ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్తో తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నిర్మాతలు 14 మంది సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు ఒక కీలక సమావేశం నిర్వహించారు. ఈ భేటీ గత కొన్ని రోజులుగా తెలుగు చిత్ర పరిశ్రమలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ సమావేశంలో నిర్మాతలు మంత్రి కందుల దుర్గేష్కు పరిశ్రమలో ప్రస్తుతం జరుగుతున్న సమస్యలు, సవాళ్లు మరియు తాజా పరిణామాల గురించి వివరించారు. ఫిల్మ్ ఫెడరేషన్ సమ్మె, కార్మికుల…
స్త్రీ శక్తి స్కీమ్ ఆగస్టు 15 నుంచి ప్రారంభంపై ఉత్తర్వులు జారీ చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఐదు రకాల బస్సుల్లో రాష్ట్రం అంతా మహిళలు ఉచితంగా ప్రయాణం చెయ్యచ్చు. పల్లె వెలుగు. అల్ట్రా పల్లె వెలుగు... సిటీ ఆర్డినరీ.. మెట్రో.. ఎక్స్ ప్రెస్లో ప్రయాణం చెయ్యచ్చు. ఆంధ్రప్రదేశ్ నివాసులైన మహిళలు, ట్రాన్స్జెండర్లు – ఐడీ ప్రూఫ్తో ఉచిత ప్రయాణానికి అర్హులు.. నాన్స్టాప్, ఇంటర్స్టేట్, చార్టర్డ్, ప్యాకేజ్ టూర్ బస్సులకు ఈ స్కీమ వర్తించదు.. సప్తగిరి ఎక్స్ప్రెస్, అల్ట్రా…
ఒకపక్క బడా నిర్మాతలు అందరూ ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తో భేటీ అవుతుంటే, మరొక పక్క టాలీవుడ్కు చెందిన వర్ధమాన నిర్మాతలు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ రోజు మధ్యాహ్నం వారంతా మీడియాతో మాట్లాడతారని సమాచారం వచ్చింది. సరిగ్గా 2 గంటలకు ప్రారంభం కాబోతున్న ఈ సమావేశంలో వర్ధమాన నిర్మాతలు ఎస్కేఎన్, ధీరజ్ మొగిలినేని, భైరవకోన నిర్మాత రాజేష్ దండ, హనుమాన్ నిర్మాత నిరంజన్ రెడ్డి భార్య చైతన్య, చాయ్ బిస్కెట్ సంస్థ…
పులివెందుల జడ్పీటీసీ ఎన్నిక సందర్భంగా పోలింగ్ బూతుల వ్యవహారం తీవ్ర వివాదంగా మారింది.. రాష్ట్ర ఎన్నికల కమిషన్, కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. అయితే, ఈ వ్యవహారం ఇప్పుడు హైకోర్టు వరకు వెళ్లింది.. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక సందర్భంగా పోలింగ్ బూతుల మార్పును సవాలు చేస్తూ ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది వైసీపీ.. ఈ రోజు వైసీపీ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ పై విచారణ…
గత ప్రభుత్వ హయాంలో 'ఆడుదాం ఆంధ్రా' పేరుతో ఆటలు నిర్వహించారు.. అయితే, దీంట్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందనే ఆరోపణలు వచ్చాయి.. దీనిపై ఇప్పటికే విజిలెన్స్ విచారణ పూర్తి అయ్యింది.. రేపో.. మాపో ఏపీ ప్రభుత్వానికి ఆడుదాం ఆంధ్రాకు సంబంధించిన నివేదిక అందనుంది.. దీంతో, వైఎస్ జగన్ కేబినెట్లో క్రీడా మంత్రిగా పనిచేసిన ఆర్కే రోజా అరెస్ట్ తప్పదా? అనే చర్చ సాగుతోంది..
వైఎస్ జగన్మోహన్రెడ్డి మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి పై కేసు నమోదు అయ్యింది.. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన.. ఆ తర్వాత శ్రీవారి ఆలయం ముందు రాజకీయ వాఖ్యలు చేశారని రవీంద్రనాథ్ రెడ్డి పై పోలీసులకు ఫిర్యాదు చేశారు టీటీటీ విజిలెన్స్ అధికారులు. ఇక, విజిలెన్స్ ఫర్యాదుతో రవీంద్రనాథ్ రెడ్డిపై కేసు నమోదు చేశారు తిరుమల పోలీసులు.
ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటుపై కసరత్తు చేస్తోంది.. కొత్త జిల్లాల మార్పుకు సంబంధించి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.. కొన్ని జిల్లాల సరిహద్దులు, పేర్లు, మండలాల మార్పులపై మంత్రివర్గ ఉపసంఘం కసరత్తు చేస్తుండగా.. స్వరూపం మార్చుకోనున్నాయి కొన్ని జిల్లాలు... జిల్లాల సంఖ్య 26 నుంచి 32కి పెరిగే అవకాశం ఉంది..
అల్లూరి సీతారామరాజు జిల్లాలో హైడ్రోపవర్ ప్లాంట్ వ్యతిరేక పోరాటం తీవ్ర రూపం దాలుస్తోంది. అరకులోయ మండలం లోతేరులో సర్వే రాళ్లను ధ్వంసం చేశారు గిరిజనులు.. తమ సంప్రదాయ ఆ యుధాలతో ప్రదర్శన నిర్వహించారు. పవర్ ప్లాంట్లను తరిమి కొడతామని హెచ్చరించడంతో ఏజెన్సీ నివురుగప్పింది.