Instant Dosa : దోశ పిండి లేదా.? కేవలం నిమిషాల్లోనే అప్పటికప్పుడు వేసుకునే ఇన్స్టెంట్ క్రిస్పీ దోశ ఇలా..!
- పులియబెట్టే పని లేకుండా ఇన్స్టెంట్ దోశ
- క్రిస్పీ టెక్స్చర్కు సింపుల్ సీక్రెట్ టిప్స్
- పల్లి-కొబ్బరి చట్నీతో అదిరిపోయే కాంబో
- 10 నిమిషాల్లో రెడీ అయ్యే టేస్టీ బ్రేక్ఫాస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Instant Dosa : సాధారణంగా దోశలు వేసుకోవాలంటే బియ్యం, పప్పులను ముందురోజే నానబెట్టి, రుబ్బి, పులియబెట్టాల్సి ఉంటుంది. కానీ కొన్నిసార్లు పిండి అందుబాటులో లేనప్పుడు లేదా అప్పటికప్పుడు ఏదైనా రుచిగా తినాలనిపించినప్పుడు ఈ ఇబ్బంది లేకుండా ‘ఇన్స్టెంట్ క్రిస్పీ దోశ’ను నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. దీనికి తోడుగా అదిరిపోయే రుచితో ఉండే పల్లి కొబ్బరి చట్నీ కూడా ఉంటే ఆ రుచి రెట్టింపు అవుతుంది. ఆ రెసిపీల వివరాలు ఇప్పుడు చూద్దాం.
1. అదిరిపోయే రుచితో పల్లి కొబ్బరి చట్నీ
దోశల్లోకి పల్లి చట్నీ ఎప్పుడూ ఒక పర్ఫెక్ట్ కాంబినేషన్. దీని తయారీకి ఒక కప్పు పల్లీలు, ఒక కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు, అర కప్పు పుట్నాల పప్పు, 3-4 పచ్చిమిర్చి, రెండు ఎండుమిర్చి, కొద్దిగా చింతపండు , రుచికి సరిపడా ఉప్పు అవసరమవుతాయి.
Also Read
- Chicken Biryani Recipe: చికెన్ బిర్యానీ పర్ఫెక్ట్ ఫార్ములా.. నలుగురికి ఎంత బియ్యం, ఎంత చికెన్ వాడాలో తెలుసా..?
- Health Benefits of Eggs: ప్రతిరోజూ ఒక గుడ్డు తింటున్నారా..? శరీరంలో జరిగే అద్భుత మార్పులు ఇవే..
- Soya Manchurian: పిల్లలు లొట్టలేసుకుంటూ తినే 'మిల్ మేకర్ మంచూరియా'.. టేస్టీగా, హెల్తీగా ఇంట్లోనే ఇలా ఈజీగా చేసేయండి!
- Crispy Bread Pakoda Recipe: పిల్లలు ఎగబడి తినే స్నాక్.. ఇంట్లోనే కరకరలాడే బ్రెడ్ పకోడా ఇలా తయారు చేసుకోండి!
తయారీ విధానం:
ముందుగా ఒక పాన్ తీసుకుని పల్లీలను లో ఫ్లేమ్లో ఎర్రగా వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే పాన్ లో కొంచెం నూనె వేసి పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కొబ్బరి ముక్కలు , పుట్నాల పప్పు వేసి ఒక్క నిమిషం పాటు వేయించి చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో వేయించిన పల్లీలు, మసాలా మిశ్రమం, చింతపండు, ఉప్పు వేయాలి. కొద్దిగా నీళ్లు పోస్తూ మరీ మెత్తగా కాకుండా లైట్ బరకగా గ్రైండ్ చేసుకోవాలి. చివరగా ఆవాలు, మినపగుళ్ళు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకుతో తాలింపు పెట్టుకుంటే టేస్టీ చట్నీ సిద్ధమవుతుంది.
2. అప్పటికప్పుడే ఇన్స్టెంట్ క్రిస్పీ దోశ
పిండి పులియబెట్టే అవసరం లేకుండా అప్పటికప్పుడే ఈ దోశలను తయారు చేసుకోవచ్చు. దీనికోసం ఒక కప్పు బియ్యపు పిండి, పావు కప్పు శనగపిండి, ఒక మీడియం సైజు పచ్చి బంగాళదుంప, అర కప్పు పెరుగు (పులిసినది అయితే మరింత రుచి), 5-6 వెల్లుల్లి రెబ్బలు, వేడి నీళ్లలో నానబెట్టిన రెండు ఎండుమిర్చి, అర టీస్పూన్ బేకింగ్ సోడా , ఉప్పు సిద్ధం చేసుకోవాలి.
తయారీ విధానం:
ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో నానబెట్టిన ఎండుమిర్చి, బియ్యపు పిండి, శనగపిండి, పచ్చి బంగాళదుంప ముక్కలు, వెల్లుల్లి, పెరుగు, రుచికి సరిపడా ఉప్పు , అర కప్పు నీళ్లు వేయాలి. వీటన్నింటినీ కలిపి మెత్తటి మిశ్రమంగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పిండిని ఒక గిన్నెలోకి తీసుకుని అందులో బేకింగ్ సోడా వేసి బాగా కలుపుకోవాలి.
దోశ వేసే పద్ధతి
దోశ పెనం వేడి చేసి, కొద్దిగా నీళ్లు చిలకరించి క్లీన్ చేయాలి. మంటను లో ఫ్లేమ్లో ఉంచి పిండిని పల్చగా స్ప్రెడ్ చేయాలి. దోశ పైన తడి ఆరిపోయిన తర్వాత నూనె లేదా నెయ్యి వేసి, మీడియం ఫ్లేమ్లో ఎర్రగా కాలే వరకు కాల్చుకోవాలి. అంతే! వేడివేడిగా ఉండే క్రిస్పీ దోశలను పల్లి చట్నీతో తింటే చాలా రుచిగా ఉంటాయి.
తాజావార్తలు
-
Trigrahi Raja Yoga: జూన్ 15న మిథున రాశిలో “త్రిగ్రాహి రాజయోగం”.. ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..
-
Meenakshi Natarajan: నాది బూటకపు కేసు కాదు.. మీనాక్షి నటరాజన్ ఫిర్యాదుదారు కీలక వ్యాఖ్యలు
-
Revanth Reddy: కేబినెట్ విస్తరణపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్.. ఎప్పుడంటే..?
-
Rajnath Singh: మన దగ్గర ఏ రోగానికైనా మందుంది.. బ్రహ్మోస్ ఉంది.. రాజ్నాథ్సింగ్ కీలక వ్యాఖ్యలు
-
Virat Kohli’s Replacement: విరాట్ కోహ్లీ స్థానంలో కాటేరమ్మ కొడుకుకే ఛాన్స్.. ఇక పూనకాలే..
ట్రెండింగ్
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!