AP High Court: యూనివర్సిటీల్లో పదవీ విరమణ వయస్సు కేసు.. వివక్షపూరితమేనన్న హైకోర్టు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP High Court: విశ్వవిద్యాలయాల్లో బోధనా సిబ్బంది పదవీ విరమణ వయస్సు పెంపు అంశంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కీలక విచారణ జరిగింది. కొన్ని విశ్వవిద్యాలయాల్లో పదవీ విరమణ వయస్సును 65 సంవత్సరాలకు పెంచకుండా వదిలేయడం వివక్షపూరిత చర్యగా కనిపిస్తోందని ఈ సందర్భంగా హైకోర్టు వ్యాఖ్యానించింది. రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించకూడదని కోర్టు స్పష్టం చేసింది. “మనది ప్రజాస్వామ్య దేశం, నియంతృత్వ దేశం కాదు” అంటూ అధికారులపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. సీఎంవోలో కొందరు అధికారులు నిర్ణయాలు తీసుకుంటే సరిపోదని, అన్ని శాఖలు రాజ్యాంగ పరిమితుల్లోనే పనిచేయాలని సూచించింది.
విశ్వవిద్యాలయాల్లో కేవలం బీసీలు, రిజిస్ట్రార్లు నియమిస్తే సరిపోతుందా? బోధనా సిబ్బంది అవసరం లేదా? విద్యార్థులు నాణ్యమైన విద్య ఎలా పొందగలరు? అంటూ కోర్టు ప్రశ్నించింది. వేల కోట్ల ప్రజాధనం ఖర్చు చేస్తున్నప్పుడు బోధనా సిబ్బందిని నియమించకపోవడం సరికాదని వ్యాఖ్యానించింది. కాగా, రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత విద్యాశాఖ పరిధిలోని విశ్వవిద్యాలయాల్లో యూజీసీ స్కేలు పొందుతున్న బోధనా సిబ్బంది పదవీ విరమణ వయస్సును 62 నుంచి 65 సంవత్సరాలకు పెంచింది. అయితే వ్యవసాయ శాఖ పరిధిలోని విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న బోధనా సిబ్బందికి ఈ పెంపు వర్తింపజేయలేదు. దీంతో Sri Venkateswara Veterinary University, Andhra Pradesh Fisheries University, Acharya N. G. Ranga Agricultural Universityలకు చెందిన అధ్యాపకులు హైకోర్టును ఆశ్రయించారు.
Also Read
- Mavigan vs Amaravati: నెక్ట్స్ ఫైట్ 'మావిగన్ వర్సెస్ అమరావతి'.. వైఎస్ జగన్ సవాల్..
- YS Jagan: సాయికృష్ణ కేసులో కవర్అప్ జరిగిందా? జగన్ సంచలన ఆరోపణలు
- YS Jagan: పీఎస్కు వెళ్లాలంటే భయపడే పరిస్థితి.. జగన్ సంచలన వ్యాఖ్యలు
- 108 Ambulances at District Courts: జిల్లా కోర్టుల వద్ద 108 అంబులెన్సులు.. ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం
ముందుగా సింగిల్ జడ్జి పిటిషన్ను కొట్టివేయగా, ఆ తీర్పును సవాల్ చేస్తూ ప్రొఫెసర్లు, శాఖాధిపతులు డివిజన్ బెంచ్ ముందు అప్పీల్ దాఖలు చేశారు. ఇక, జస్టిస్ దేవానంద్ నేతృత్వంలోని ధర్మాసనం ప్రభుత్వ చర్యలు ప్రాథమికంగా వివక్షపూరితంగా కనిపిస్తున్నాయని వ్యాఖ్యానించింది. వ్యవసాయ, ఉద్యానవన, పశుసంవర్ధక, మత్స్య విశ్వవిద్యాలయాల్లో యూజీసీ స్కేలు పొందుతున్న బోధనా సిబ్బందిని తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశించింది. అలాగే, మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేసి తమ వైఖరిని వివరించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. ఈ కేసు విశ్వవిద్యాలయాల్లో బోధనా సిబ్బంది హక్కులు, సమానత్వ సూత్రం, మరియు విద్యా వ్యవస్థ నాణ్యతపై ప్రభావం చూపే అంశంగా మారింది.
తాజావార్తలు
-
Unused Apps: మీ ఫోన్లో ఈ యాప్స్ ఉన్నాయా? వెంటనే డిలీట్ చేయండి.. లేదంటే మీ పర్సనల్ డేటా గోవింద..!
-
Acer TravelLite TL24-54M: భారత్ లో ఏసర్ ట్రావెల్ లైట్ TL24-54M ల్యాప్టాప్ విడుదల.. DDR5 RAM సపోర్ట్, AI ఫీచర్లు
-
Tridha: బాబీ డియోల్తో బోల్డ్ సీన్లే బ్రేకప్కు కారణమా? మాజీ ప్రియుడిపై షాకింగ్ కామెంట్స్ చేసిన త్రిధా!
-
Mavigan vs Amaravati: నెక్ట్స్ ఫైట్ ‘మావిగన్ వర్సెస్ అమరావతి’.. వైఎస్ జగన్ సవాల్..
-
Kohinoor: ఈ వజ్రం కోసం యుద్ధాలు ఎందుకు జరిగాయి? శతాబ్దాలుగా వీడని మిస్టరీ!
ట్రెండింగ్
-
How to Kill Men: మెట్రోలో యువతి చేతిలో ‘మగాళ్లను చంపడం ఎలా’ పుస్తకం.. షాక్ అవుతున్న నెటిజన్లు!
-
Harry Brook: మా ప్లాన్స్ మాకున్నాయి.. దాచాం చాలా.. వైభవ్ను ఈజీగా బుట్టలో వేస్తాం!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ రాకపోవడమే మంచిది.. అసలు కారణం..!
-
IND vs ENG 1st T20: ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన.. ఆ ఇద్దరు స్టార్లకు నో ప్లేస్.. టీమిండియా హ్యాపీ!
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..