికి హాజరుకావాలని ఇరు రాష్ట్రాల ప్రభుత్వ…
Andhra Pradesh: ఏపీ రాజధాని అసైన్డ్ భూముల కుంభకోణం కేసుపై సీఐడీ అధికారులు విచారణ చేపట్టారు. ఈ నేపథ్యంలో మంగళవారం నాడు ఐదుగురిని అరెస్ట్ చేశారు. కొల్లి శివరాం, గట్టెం వెంకటేష్, చిక్కాల విజయసారథి, బడే ఆంజనేయలు, కొట్టి దొరబాబును సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. 1100 ఎకరాల అసైన్డ్ భూముల వ్యవహారంలో అక్రమాలు జరిగాయని సీఐడీ అభియోగం మోపింది. ఇందులో 169.27 ఎకరాలకు సంబంధించి విచారణ చేపట్టగా ఐదుగురిని అరెస్ట్ చేయడం జరిగింది. కేసులో ప్రధాన…
సోషల్ మీడియా ప్రభావం క్రమంగా పెరుగిపోతోంది.. అందిలో వచ్చేవి వైరలా? రియలా? అని తెలుసుకునేలోపే.. కొన్ని సార్లు జరగాల్సిన నష్టం జరిగిపోతోంది… దీంతో, సోషల్ మీడియా వింగ్ పటిష్టంపై ఫోకస్ పెట్టారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి.. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్న సీఎం జగన్.. సోషల్ మీడియాను పటిష్టం చేయటంపై ప్రత్యేకంగా దృష్టిసారించారు.. ఇక, సోషల్ మీడియా బాధ్యతలు చూడటానికి తెర మీదకు కొత్త పేరు వచ్చింది……
* నేడు మూడో రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. ఇవాళ రెండు తీర్మానాలు చేయనున్న అసెంబ్లీ, ఏడు బిల్లులపై చర్చ, ఆమోదం తెలపనున్న శాసనసభ * ప్రకాశం : ఒంగోలులో కేంద్ర సామాజిక న్యాయ సాధికారత శాఖ సహాయక మంత్రి ఏ.నారాయణస్వామి పర్యటన… కలెక్టరేట్ లోని స్పందన హాల్లో 160 మంది విభిన్న ప్రతిభావంతులకు 35 లక్షల రూపాయల విలువైన పరికరాలను అందించనున్న మంత్రి నారాయణస్వామి.. * విశాఖపట్నం: నేడు ఉమ్మడి విశాఖ జిల్లాల సమన్వయకర్త వైవీ…
Deputy CM Narayana Swamy: టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి తీవ్ర విమర్శలు చేశారు. కుప్పంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఇప్పటివరకు 40వేల దొంగ ఓట్లతోనే చంద్రబాబు కుప్పంలో గెలుస్తూ వచ్చాడని ఆరోపించారు. బీసీల ఓట్లతో కుప్పంలో గెలిచి చంద్రబాబు వారికి చేసిందేమీ లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో కుప్పంలో వైసీపీ జెండా ఎగరాలని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి పిలుపునిచ్చారు. కుప్పం ప్రజలు నాన్ లోకల్ అయిన చంద్రబాబును ఈ దఫా…
అమరావతి మున్సిపాల్టీ ఏర్పాటు ప్రతిపాదనపై ప్రభుత్వం తన కసరత్తు ప్రారంభించింది. పూలింగ్ గ్రామాలతో పాటు మూడు నాన్ పూలింగ్ గ్రామాలను కూడా కొత్తగా ఏర్పాటు చేసే అమరావతి మున్సిపాల్టీలో కలపాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనికి అనుగుణంగా గ్రామ సభలు నిర్వహించి.. ప్రజాభిప్రాయాన్ని స్వీకరించే ప్రక్రియకు జగన్ సర్కార్ శ్రీకారం చుట్టింది. అయితే తొలి రోజు జరిగిన మూడు గ్రామసభల్లోనూ ప్రభుత్వ ప్రతిపాదనలకు వ్యతిరేకతే ఎదురైంది. అమరావతి మున్సిపాల్టీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. గతంలో అమరావతి క్యాపిటల్…
YSRCP: 2024 ఎన్నికల్లోనూ గెలవాలని వైసీపీ కృతనిశ్చయంతో ఉంది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల నాటికి పార్టీని మరింత పటిష్టం చేయాలని వైసీపీ అధిష్టానం భావిస్తోంది. దీంతో పార్టీ పటిష్టతపై హైకమాండ్ దృష్టి సారించింది. ప్రతి నియోజకవర్గానికి ఒక పరిశీలకుడిని నియమించాలని నిర్ణయం తీసుకుంది. పరిశీలకుల జాబితాపై పార్టీ కసరత్తు చేపట్టింది. ప్రస్తుతం ఈ జాబితా సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న నియోజకవర్గ ఇంఛార్జ్కు అదనంగా పరిశీలకుడు ఉంటాడని తెలుస్తోంది. నియోజకవర్గ నేతలకు, పార్టీకి అనుసంధాన కర్తగా…
CM Jagan: అమరావతి సచివాలయంలో విద్యాశాఖ అధికారులతో జగనన్న విద్యా కానుకపై సీఎం జగన్ సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా వచ్చే ఏడాది జూన్లో స్కూళ్లు తెరిచే నాటికి విద్యా కానుక కింద అన్నిరకాల వస్తువులు అందించేలా కార్యాచరణ సిద్ధం చేశామని సీఎం జగన్కు అధికారులు వివరించారు. స్కూళ్లు తెరిచే నాటికి పిల్లల చేతికి విద్యా కానుక కచ్చితంగా అందాలని సీఎం జగన్ సూచించారు. యూనిఫామ్స్ కుట్టు ఛార్జీలను విద్యాకానుక ప్రారంభం రోజునే తల్లుల ఖాతాల్లో వేయాలన్నారు.…
రైలు బండి.. దాని స్పీడ్పై గతంలోనే అనేక పాటలు వచ్చాయి… కానీ, కాల క్రమంగా రైళ్ల రూపం మారిపోయింది.. వేగం పెరిగింది.. ఇక, జెట్ స్పీడ్తో దూసుకెళ్లేందుకు సిద్ధం అయ్యాయి రైళ్లు.. నేటి నుంచి దక్షిణ మధ్య రైల్వేలో రైళ్ల వేగం మరింత పెరగనుంది. ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి తర్వాత తొలిసారిగా పట్టాలపై రైళ్లు మరింత స్పీడ్తో దూసుకెళ్లనున్నాయి. ట్రాక్ అప్గ్రెడేషన్ పనులు పూర్తి కావడంతో ఈ రోజు నుంచి మూడు డివిజన్ల పరిధిలో ప్యాసింజర్,…