AP High Court: యూనివర్సిటీల్లో పదవీ విరమణ వయస్సు కేసు.. వివక్షపూరితమేనన్న హైకోర్టు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP High Court: విశ్వవిద్యాలయాల్లో బోధనా సిబ్బంది పదవీ విరమణ వయస్సు పెంపు అంశంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కీలక విచారణ జరిగింది. కొన్ని విశ్వవిద్యాలయాల్లో పదవీ విరమణ వయస్సును 65 సంవత్సరాలకు పెంచకుండా వదిలేయడం వివక్షపూరిత చర్యగా కనిపిస్తోందని ఈ సందర్భంగా హైకోర్టు వ్యాఖ్యానించింది. రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించకూడదని కోర్టు స్పష్టం చేసింది. “మనది ప్రజాస్వామ్య దేశం, నియంతృత్వ దేశం కాదు” అంటూ అధికారులపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. సీఎంవోలో కొందరు అధికారులు నిర్ణయాలు తీసుకుంటే సరిపోదని, అన్ని శాఖలు రాజ్యాంగ పరిమితుల్లోనే పనిచేయాలని సూచించింది.
విశ్వవిద్యాలయాల్లో కేవలం బీసీలు, రిజిస్ట్రార్లు నియమిస్తే సరిపోతుందా? బోధనా సిబ్బంది అవసరం లేదా? విద్యార్థులు నాణ్యమైన విద్య ఎలా పొందగలరు? అంటూ కోర్టు ప్రశ్నించింది. వేల కోట్ల ప్రజాధనం ఖర్చు చేస్తున్నప్పుడు బోధనా సిబ్బందిని నియమించకపోవడం సరికాదని వ్యాఖ్యానించింది. కాగా, రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత విద్యాశాఖ పరిధిలోని విశ్వవిద్యాలయాల్లో యూజీసీ స్కేలు పొందుతున్న బోధనా సిబ్బంది పదవీ విరమణ వయస్సును 62 నుంచి 65 సంవత్సరాలకు పెంచింది. అయితే వ్యవసాయ శాఖ పరిధిలోని విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న బోధనా సిబ్బందికి ఈ పెంపు వర్తింపజేయలేదు. దీంతో Sri Venkateswara Veterinary University, Andhra Pradesh Fisheries University, Acharya N. G. Ranga Agricultural Universityలకు చెందిన అధ్యాపకులు హైకోర్టును ఆశ్రయించారు.
Also Read
- Atchannaidu: ఎరువుల అక్రమ రవాణాపై మంత్రి సీరియస్.. డీలర్లపై కఠిన చర్యలకు ఆదేశాలు
- AP Heatwave Alert: ఏపీలో భగ్గుమంటున్న ఎండలు.. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు..
- TDP Mahanadu 2026: మహానాడులో 20 కీలక తీర్మానాలు.. తెలంగాణ నుంచి 4 ప్రత్యేక ప్రతిపాదనలు!
- Deputy CM Pawan Kalyan: పంచాయతీరాజ్ శాఖలో ప్రత్యేక డ్యాష్బోర్డులు.. పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు..
ముందుగా సింగిల్ జడ్జి పిటిషన్ను కొట్టివేయగా, ఆ తీర్పును సవాల్ చేస్తూ ప్రొఫెసర్లు, శాఖాధిపతులు డివిజన్ బెంచ్ ముందు అప్పీల్ దాఖలు చేశారు. ఇక, జస్టిస్ దేవానంద్ నేతృత్వంలోని ధర్మాసనం ప్రభుత్వ చర్యలు ప్రాథమికంగా వివక్షపూరితంగా కనిపిస్తున్నాయని వ్యాఖ్యానించింది. వ్యవసాయ, ఉద్యానవన, పశుసంవర్ధక, మత్స్య విశ్వవిద్యాలయాల్లో యూజీసీ స్కేలు పొందుతున్న బోధనా సిబ్బందిని తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశించింది. అలాగే, మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేసి తమ వైఖరిని వివరించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. ఈ కేసు విశ్వవిద్యాలయాల్లో బోధనా సిబ్బంది హక్కులు, సమానత్వ సూత్రం, మరియు విద్యా వ్యవస్థ నాణ్యతపై ప్రభావం చూపే అంశంగా మారింది.
తాజావార్తలు
-
Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
-
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
-
Trump: నెతన్యాహు నేను చెప్పిందే చేస్తారు.. ఇజ్రాయెల్లో నేనే ప్రధాని కావొచ్చన్న ట్రంప్
-
Summer Special: మామిడితో ఈ మ్యాజిక్ ట్రై చేశారా..? ఒక్క స్పూన్ తింటే మళ్లీ మళ్లీ అడుగుతారు!
-
West Bengal: అక్రమ బంగ్లాదేశీయుల బహిష్కరణ.. బెంగాల్లో సీఏఏ స్టార్ట్..
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!