శ్రీశైలం డ్యామ్ వద్ద కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయిన సందర్భాలు ఉన్నాయి.. అయితే, ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు సిద్ధం అవుతున్నారు పోలీసులు.. శ్రీశైలాం జలాశయం వద్ద తలెత్తుతున్న ట్రాఫిక్ సమస్యలపై సున్నిపెంట పోలీసులు చర్యలు చేపట్టారు..
కడప జిల్లాలో జరుగుతోన్న జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు మంత్రి కొలుసు పార్థసారథి.. పులివెందులలో ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తోందని ఆయన అన్నారు.. గత ప్రభుత్వం పాలనలో అవినీతి అక్రమాలు జరిగాయని దీంతో ప్రజలు తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారన్నారు..
గుట్కా ప్యాకెట్ల వ్యవహారంలో ఓ హెడ్ కానిస్టేబుల్పై జనసేన నేత దాడి చేయడం కలకలం సృష్టించింది.. నంద్యాలలో ఈ ఘటన జరిగింది.. జిల్లా ఎస్పీ స్పెషల్ క్రైమ్ పార్టీ హెడ్ కానిస్టేబుల్ మణిని చితకబాదారు జనసేన జిల్లా కో-ఆర్డినేటర్ పిడతల సుధాకర్..
Minister Anitha: రాఖీ పౌర్ణమి సందర్భంగా విశాఖ కేంద్ర కారాగారానికి ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత వెళ్లారు. ఈ సందర్భంగా యువ ఖైదీలైన 30 మందితో పాటు జైళ్లశాఖ అధికారులకు సైతం రాఖీలు కట్టింది.
CPI Narayana: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తీవ్ర విమర్శలు చేశారు. కేంద్ర ప్రభుత్వ కటాక్షం లేకుంటే జగన్ ఇన్ని రోజులు కోర్టుకు వెళ్లకుండా బయట ఉండటం సాధ్యం కాదన్నారు.
Minister Kollu Ravindra: ఏపీలో ఇవాళ్టి నుంచి నాలుగు రోజుల పాటు బీసీల కృతజ్ఞత ర్యాలీలు జరగనున్నాయి. కూటమి ప్రభుత్వం బీసీలకు చేసిన సంక్షేమంపై చంద్రబాబు చిత్రపటాలకు పాలాభిషేకాలు చేయబోతున్నట్లు మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు.
జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. తన అన్న నాగబాబుకు మంత్రి పదవి ఇప్పిస్తారా..? లేదా..? మార్చిలోనే MLC అయ్యారు నాగబాబు. ఆయన్ని కేబినెట్లోకి తీసుకుంటామని 2024 డిసెంబర్లోనే ప్రకటించారు సీఎం చంద్రబాబు. మరి ఎందుకు ఇంత ఆలస్యం. నాగబాబు అమాత్య యోగానికి అడ్డం ఏంటీ..? పవన్ కళ్యాణ్కు వేరే ఆలోచన ఏమైనా ఉందా..?
ఆ ఎమ్మెల్యే చెప్పేవన్నీ కబుర్లు తప్ప... చేతల్లో కనిపించడం లేదా? మాటలు కోటలు దాటుతున్నాయి గానీ... అభివృద్ధి పనులు గడప కూడా దాటడం లేదా? పైగా అనుచరులు దందాల్లో ఆరితేరిపోయి ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారా? ఎమ్మెల్యేకి స్ననిహితుడైన డాక్టర్ వైద్యం మానేసి సెటిల్మెంట్స్లో బిజీగా ఉన్నారా? ఎవరా ఎమ్మెల్యే? ఎక్కడ జరుగుతోందా తంతు?
అధికార పార్టీకి విపరీతమైన పట్టున ఆ నియోజకవర్గంలో వైసీపీ తప్పుల మీద తప్పులు చేస్తోందా? అధిష్టానం నిర్ణయంతో ఇప్పుడు కేడర్ డైలమాలో పడిందా? ఆగండి... రా.. రండని నియోజకవర్గ ఇన్ఛార్జ్ పిలుస్తున్నా... పట్టించుకునే స్థితిలో ద్వితీయ శ్రేణి లేదా? ఏదా అసెంబ్లీ సెగ్మెంట్? అక్కడున్న ప్రత్యేక పరిస్థితులేంటి?