చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు.. కుప్పం టీడీపీ వ్యవహారాలను ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ కు అప్పగించారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రుల నియోజకవర్గం నుంచి సంచలన విజయం సాధించారు కంచర్ల శ్రీకాంత్.
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడతాయిన వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో వాతావరణం మారింది. గత రెండు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్నాయి. వచ్చే మూడు రోజులు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నిన్న సాయంత్రం నుంచి హైదరాబాద్ సహా ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ తదితర జిల్లాల్లో వర్షాలు కురిసాయి.
Off The Record: రాయల తెలంగాణ…ఈ మాట వినపడి చాలా ఏళ్ళయింది కదా..? తొమ్మిదేళ్ళ క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన టైంలో రాయలసీమ నేతల నోళ్లలో బాగా నానిన పేరది. మళ్ళీ ఇన్నాళ్ళకు… ఆ ప్రస్తావన తీసుకువచ్చారు సీమకు చెందిన సీనియర్ లీడర్ జేసీ దివాకర్రెడ్డి. సడన్గా ఇన్నేళ్ళ తర్వాత ఆయనకు రాయల తెలంగాణ ఎందుకు గుర్తుకు వచ్చిందన్న చర్చ జోరుగా జరుగుతోంది. వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా గెలిచిన నాయకుడు జేసీ. అంతకు మించి…
Off The Record: జనసేన కార్యకర్తలను ఉద్దేశించి పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తాజాగా బహిరంగ లేఖ రాశారు. అందులో పార్టీ విధానాలు.. కార్యకర్తలు, నేతలు వ్యవహరించాల్సిన తీరు.. ఎలా స్పందించాలన్న అంశాలను వివరించారు. తాను చెప్పిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని కూడా సూచించారు. అంత వరకు బాగానే ఉన్నా… పవన్ చేసిన సూచనలే ఇప్పుడు చర్చకు దారి తీస్తున్నాయట. జనసేనకు ఉన్న క్రెడిబిలిటీని దృష్టిలో పెట్టుకుని చాలా మంది వివిధ అంశాలను పార్టీ నేతల దృష్టికి…
Union Home Ministry: ఢిల్లీలోని ఏపీ భవన్ విభజనపై బుధవారం కేంద్ర హోంశాఖ కీలక సమావేశం నిర్వహిస్తోంది. తొమ్మిదేళ్లుగా ఒకే ప్రాంగణంలో ఏపీ, తెలంగాణ భవన్లో కొనసాగుతున్నాయి. తాత్కాలికంగా 58:42 నిష్పత్తి పద్ధతిలో గదుల విభజన, నిర్వహణ సాగుతోంది. ఏపీ ప్రభుత్వం తరఫున ఆదిత్యనాథ్ దాస్, రావత్, ప్రేమ చంద్రారెడ్డి హాజరుకానున్నారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున రామకృష్ణారావు, గౌరవ్ ఉప్పల్ హాజరవుతారు. ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత, విభజన చట్టం అమలుపై కేంద్ర హోంశాఖ ప్రత్యేక దృష్టి పెట్టింది.…
Ramakuppam: చిత్తూరు జిల్లా రామకుప్పం ఎస్ఐ ఫోన్ సంభాషణ వైరల్గా మారింది. కుప్పంలో 34 మంది టీడీపీ కార్యకర్తలపై రౌడీ షీట్లు ఓపెన్ చేశారు పోలీసులు. ఎన్కౌంటర్ చేస్తానంటూ టీడీపీ కార్యకర్తకు రామకుప్పం ఎస్ఐ బెదిరింపులకు పాల్పడుతున్నారు. కుప్పంలో టీడీపీ కార్యకర్త గజేంద్రకు రామకుప్పం ఎస్ఐ కృష్ణ బెదిరించాడు. తాను పెట్టిన కేసు రిజిస్టర్ చేయమని అడిగినందుకు గజేంద్రపై బూతులతో విరుచుకుపడ్డాడు ఎస్ ఐ కృష్ణ. రౌడీ షీట్ ఓపెన్ చేస్తా.. దిక్కు ఉన్న చోట చెప్పుకో…
హైదరాబాద్లో దంచి కొడుతున్న వాన హైదరాబాద్లో మరోసారి భారీ వర్షం కురుస్తోంది. మధ్యాహ్నం మేఘావృతమైన వాతావరణం తర్వాత.. నగరంలోని అనేక ప్రాంతాలలో ఈదురు గాలులతో పాటు భారీ వర్షం కురుస్తోంది. నగరంలోని పలు ప్రాంతాల నుంచి వర్షం కురిసిన వీడియోలు సోషల్ మీడియాలో షేర్ అవుతున్నాయి. లక్డీకాపూల్, బేగంపేట్, అమీర్పేట, ఎస్ఆర్ నగర్, కూకట్పల్లి, మియాపూర్ తదితర ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. మరికొన్ని గంటల పాటు వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. పలుచోట్ల…