Muppavarapu Venkaiah Naidu: నాకు రాజ్యాంగ పదవులు నచ్చవు.. ప్రజలతో మమేకమయ్యే పదవులే ఇష్టం..!
నేను క్షేత్ర స్థాయి నుండి భారత దేశ రెండో అత్యున్నత పదవి వరకు వెళ్లాను.. నాకు ఇచ్చిన బాధ్యత నేను సమర్ధవంతంగా నిర్వహించాను.. కానీ, నాకు నచ్చిన పదవులు రాజ్యాంగ పదవులు కాదు.. ప్రజలతో మమేకమయ్యే పదవులు నాకు ఎంతో ఇష్టం అంటూ మరోసారి తన మనసులోని మాటలను బయటపెట్టారు భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు.. ఏపీలో పర్యటిస్తున్న ఆయన.. పలు కార్యక్రమాల్లో పాల్గొంటూ.. తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.. నిన్నటి నిన్నే ఆయన.. తాను తల్లి ప్రేమకు నోచుకోలేదు.. నన్ను పార్టీయే పెంచిందని వ్యాఖ్యానించిన ఆయన.. ఇవాళ గుంటూరులో మిత్రులు నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో చిరకాల మిత్రులు, శ్రేయోభిలాషులు, ఆత్మీయులు, పురప్రముఖులను కలిశారు.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. తనకు రాజ్యాంగ పదవులు నచ్చవంటూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.. చట్ట సభలు చాలా ముఖ్యమైనవి… వాటిని కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉందని.. చట్ట సభల స్థాయి తగ్గడం సమాజానికి మంచిది కాదని.. వాటి పరిధిలు, హక్కులు రాజ్యాంగంలో పొందు పరిచారని.. చట్టాలు అమలు చేయాల్సిన వారు గాడి తప్పి వ్యవహరిస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు.
Also Read
- PV Sindhu : మ్యాజిక్ డ్రెయిన్స్తో పల్లెల్లో సరికొత్త విప్లవం
- Blood Shortage: సమ్మర్లో బ్లడ్ బ్యాంకులకు గడ్డు పరిస్థితి
- AP Govt Employee Promotions: ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమోషన్ల అంశంలో గవర్నమెంట్ కీలక నిర్ణయం..
- CM Chandrababu Naidu: పవన్ కళ్యాణ్ నివాసానికి సీఎం చంద్రబాబు.. హెల్త్ అప్డేట్ ఇచ్చిన డిప్యూటీ సీఎం!
కొంత మంది చేస్తున్న పనులు వల్ల చట్ట సభల స్థాయి తగ్గి పోతుంది.. దీనిపై చర్చ జరగాలని సూచించారు వెంకయ్యనాయుడు.. ప్రభుత్వాన్ని విమర్శించే ప్రతిపక్షాలు హుందాగా వ్యవహరించాలి.. కానీ, చట్ట సభల్లో దుర్భాషలాడటం ఒక ట్రెండ్ గా మార్చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.. ఇక, సెప్టెంబర్ 9 ఆంధ్రపత్రిక ఆవిర్భావ దినోత్సవం.. ఆంధ్ర పత్రిక ఆవిర్భావం ఆ నాటికి సాహసం.. ఈ నాటికి దుస్సాహసం.. కానీ, రాజకీయ ప్రయోజనాల కోసం ఈ రోజు పత్రికలు నడుపుతున్నారు.. ఆ విధానం మారాలని సూచించారు.. మరోవైపు, స్వాతంత్ర్య పోరాటం లో సుభాష్ చంద్రబోస్ పాత్ర అనిర్వచనీయం.. మహాత్మ గాంధీ నాయకత్వంలో స్వతంత్రం ఉద్యమంలో ఎంతో మంది పోరాడారు.. వారి పేర్లతో నూతన నిర్మాణాలు చేయాలని పేర్కొన్నారు.. కుటుంబ పాలకుల నాయకుల పేర్లు కాదు… మాతృ భాష ను కాపాడుకోవాలి.. పరిపాలన కూడా ప్రజల భాషలో జరగాలన్నారు. కోర్టు తీర్పులు కూడా తెలుగులోనే ఉండాలి.. మాతృ భాషలో చదువుకున్న వారు దేశంలో శక్తి వంతమైన భాద్యతలు నిర్వహించారని.. ప్రధాని మోడీ, సుప్రీం కోర్టు మాజీ చీఫ్ జస్టిస్ రమణ, నేను ఊర్లలో మాతృ భాషలో చదువుకున్న వాళ్లమే అని గుర్తుచేసుకున్నారు ఎం. వెంకయ్యనాయుడు.
తాజావార్తలు
-
GT VS PBKS: గుజరాత్ బౌలర్ల ధాటికి పంజాబ్ విలవిల.. తక్కువ స్కోర్కే పరిమితమైన PBKS..
-
Karimnagar PMG Jewellery : పీఎంజీ జ్యువెల్లరీ దొంగల ఫోటోలు విడుదల.. ఆచూకీ చెబితే లక్ష నజరానా.!
-
Rishab Pant: రిషబ్ పంత్ ఆట ముగిసిందా..? లక్నో కెప్టెన్ ఫామ్పై బౌలింగ్ కోచ్ సంచలన వ్యాఖ్యలు..
-
Anemia in Children : చిన్నపిల్లల్లో రక్తహీనత.. తల్లిదండ్రులు గమనించాల్సిన హెచ్చరిక సంకేతాలు, నివారణ మార్గాలు.!
-
Varanasi: మహేష్ బాబు వారణాసికి నీటి కష్టాలు.. జక్కన్న రిక్వెస్ట్కు సింపుల్గా నో చెప్పిన జలమండలి!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!