రానున్న మూడు రోజుల పాటు రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు.. మరికొన్ని చోట్ల మోస్తరు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ప్రకటించింది.. ఈరోజు తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీవర్షాలు ఒకటి లేదా రేడు చోట్ల కురిసే ఛాన్స్ ఉండగా.. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించనున్నాయి.. బలమైన గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల…
ఎమ్మెల్యేలు, సమన్వయ కర్తలకు సీఎం వైఎస్ జగన్ ఫైనల్ వార్నింగ్ ఇచ్చారు.. అక్టోబర్ నెల డెడ్ లైన్గా పెట్టారు.. అక్టోబరులోగా పని తీరు మెరుగు పర్చుకోకుంటే నో టికెట్స్ అంటూ తేల్చేశారు.. ఈ సమావేశంలో ముఖ్యంగా 18 మంది ఎమ్మెల్యేల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు సీఎం జగన్.. అక్టోబర్ నాటికి పని తీరు మెరుగుపరుచుకోవాలని సూచించిన ఆయన.. 18 మంది పేర్లు చెప్పడం సరికాదన్నారు.
సంక్షేమ పథకాల విషయంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి సర్కార్ వెనక్కి తగ్గడం లేదు.. తాజాగా మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టేందుకు సిద్ధమైంది.. 'జగనన్న సురక్ష' పేరుతో కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామ, వార్డు సచివాలయ పరిధిలో ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేయనున్నారు.. ఈ కార్యక్రమాన్ని జులై 1 నుంచి ప్రారంభిస్తారు..
Protest Against Somu Veerraju: బాపట్ల జిల్లా చీరాలలో ఆంధ్రప్రదేశ్, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజుకు నిరసన సెగ తగిలింది. ఏపీకి ప్రత్యేక హోదా సంగతి ఏంటి..? విశాఖ ఉక్కు పరిస్థితి ఏంటి? విశాఖ రైల్వే జోన్ అంశాన్ని ఏం చేశారంటూ సభలో ప్లకార్డులు ప్రదర్శించారు. చీరాల అభివృద్ధి సాధన సమితి ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. నిరసనకారులను అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. Read Also: Ruhani Sharma: షర్ట్ బటన్స్ విప్పి రుహానీ…
రాజకీయ స్వార్థం కోసం మతాన్ని వాడుకునే వ్యక్తిని కాదు.. జనసేన ప్రభుత్వంలో ముస్లింల జీవన ప్రమాణస్థాయిని పెంచుతామని హామీ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ముస్లింల హక్కులకు భంగం వాటిల్లకుండా జనసేన చూసుకుంటుంది అని కాకినాడలో జరిగిన ముస్లిం ప్రతినిధుల ఆత్మీయ సమావేశంలో స్పష్టం చేశారు..
హరి రామ జోగయ్య లేఖ ద్వారా ముద్రగడకు కౌంట్ ఇచ్చారు.. వారాహి యాత్ర ద్వారా దూసుకుపోతున్న పవన్ కల్యాణ్ని అనుసరించాలని కాపు సంక్షేమ సేన ఆశిస్తుందన్న ఆయన.. చిన్న మంత్రి పదవులు ఆశించి.. రెడ్డి కులాధిపతికి కాపులను తాకట్టు పెట్టాలని చూస్తున్న నాయకులను చూసి మోసపోకండి అని పిలుపునిచ్చారు.