Healthy Food: బాలింతలకు వరం.. పసిపాపలకు బలం.. ‘బీరకాయ తెలగపిండి కూర’!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Healthy Food: పురిటి గదిలో ఉన్న బాలింతలకు ఆహారం విషయంలో పెద్దలు ఎన్నో జాగ్రత్తలు చెబుతుంటారు. బిడ్డకు పాలు సమృద్ధిగా అందాలన్నా, తల్లి త్వరగా కోలుకోవాలన్నా బలమైన ఆహారం ఎంతో అవసరం. అటువంటి పౌష్టిక ఆహారాల్లో ‘తెలగపిండి’ది అగ్రస్థానం. పూర్వీకుల కాలం నుంచి వస్తున్న ఈ సాంప్రదాయ వంటకాన్ని బీరకాయతో కలిపి వండితే రుచితో పాటు బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయి. మరి ఈ అద్భుతమైన రెసిపీని ఎలా తయారు చేయాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
READ ALSO: AP High Court: యూనివర్సిటీల్లో పదవీ విరమణ వయస్సు కేసు.. వివక్షపూరితమేనన్న హైకోర్టు..
Also Read
- Karnataka: కాంగ్రెస్ అధిష్టానానికి కొత్త తలనొప్పి.. కేరళ కథ సుఖాంతం.. కర్ణాటకలో మొదలైన అసలు సినిమా!
- Pakistan Whitewash: తేలిపోయిన పాకిస్థాన్ బ్యాటర్స్.. బంగ్లాదేశ్ చేతిలో క్లీన్ స్వీప్..!
- CM Vijay Anti Corruption Drive: అవినీతి ప్రక్షాళనకు సీఎం విజయ్ కీలక నిర్ణయం.. లంచంపై ఫిర్యాదుకు రూ.1 లక్ష బహుమతి..
- 55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
అసలు తెలగపిండి అంటే..
నువ్వుల నుంచి నూనెను వేరు చేసినప్పుడు వచ్చే పిట్టునే తెలగపిండి అంటారు. ఇందులో ప్రోటీన్లు, ఫైబర్, కాల్షియం, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది కేవలం బాలింతలకే కాదు, ఎముకల బలం కోసం, గుండె ఆరోగ్యానికి, జీర్ణక్రియ మెరుగుపడటానికి ప్రతి ఒక్కరూ తీసుకోవచ్చు.
కావలసిన పదార్థాలు:
బీరకాయ ముక్కలు: 400 గ్రాములు
తెలగపిండి: 3 టేబుల్ స్పూన్లు
పాలు: అర కప్పు (కాచి చల్లార్చినవి)
ఉల్లిపాయ ముక్కలు: 1 కప్పు
వెల్లుల్లి రెబ్బలు: 2 టేబుల్ స్పూన్లు
పచ్చిమిర్చి: 4 నుంచి 6
నువ్వుల నూనె లేదా వేరుశనగ నూనె: 3 టేబుల్ స్పూన్లు
తాలింపు గింజలు, కరివేపాకు, ఉప్పు, పసుపు, కొత్తిమీర తగినంత.
తయారీ విధానం:
ముందుగా కడాయిలో నూనె వేసి వేడయ్యాక తాలింపు గింజలు వేయాలి. ఈ కూరకి నువ్వుల నూనె వాడితే రుచి అద్భుతంగా ఉంటుంది. అందులోనే వెల్లుల్లి రెబ్బలు వేసి దోరగా వేయించాలి. ఆపై ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. ఉల్లిపాయలు కాస్త మగ్గాక బీరకాయ ముక్కలు, పసుపు, ఉప్పు వేసి మూత పెట్టి మధ్యస్థ మంటపై మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి. బీరకాయలు చక్కగా ఉడికిన తర్వాత అందులోకి అర కప్పు పాలు పోయాలి. మంటను తగ్గించి (Sim లో పెట్టి) ఒకసారి కలపాలి. పాలు పోసిన వెంటనే తెలగపిండి వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని రెండు నిమిషాల పాటు సన్నటి సెగ మీద మగ్గనివ్వాలి. చివరగా పచ్చి కొబ్బరి తురుము (ఆప్షనల్), కొత్తిమీర చల్లుకుని దించుకోవాలి.
ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..
ఈ కూర తినడం వల్ల బాలింతలలో పాలు సమృద్ధిగా పడతాయి. ప్రసవం తర్వాత తల్లులకు వచ్చే నడుము నొప్పిని తగ్గించి ఎముకలకు బలాన్ని ఇస్తుంది. ఇందులో మసాలాలు ఉండవు కాబట్టి కడుపు మంట లేకుండా సులభంగా అరుగుతుంది.
READ ALSO: India vs Zimbabwe: టీమిండియాలో ప్రక్షాళన.. నెక్ట్స్ మ్యాచ్లో ఆ స్టార్ ప్లేయర్కు ఉద్వాసన!
తాజావార్తలు
-
Karnataka: కాంగ్రెస్ అధిష్టానానికి కొత్త తలనొప్పి.. కేరళ కథ సుఖాంతం.. కర్ణాటకలో మొదలైన అసలు సినిమా!
-
He-Man: హాలీవుడ్ సూపర్ హీరోకి టాలీవుడ్ టచ్.. ‘హీ-మ్యాన్’లో నిఖిల్ పవర్ఫుల్ ఎంట్రీ!
-
Jasprit Bumrah: ఆఫ్ఘనిస్థాన్ సిరీస్కు దూరం.. బుమ్రా రీఎంట్రీపై బీసీసీఐ కీలక అప్డేట్?
-
Kantamaneni Ravi Shankar: పంచభూతాలపై టాలీవుడ్ లో కొత్త సినిమా
-
CM Vijay: సీఎం విజయ్కి షాక్ ఇచ్చిన మిత్రపక్షాలు.. ‘రెండు ఆకుల’ రాజకీయంలో దళపతి వెనకడుగు!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!