KKR: ద్వితియార్థంలో దూసుకుపోతున్న కేకేఆర్.. ఈ ఒక్క సూత్రమే వారి జోరుకు కారణమా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2026లో కోల్కతా నైట్ రైడర్స్ (KKR) వరుస విజయాలతో దూసుకుపోతోంది. ఆదివారం జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్పై 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించిన అనంతరం కేకేఆర్ కెప్టెన్ అజింక్యా రహానే తన బౌలింగ్ విభాగంపై ప్రశంసల జల్లు కురిపించారు. ముఖ్యంగా స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్ ప్రదర్శన జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిందని ఆయన కొనియాడారు.
బౌలర్ల నిలకడపై రహానే ప్రశంసలు..
Also Read
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్కు చేర్చిన క్షణాలు..
- Vaibhav Sooryavanshi: పాపం వైభవ్ సూర్యవంశీ.. అంతర్జాతీయ క్రికెట్ ఎంట్రీ ఇప్పట్లో లేనట్లే..
సన్రైజర్స్ హైదరాబాద్ ఒక దశలో 190-200 పరుగులు చేసేలా కనిపించినా, కేకేఆర్ బౌలర్లు అద్భుతంగా పుంజుకుని వారిని 165 పరుగులకే కట్టడి చేశారు. వరుణ్ చక్రవర్తి (3/36), సునీల్ నరైన్ (2/31) కీలక వికెట్లు తీసి హైదరాబాద్ను దెబ్బతీశారు. ఈ విజయంపై రహానే స్పందిస్తూ.. “గత 5-6 మ్యాచ్లుగా మా బౌలింగ్ యూనిట్ చాలా నిలకడగా రాణిస్తోంది. బౌలింగ్ కోచ్లు బ్రావో, టిమ్ సౌథీల కృషి ఇందులో ఎంతో ఉంది” అని పేర్కొన్నారు. తొలి 5 మ్యాచ్ల్లో ఓడిపోయినా జట్టులో వాతావరణం ప్రశాంతంగా ఉండటం ప్లస్ పాయింట్ అని ఆయన చెప్పారు. బౌలర్లు అద్భుతంగా రాణిస్తుండటమే మా విజయాలకు కారణం అని పేర్కొన్నాడు.
బ్యాటింగ్లో రాణించిన రఘువంశీ, రహానే
166 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్, మరో 10 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందుకుంది. అంగ్క్రిష్ రఘువంశీ, రహానే (43) కలిసి రెండో వికెట్కు 84 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచిన వరుణ్ చక్రవర్తిపై రహానే ప్రత్యేక ప్రశంసలు కురిపించారు. కష్టమైన ఓవర్లలో కూడా అతను అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడని అభినందించారు. 9 మ్యాచ్లు ఆడిన కేకేఆర్ మరో 5 మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ఇదే జోరును కొనసాగించి.. మిగిలిన వాటిలో కూడా గెలిస్తే మొత్తం 17 పాయింట్లు వస్తాయి. దీంతో ప్లే ఆఫ్స్ కు చేరే అవకాశాలు మిగిలిన జట్ల పాయింట్స్, రన్ రేట్ పై ఆధారపడి ఉంటుందని క్రీడా వర్గాలు పేర్కొంటున్నాయి.
అలసత్వమే దెబ్బతీసింది: పాట్ కమిన్స్
తమ ఓటమిపై ఎస్ఆర్హెచ్ కెప్టెన్ పాట్ కమిన్స్ అసహనం వ్యక్తం చేశారు. ఆరంభం బాగున్నా, పిచ్ పరిస్థితులకు అనుగుణంగా బ్యాటర్లు ఆడలేకపోయారని ఆయన అభిప్రాయపడ్డారు. “మేము 180-200 స్కోరు చేయాలని భావించాం, కానీ మధ్యలో తడబడ్డాం. నా ఓవర్లో 27 పరుగులు ఇవ్వడం కూడా మ్యాచ్పై ప్రభావం చూపింది” అని కమిన్స్ ఒప్పుకున్నారు.
తాజావార్తలు
-
Ship sink: ఒమన్ తీరంలో మునిగిన షిప్.. 14 మంది భారతీయులకు తప్పిన ప్రమాదం..
-
Child Safety Tips : స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయి.. పిల్లలకు ఈ 5 ‘అబద్ధాలు’ నేర్పించండి..!
-
Madhya Pradesh: ప్రాణాలు తీసిన వదంతి.. రైలు నుంచి దూకిన ప్రయాణికుల్ని ఢీకొట్టిన మరో రైలు..
-
Women’s T20 World Cup: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. టీమిండియా జట్టులో కీలక మార్పులు..
-
PM Modi: భారత్ రండి, మాతో కలిసి పని చేయండి.. మోడీ పిలుపు..
ట్రెండింగ్
-
Cleaning Hacks : పరుపు, దిండు నుంచి వాసన వస్తోందా.? ఈ ఒక్క చిట్కాతో నిమిషాల్లో ఫ్రెష్.!
-
Kitchen Tips : బియ్యాన్ని ఇలా కడగకపోతే అన్నం రుచి, ఆరోగ్యం రెండూ దెబ్బే.!
-
Rahamathullah Gurbaj: నా సెంచరీకి కారణం గౌతమ్ గంభీర్.. అఫ్గాన్ ఓపెనర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Rahmanullah Gurbaz Record: జట్టు ఓడిపోయినప్పటికీ రహ్మనుల్లా గుర్బాజ్ చరిత్ర.. క్రికెట్లోనే సరికొత్త మైలురాయి!
-
Nitish Kumar Reddy: అమ్మతో అట్లుంటది మరి.. ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా ఆపేసిన నితీష్ రెడ్డి.. వీడియో వైరల్!