Instant Dosa : దోశ పిండి లేదా.? కేవలం నిమిషాల్లోనే అప్పటికప్పుడు వేసుకునే ఇన్స్టెంట్ క్రిస్పీ దోశ ఇలా..!
- పులియబెట్టే పని లేకుండా ఇన్స్టెంట్ దోశ
- క్రిస్పీ టెక్స్చర్కు సింపుల్ సీక్రెట్ టిప్స్
- పల్లి-కొబ్బరి చట్నీతో అదిరిపోయే కాంబో
- 10 నిమిషాల్లో రెడీ అయ్యే టేస్టీ బ్రేక్ఫాస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Instant Dosa : సాధారణంగా దోశలు వేసుకోవాలంటే బియ్యం, పప్పులను ముందురోజే నానబెట్టి, రుబ్బి, పులియబెట్టాల్సి ఉంటుంది. కానీ కొన్నిసార్లు పిండి అందుబాటులో లేనప్పుడు లేదా అప్పటికప్పుడు ఏదైనా రుచిగా తినాలనిపించినప్పుడు ఈ ఇబ్బంది లేకుండా ‘ఇన్స్టెంట్ క్రిస్పీ దోశ’ను నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. దీనికి తోడుగా అదిరిపోయే రుచితో ఉండే పల్లి కొబ్బరి చట్నీ కూడా ఉంటే ఆ రుచి రెట్టింపు అవుతుంది. ఆ రెసిపీల వివరాలు ఇప్పుడు చూద్దాం.
1. అదిరిపోయే రుచితో పల్లి కొబ్బరి చట్నీ
దోశల్లోకి పల్లి చట్నీ ఎప్పుడూ ఒక పర్ఫెక్ట్ కాంబినేషన్. దీని తయారీకి ఒక కప్పు పల్లీలు, ఒక కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు, అర కప్పు పుట్నాల పప్పు, 3-4 పచ్చిమిర్చి, రెండు ఎండుమిర్చి, కొద్దిగా చింతపండు , రుచికి సరిపడా ఉప్పు అవసరమవుతాయి.
Also Read
- Raj Kachori Recipe: ఇంట్లోనే హల్వాయి స్టైల్ రాజ్ కచోరీ.. కరకరలాడే రుచితో నోరూరించే స్పెషల్ చాట్!
- 5 Best Salads for Glowing Skin: సింపుల్గా తయారుచేసే ఈ 5 సలాడ్లు వాడండి.. మీ చర్మం గులాబీ రంగులో మెరిసిపోతుంది..!
- Ragi Ambali Recipe: పాల కంటే 3 రెట్లు ఎక్కువ కాల్షియం.. శరీరాన్ని కూల్గా ఉంచే రాగి అంబలి తయారీ విధానం ఇలా..
- Best Flour for Roti: ఏ పిండి రొట్టె ఆరోగ్యానికి మంచిది..? గోధుమ, రాగి, జొన్నల్లో సరైన ఎంపిక ఏది..?
తయారీ విధానం:
ముందుగా ఒక పాన్ తీసుకుని పల్లీలను లో ఫ్లేమ్లో ఎర్రగా వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే పాన్ లో కొంచెం నూనె వేసి పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కొబ్బరి ముక్కలు , పుట్నాల పప్పు వేసి ఒక్క నిమిషం పాటు వేయించి చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో వేయించిన పల్లీలు, మసాలా మిశ్రమం, చింతపండు, ఉప్పు వేయాలి. కొద్దిగా నీళ్లు పోస్తూ మరీ మెత్తగా కాకుండా లైట్ బరకగా గ్రైండ్ చేసుకోవాలి. చివరగా ఆవాలు, మినపగుళ్ళు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకుతో తాలింపు పెట్టుకుంటే టేస్టీ చట్నీ సిద్ధమవుతుంది.
2. అప్పటికప్పుడే ఇన్స్టెంట్ క్రిస్పీ దోశ
పిండి పులియబెట్టే అవసరం లేకుండా అప్పటికప్పుడే ఈ దోశలను తయారు చేసుకోవచ్చు. దీనికోసం ఒక కప్పు బియ్యపు పిండి, పావు కప్పు శనగపిండి, ఒక మీడియం సైజు పచ్చి బంగాళదుంప, అర కప్పు పెరుగు (పులిసినది అయితే మరింత రుచి), 5-6 వెల్లుల్లి రెబ్బలు, వేడి నీళ్లలో నానబెట్టిన రెండు ఎండుమిర్చి, అర టీస్పూన్ బేకింగ్ సోడా , ఉప్పు సిద్ధం చేసుకోవాలి.
తయారీ విధానం:
ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో నానబెట్టిన ఎండుమిర్చి, బియ్యపు పిండి, శనగపిండి, పచ్చి బంగాళదుంప ముక్కలు, వెల్లుల్లి, పెరుగు, రుచికి సరిపడా ఉప్పు , అర కప్పు నీళ్లు వేయాలి. వీటన్నింటినీ కలిపి మెత్తటి మిశ్రమంగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పిండిని ఒక గిన్నెలోకి తీసుకుని అందులో బేకింగ్ సోడా వేసి బాగా కలుపుకోవాలి.
దోశ వేసే పద్ధతి
దోశ పెనం వేడి చేసి, కొద్దిగా నీళ్లు చిలకరించి క్లీన్ చేయాలి. మంటను లో ఫ్లేమ్లో ఉంచి పిండిని పల్చగా స్ప్రెడ్ చేయాలి. దోశ పైన తడి ఆరిపోయిన తర్వాత నూనె లేదా నెయ్యి వేసి, మీడియం ఫ్లేమ్లో ఎర్రగా కాలే వరకు కాల్చుకోవాలి. అంతే! వేడివేడిగా ఉండే క్రిస్పీ దోశలను పల్లి చట్నీతో తింటే చాలా రుచిగా ఉంటాయి.
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..