Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Headlines Ntv Top Headlines May 17 2023 At 9am

Top Headlines @9AM: టాప్ న్యూస్

Published Date :May 17, 2023 , 9:04 am
By NTV WebDesk
Top Headlines @9AM: టాప్ న్యూస్
  • Follow Us :
  • google news
  • dailyhunt

నన్ను కర్నాటక సీఎంని చేయండి.. ఖర్గేకు తెలిపిన డీకేఎస్

Dk Shiva Kumar

కర్ణాటక సీఎం ఎవరనే విషయంపై తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది. పార్టీ తనకు తల్లి లాంటిదని, వెన్నుపోటు పొడవబోనని, బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడనని హస్తినకు వెళ్లటానికి ముందు డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలు కూడా అందుకు కారణమని ఏఐసీసీ వర్గాలు అంటున్నాయి. అయితే సీఎం పదవిని ఆశిస్తున్న సిద్ధరామయ్య, శివకుమార్‌లు కూడా పార్టీ అధ్యక్షుడు ఖర్గేతో విడివిడిగా భేటీ అయ్యారు. కాగా, కాంగ్రెస్‌ అ‍ధిష్ఠానం సిద్ధరామయ్య వైపే మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. అయితే సీఎం ఎంపికపై పార్టీ అధిష్ఠానం బుధవారం నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం. కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి రేసులో ఉన్న కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ మంగళవారం ఢిల్లీలో పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో సమావేశమయ్యారు. 2019లో తమ ప్రభుత్వం కుప్పకూలిన తర్వాత రాష్ట్రంలో పార్టీని పునర్నిర్మించేందుకు తాను సహాయం చేశానని, శివకుమార్ తదుపరి సీఎం కావాలనే కోరికను ఖర్గేకు తెలియజేశారు.మే 10న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అఖండ విజయం సాధించిన తర్వాత కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించేందుకు శివకుమార్, సిద్ధరామయ్య ఇద్దరూ కాంగ్రెస్ నాయకత్వాన్ని కలవడానికి ఢిల్లీకి చేరుకున్నారు. ఖర్గేతో జరిగిన సమావేశంలో సిద్ధరామయ్యకు సీఎం అయ్యే అవకాశం ఇప్పటికే లభించిందని, ఇప్పుడు తన వంతు వచ్చిందని శివకుమార్ కాంగ్రెస్ చీఫ్‌తో చెప్పారని కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి. తనకు సీఎం కుర్చీ దక్కకపోతే పార్టీలో ఎమ్మెల్యేగా మాత్రమే పనిచేయడానికే ప్రాధాన్యత ఇస్తానని కూడా చెప్పారు. సిద్ధరామయ్య సీఎంగా కొనసాగడం ‘తప్పుడు పాలన’ అని, కర్ణాటకలోని ప్రముఖ వర్గమైన లింగాయత్‌లు మాజీ ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఉన్నారని శివకుమార్ ఖర్గేతో అన్నారు.

ఏపీలో ఇవాళ 20 మండలాల్లో వడగాల్పులు

Sddefault (2)

ఎండలు మండిపోతున్నాయి. ఏపీలో వడగాల్పుల ప్రభావం ఎక్కువగా ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. నేడు 20 మండలాల్లో వడగాల్పులు ప్రభావం ఉండబోతోంది. అనకాపల్లి జిల్లా 2, గుంటూరు 2, కాకినాడ 1, ఎన్టీఆర్ 3, పల్నాడు 3, వైఎస్సార్ జిల్లాలో 9 మండలాల్లో వడగాల్పులు ప్రభావం ఉంటుంది. మిగిలిన చోట్ల కూడా ఎండ ప్రభావం ఉంటుందని విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఈరోజు ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు,తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 44డిగ్రీలు నుంచి 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 41డిగ్రీల నుంచి – 43 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 41డిగ్రీల నుంచి 43 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే, విశాఖపట్నం, అనకాపల్లి, కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 36 డిగ్రీల నుంచి – 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. నిన్న 40 మండలాల్లో తీవ్రవడగాల్పులు , 148 మండలాల్లో వడగాల్పులు వీచాయి. రాష్ట్రంలో ఈ సీజన్లో నిన్న అధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలో 46.8 డిగ్రీల వరకూ … ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలంలో 46.7డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. శ్రీకాకుళం జిల్లా కొత్తూరులో 46.5డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అయినట్టు అధికారులు తెలిపారు.

ఆడవాళ్ళ విషయంలో పురుషులు చేసే తప్పేంటో తెలుసా?

Mistakes Men Make With Girls

ఆడవాళ్ల మాటలకు అర్థాలే వేరు.. మాటలే కాదు.. మనసు కూడా చాలా కష్టం. ముఖ్యంగా మహిళలు కొన్ని విషయాలను చాలా తేలికగా తీసుకుంటారో, మరికొన్ని విషయాలను చాలా సీరియస్‌గా తీసుకుంటారు. ఇలాంటి వాటి గురించి తప్పక తెలుసుకోవాలి.. చాలా మంది పురుషులు చేసే తప్పు ఏంటంటే.. ఆడవారిని అంతగా అర్థం చేసుకోరు. వాళ్ళు ఏం చెప్పిన వినరు. దానికి తోడు వారి మాటలను వినకుండా మధ్యలోనే ఆపేస్తూ మళ్లీ మీరు వారికి సలహా ఇస్తుంటారు. అలా కాకుండా పూర్తివిని ఆ తరువాత వారికి చెప్పండి. ఆ విషయంలో కాస్త ఎడమెహం పెడమెహం వుండినా మాటలను అర్థం వచ్చినట్లు చెబితే ఇద్దరికి మంచిది.స్త్రీలకు స్నేహితులు ఉంటారు. ఆ స్నేహితులపై మీరు కోప్పడితే మహిళలు ఇష్టపడరు. దీంతో వారు అసహనానికి గురై తప్పుగా ఆలోచిస్తారు. కాబట్టి వారి గురించి చెడుగా మాట్లాడి వారిపైనే ఫిర్యాదు చేయకండి. పురుషులకు ప్రధానంగా పిల్లలంటే చాలా ఇష్టపడుతుంటారు. కానీ ప్రతి ఒక్కరూ పిల్లలను కనాలని ఇష్టముండదు ఇది గుర్తుంచుకోండి. కొంతకాలం హ్యాపీగా వుండాలని, ఒకరినొకరు ఆనందంగా గడపాలని స్ర్తీలు ఆలోచిస్తుంటారు. కానీ దీనిని పురుషులు ఎప్పటికీ అర్థం చేసుకోలేరు. పురుషుల కంటే స్త్రీలు దుస్తులను ఎక్కువగా ఇష్టపడతారు. వాటిని ఇష్టపడటం మాత్రమే కాదు. ఒక్కో డ్రెస్‌కి ఒక్కో కథ ఉంటుంది. అది వారికి సంబంధించిన సెంటిమెంట్. కానీ, స్త్రీలు బిగుతుగా ముఖ్యంగా, బ్రా. బ్రాలెస్‌గా ఉండటానికి ఇష్టపడతారు. మిగతావారు వేసుకుంటున్నారని, చూడ్డానికి బాగుండదని మాత్రమే స్ర్తీలు దీనిని ధరిస్తుంటారని అధ్యయనాలు చెబుతున్నాయి.

నేడు బీఆర్ఎస్ కీలక భేటీ.. దిశానిర్దేశం చేయనున్న సీఎం కేసీఆర్‌

Kcr

ఈ రోజు బీఆర్ఎస్‌ కీలక సమావేశం జరగనుంది.. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్‌ వేదికగా బీఆర్ఎస్‌ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు.. ఈ సమావేశంలో పాల్గొనాలని ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర పార్టీ కార్యవర్గం, రాష్ట్రస్థాయి కార్పొరేషన్స్ ఛైర్మన్లకు పిలుపు అందింది.. ఈ సమావేశంలో జూన్‌ 2వ తేదీ నుంచి 21 రోజుల పాటు నిర్వహించే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలపై ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేయనున్నారు పార్టీ అధినేత.. తెలంగాణ ఆవిర్భావానికి ముందు.. రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత ప్రభుత్వం వివిధ రంగాల్లో సాధించిన ప్రగతిని ఆవిష్కరించనున్నారు. ఈ ఉత్సవాల నిర్వహణలో బీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులుగా పోషించాల్సిన పాత్రపై ఈ రోజు దిశానిర్దేశం చేస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నమాట..తెలంగాణ రాష్ట్రం సాధనే ధ్యేయంగా టీఆర్‌ఎస్‌ ఆవిర్భవించింది.. సింహగర్జన పేరుతో కరీంనగర్‌ బహిరంగ సభ మే 17, 2001న నిర్వహించారు.. ఇక, జాతీయ రాజకీయాలే లక్ష్యంగా టీఆర్ఎస్‌ కాస్తా బీఆర్‌ఎస్‌ పార్టీగా రూపాంతరం చెందిన తరువాత అదే రోజు.. అంటే ఈ రోజు తెలంగాణ భవన్‌లో పార్టీ ప్రజాప్రతినిధుల సమావేశం నిర్వహించబోతున్నారు.. దశాబ్ది ఉత్సవాల నిర్వహణతోపాటు ఇతర అంశాలపై తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్‌ అధినేత కె.చంద్రశేఖర్‌రావు ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేయనున్నట్టుగా తెలుస్తోంది.

బోగస్‌ కంపెనీలను పెట్టి.. బ్యాంకుల నుంచి కోట్లు కొల్లగొట్టిన గ్యాంగ్ అరెస్ట్

Fraud

డజనుకు పైగా బోగస్ కంపెనీలను పెట్టి, లేని ఉద్యోగుల ఆధార్, పాన్ కార్డుల వంటి నకిలీ పత్రాలను ఉపయోగించి రుణాలు తీసుకుని పలు బ్యాంకులకు రూ.23 కోట్ల మేర మోసం చేసిన ఎనిమిది మంది వ్యక్తులను అరెస్టు చేసినట్లు పోలీసులు మంగళవారం ఇక్కడ తెలిపారు. బోగస్ కంపెనీలు తమ వద్ద లేని ఉద్యోగుల ఖాతాలను తెరిచి, రుణాలు ఇవ్వడంలో బ్యాంకులు ఉనికిని సందేహించకుండా చూసేందుకు వారి జీతాల నుంచి ప్రావిడెంట్ ఫండ్ (పిఎఫ్) కూడా మినహాయించాయని వారు తెలిపారు. ఉత్తరప్రదేశ్ పోలీస్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF) స్థానిక యూనిట్ సహాయంతో ఫేజ్ 1 పోలీస్ స్టేషన్ అధికారులు ఈ ముఠాను ఛేదించినట్లు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (నోయిడా) హరీష్ చందర్ తెలిపారు.”ఎలక్ట్రానిక్ నిఘా, మాన్యువల్ ఇంటెలిజెన్స్, రహస్య సమాచారం ఆధారంగా, వివిధ వ్యక్తులు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీల నకిలీ పత్రాలు, ఐడీలను సృష్టించి వివిధ బ్యాంకుల నుంచి మోసపూరితంగా రుణాలు తీసుకున్నందుకు ముఠాలోని ఎనిమిది మంది సభ్యులను ఈ రోజు అరెస్టు చేశారు” అని చందర్ చెప్పారు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ నుంచి పోలీసులకు ఫిర్యాదు అందిందని, బోగస్ కంపెనీల పేరుతో మోసపూరితంగా కొంత రుణాలు తీసుకున్నారని పేర్కొంటూ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని ఆయన చెప్పారు. హెచ్‌డీఫ్‌సి బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ వంటి వివిధ బ్యాంకులను టార్గెట్ చేసిన ఈ ముఠా.. బోగస్ కంపెనీలను ఎగురవేసి, కొంతమంది డైరెక్టర్లు మినహా కాగితాలపై మాత్రమే ఉన్న ఉద్యోగులతో రిజిష్టర్‌ చేయించుకుంది. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని ఆ నిధిని చూపించేవారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి ఉపయోగించబడిందంటూ లెక్కలు చూపించారని డీసీపీ చెప్పారు.నిందితులు ఈ సంస్థల్లోని ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తున్నట్లు పేపర్‌పై చూపించడమే కాకుండా ప్రావిడెంట్ ఫండ్‌లో కోత కూడా చూపించారు. ఈ కేటుగాళ్లు ఉద్యోగుల పీఎఫ్ ఖాతాల్లో ఎప్పటికప్పుడు కొంత డబ్బు జమ చేశారు. రుణాలు ఇచ్చే సమయంలో బ్యాంకులు తమపై ఎలాంటి సందేహాలు పెట్టుకోవద్దని ఇలా జమ చేసినట్లు చందర్ తెలిపారు.

కరీంనగర్ లో విషాదం.. ఒకరి తర్వాత ఒకరి ఆత్మహత్యలు

Karimnagar

కరీంనగర్ జిల్లాలో ఒకరి తర్వాత ఒకరు వరుసగా కుటుంబంలోని ముగ్గురు బలవన్మరణానికి పాల్పడ్డారు. గత కొన్ని నెలల కింద ఆ ఇంటి కోడలు ఆత్మహత్యకు పాల్పడింది. భార్య చనిపోవడం తట్టుకోలేక భర్త మనస్థాపంతో మూడు రోజుల కింద తాను ఆత్మహత్య చేసుకున్నాడు. కొడుకు కోడలు అర్ధాంతరంగా తనువు ముగించడంతో ఆ తల్లి తట్టుకోలేకపోయింది. అప్పటికే అనారోగ్యంతో బాధపడుతున్న తల్లి మనో వేదనతో తల్లిడిల్లి చనిపోయింది. ఈ హృదయ విధారక ఘటన కరీంనగర్ జిల్లాలో జరిగింది.వివరాల్లోకి వెళితే.. తిమ్మాపూర్‌ మండలం నేదునూరు గ్రామానికి చెందిన శ్యాంసుందర్‎కి హుస్నాబాద్ కు చెందిన శారదతో గతేడాది మే 15న పెళ్లైంది. కానీ పలు కారణాల వల్ల ఎనిమిది నెలల క్రితం భార్య శారద తన పుట్టింటికి వెళ్లింది. అక్కడే ఆత్మహత్యకు పాల్పడింది. శ్యాంసుందర్‎కి 65 ఏళ్ల తల్లి బొల్లంపల్లి కనకలక్ష్మి, తండ్రి కనకయ్యతో పాటు నలుగురు అక్కాచెల్లెళ్లు ఉన్నారు. భార్య చనిపోవడంతో శ్యాంసుందర్ మనస్థాపానికి గురయ్యాడు. పెళ్లి రోజు సమీపిస్తుండటంతో దాని కంటే ఒక రోజు ముందు అంటే మే 14వ తేదీన భార్య ఆత్మహత్య కు పాల్పడిన చోటే అతడూ సూసైడ్ చేసుకున్నాడు.

త్రయంబకేశ్వర్ ఆలయంలోకి ప్రవేశించిన నలుగురు ముస్లిం యువకులు అరెస్ట్

Nashik

ప్రసిద్ధ త్రయంబకేశ్వర్ ఆలయంలోకి బలవంతంగా చొరబడ్డారనే ఆరోపణలపై మహారాష్ట్రలోని నాసిక్‌లో నలుగురు ముస్లిం పురుషులను పోలీసులు అరెస్టు చేసి, కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) కూడా ఏర్పాటు చేసింది. ఆలయ ట్రస్ట్ ఫిర్యాదు మేరకు నిందితులు అకిల్ యూసుఫ్ సయ్యద్, సల్మాన్ అకిల్ సయ్యద్, మతిన్ రాజు సయ్యద్, సలీం బక్షు సయ్యద్‌లను మంగళవారం అరెస్టు చేశారు. మే 13న నలుగురు వ్యక్తులు ఊరేగింపులో భాగంగా ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించి, శివలింగానికి చాదర్ సమర్పించేందుకు ప్రయత్నించినప్పుడు ఈ సంఘటన జరిగింది. గొప్ప ముస్లిం సాధువుల ఉర్స్ (వర్థంతి)లో భాగంగా వారి గౌరవార్థం చెప్పుల ఊరేగింపు జరుగుతుంది. శివుని 12 జ్యోతిర్లింగాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందిన త్రయంబకేశ్వర్ ఆలయంలో హిందువులకు మాత్రమే ప్రవేశానికి అనుమతి ఉంది.గుంపును పవిత్ర స్థలంలోకి ప్రవేశించకుండా సెక్యూరిటీ గార్డులు అడ్డుకోవడంలో విఫలమయ్యారు. దీంతో ఆలయ నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ విషయం అందరి దృష్టిని ఆకర్షించింది. మరోవైపు.. ఏళ్ల తరబడి గంధం రోజు శివుడికి చాదర్ చూపిస్తున్నామని, గుడి లోపలికి వెళ్లడం లేదని ఊరేగింపు నిర్వాహకుడు మతిన్ సయ్యద్ తెలిపారు. నిందితులు శివలింగానికి చాదర్ సమర్పించడానికి ప్రయత్నించలేదని, వారు చాదర్‌ను ఆలయ మెట్లకు మాత్రమే తీసుకెళ్లారని ఆయన పేర్కొన్నారు. ఆలయ ట్రస్టు ఫిర్యాదు మేరకు మంగళవారం నలుగురిని అరెస్ట్ చేసి ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ) సెక్షన్ 295, 511 కింద కేసు నమోదు చేశారు.

అరవై వసంతాల ఈడూ-జోడూ

Eedu Jodu

తెలుగు చిత్రసీమలో కళావాచస్పతి జగ్గయ్య హీరోగా రాణించారంటే అందుకు దర్శకనిర్మాత కె.బి.తిలక్ ప్రధానకారకులని చెప్పకతప్పదు. తిలక్ తమ ‘అనుపమ ఫిలిమ్స్’ పతాకంపై తెరకెక్కించిన అనేక చిత్రాలలో జగ్గయ్యనే కథానాయకునిగా ఎంచుకున్నారు. అలా వారి కాంబోలో తెరకెక్కిన ‘ఈడూ-జోడూ’ చిత్రం అప్పట్లో జనాదరణ పొందింది. 1963 మే 17న ‘ఈడూ-జోడూ’ విడుదలై విజయం సాధించింది.ఇంతకూ ‘ఈడూ-జోడూ’ కథ ఏమిటంటే – సుందరమ్మ తన కొడుకు డాక్టర్ వేణుతో కలసి పట్నం నుండి పల్లెకు వస్తుంది. అక్కడ ఆమె చిన్ననాటి స్నేహితురాలు కూతురు శాంత ఉంటుంది. వేణు, శాంత చిన్నప్పుడు కలసి ఆడుకొని ఉంటారు. సుందరమ్మ, శాంతను తన కోడలు చేసుకుంటానని చిన్నప్పుడు చెప్పి ఉంటుంది. కానీ, ఆమె కొడుకు డాక్టర్ కాగానే, వేరే సంబంధం చూడాలని ఆశిస్తుంది. రంగమ్మ తన కూతురును వేణుకు ఇవ్వాలని చూస్తుంది. కానీ ఆ అమ్మాయి, తన బావను ప్రేమించి ఉంటుంది. శాంత తల్లి చనిపోవడంతో ఒక్కతవుతుంది. ఆమెను ఆ ఊరిలో పేరు మోసిన షావుకారు లక్ష్మీపతికి ఈడూజోడూ కాకున్నా ఇచ్చి పెళ్ళి చేస్తారు. కానీ, తాగిన మైకంలో ఉన్న లక్ష్మీపతికి తరువాత నిజం తెలుస్తుంది. అతను ఊరిలో ఆసుపత్రి కట్టిస్తాడు. అతని ఆసుపత్రిలోనే వేణు పనిచేయాలని ముందుగానే నిర్ణయించి ఉంటారు. వేణు, శాంత వేరేవారిని పెళ్ళి చేసుకుందని విచారిస్తాడు. కానీ, చివరకు రంగమ్మనే చీకటిలో తాళి కట్టి, అది లక్ష్మీపతి కట్టాడని లోకాన్ని నమ్మించి ఉంటుంది. అదే తీరున వేణు, రంగమ్మ కూతురు పెళ్ళిలో లైట్లు ఆర్పేసి, చివరకు ఆమె కోరుకున్న బావతో పెళ్ళి జరిపిస్తారు. తరువాత అదే పీటలపై వేణు, శాంత పెళ్ళి దగ్గరుండి లక్ష్మీపతి చేయిస్తాడు. ఇది అన్యాయమని అరచిన ఊళ్ళో వాళ్ళకు రంగమ్మ చేసిన మోసం గురించి వివరిస్తాడు లక్ష్మీపతి. చివరకు విషయం తెలుసుకున్న సుందరమ్మ కూడా కొడుకు పెళ్ళి శాంతతో జరగాలనే ఆశిస్తుంది. ఆ రెండు జంటలు ఈడూజోడూ కుదిరిందని లక్ష్మీపతి అంటూ ఆశీర్వదించడంతో కథ సుఖాంతమవుతుంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • india
  • Movies
  • Sports
  • telangana

తాజావార్తలు

  • Israel – Iran War Live Updates : దుబాయి, బహ్రెయిన్‌లో మళ్లీ డ్రోన్లతో ఇరాన్‌ దాడులు. జుఫైర్‌పై డ్రోన్‌లతో విరుచుకుపడుతున్న ఇరాన్‌.

  • IND vs WI: గెలిపించిన శాంసన్.. గర్జించిన భారత్..! విండీస్‌పై 5 వికెట్ల తేడాతో ఘనవిజయం.!

  • Abhishek Sharma: “అభిషేక్‌ శర్మను తీసేయండి”.. బ్యాటింగ్‌లో మళ్లీ ఫెయిల్.. రెండు క్యాచ్‌లు మిస్..!

  • India vs West Indies: బుమ్రా దెబ్బకు హెట్‌మైర్ అబ్బా.. బ్యాట్స్‌మెన్‌కు తెలియకుండానే ఔట్!(వీడియో)

  • CM Chandrababu : అమరావతిలో దేశంలోనే అత్యుత్తమ ‘జస్టిస్ సిటీ’

  • India Oil Reserves: గల్ఫ్ నుంచి చమురు రాకుంటే, భారత్ వద్ద ఎన్ని రోజులకు సరిపడే నిల్వలు ఉన్నాయి.?

ట్రెండింగ్‌

  • Virendra Sehwag-MS Dhoni: ఎంఎస్ ధోనీ అదృష్టంతో జన్మించాడు.. సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

  • IND vs WI Super 8: ఈడెన్‌ గార్డెన్స్‌లో ‘కింగ్’.. అయినా భారత్‌ను వెంటాడుతున్న ఆ సమస్య!

  • Korralu Upma Benefits : కొర్రల ఉప్మా.. షుగర్ ఉన్నవారికి ఒక వరం.. నరాల బలహీనతకు చెక్..

  • Chaganti Koteswara Rao: “ఇంతకంటే అడుక్కు తినడం మంచిది”.. అలాంటి యూట్యూబర్స్‌పై చాగంటి ఫైర్..

  • 100W ఫాస్ట్ ఛార్జింగ్, IP68/IP69 రేటింగ్ తో Huawei Mate 80 Pro గ్లోబల్ లాంచ్‌..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions