Off The Record: సింహపురి సిత్రం చిత్ర విచిత్రంగా మారుతోందా? ఆదాల స్కెచ్ అదేనా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మళ్ళీ వైసీపీ జెండా ఎగరవేసేందుకు స్కెచ్ వేస్తోంది ఆ పార్టీ నాయకత్వం. సిట్టింగ్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వైసీపీకి దూరం కావడంతో పార్టీ వ్యవహారాలను పర్యవేక్షించేందుకు నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డిని సమన్వయకర్తగా నియమించారు. శ్రీధర్ రెడ్డి పార్టీకి దూరమైన తర్వాత… రూరల్ పరిధిలో వైసీపీకి చెందిన 16 మంది ఆదాల వైపునకు వచ్చారు. మరో పదిమంది శ్రీధర్ రెడ్డితోనే కొనసాగుతున్నారు. శ్రీధర్ రెడ్డి వర్గంలోని కార్పొరేటర్ల డివిజన్ లలో తన వర్గానికి చెందిన నేతలను ఇంఛార్జీలుగా నియమిస్తున్నారు ఆదాల. కొన్ని చోట్ల ఇంకా సరైన నేతలు దొరకకపోవడంతో అక్కడ పట్టు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయా డివిజన్ లలో అభివృద్ధి కార్యక్రమాలను ముమ్మరం చేస్తున్నారు. అక్కడ ప్రజల సమస్యలు తెలుసుకుని వాటిని సత్వరమే పరిష్కరించేలా అధికారులకు ఆదేశాలిస్తున్నారు.
Read Also: Off The Record: పవన్పై ముద్రగడ డైరెక్ట్ వార్..? వ్యూహం అదేనా..?
Also Read
- Trump-Netanyahu: ‘‘బీబీ నీపై విసుగొచ్చింది’’.. వెలుగులోకి ట్రంప్-నెతన్యాహు సంభాషణ
- Bathroom Tiles Cleaning Tips: రూ.10తో బాత్రూమ్ మెరుపు.. టైల్స్ శుభ్రం చేసే ఈజీ టిప్
- Kerala High Court: ‘‘దేవుళ్ల పేరుతో ప్రమాణం చెల్లదు’’.. బీజేపీ కార్పొరేటర్లకు హైకోర్టు షాక్..
- Holiday: మొహర్రం ఏ రోజు.. సెలవు జూన్ 25నా.. జూన్ 26నా..?
వారం రోజుల నుంచి ఆదాల దూకుడు పెంచడంతో స్థానిక నేతలు కొందరు ఆయన వైపు చూస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా తానే పోటీ చేస్థానని ఇప్పుడు సహకారం అందిస్తే తర్వాత తాను మరింత సహకరిస్తానని కింది స్థాయి నాయకులకు చెబుతున్నారట ఆదాల. తమ అనుచరులు అటువైపు చూస్తుంటడంతో కోటంరెడ్డి వర్గంలోని కార్పొరేటర్లకు పల్స్రేట్ పెరిగిపోతోందట. కొందరు ఆదాలతో ఫోన్లో టచ్లో ఉంటుూ.. మద్దతిస్తామని చెబుతున్నారట. ఇప్పటికే నలుగురు కార్పొరేటర్లు ఆదాల వైపు వెళ్లేందుకు సిద్ధమైనా.. శ్రీధర్ రెడ్డి నుంచి వస్తున్న ఒత్తిడికి తలొగ్గి వెనుకాడుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఆదాల కొత్త స్కెచ్లో భాగంగా మొదట మహిళా కార్పొరేటర్ల భర్తలు.. వారి కుటుంబ సభ్యులను తన వైపునకు తిప్పుకుంటున్నారట. కుటుంబ సభ్యులు వచ్చేస్తే… తర్వాత వాళ్ళు రాక ఎక్కడికిపోతారన్నది ఆయన లాజిక్ అట. పైగా ప్రజల్ని, కార్పొరేటర్స్ని ఆకట్టుకునేందుకు అక్కడ అభివృద్ధి కార్యక్రమాల జోరు పెంచారట.
Read Also: Off The Record: బీఆర్ఎస్కు కొందరు కార్పొరేటర్లు కంట్లో నలుసులా మారారా?
పనులు జరుగుతుండడంతో ఆ డివిజన్ల ఇన్ఛార్జ్లకు ఆర్థికంగా ప్రయోజనం కూడా కలుగుతోంది. అలా ఎన్నికల సమయానికి అన్ని డివిజన్లలో బలమైన వర్గాన్ని సిద్ధం చేసుకోవాలన్నది ఎంపీ వ్యూహంగా చెబుతున్నారు. 2014 నుంచి 2019 వరకూ టిడిపి తరపున నియోజకవర్గ వ్యవహారాలను ఆదాల పర్యవేక్షించారు. ఆ సమయంలో గ్రామీణ ప్రాంతాల్లోని నేతలతో సత్సంబంధాలు కొనసాగించారు. ప్రస్తుతం వైసీపీలో ఉన్నా…అప్పుడు తనకు మద్దతిచ్చిన టీడీపీ నాయకులతో సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలిసింది. మొత్తం మీద సింహపురి సిత్రాలు రాబోయే రోజుల్లో కొత్తగా మారబోతున్నాయి.
తాజావార్తలు
-
Sunitha : నా నవ్వు, నా ఏడుపు, నా హస్కీ వాయిస్.. అన్నిటినీ సొసైటీ జడ్జ్ చేస్తూనే ఉంది
-
Trump-Netanyahu: ‘‘బీబీ నీపై విసుగొచ్చింది’’.. వెలుగులోకి ట్రంప్-నెతన్యాహు సంభాషణ
-
Bathroom Tiles Cleaning Tips: రూ.10తో బాత్రూమ్ మెరుపు.. టైల్స్ శుభ్రం చేసే ఈజీ టిప్
-
Kerala High Court: ‘‘దేవుళ్ల పేరుతో ప్రమాణం చెల్లదు’’.. బీజేపీ కార్పొరేటర్లకు హైకోర్టు షాక్..
-
Sunitha : ఆ చేతులు వేయడం తప్పట్లేదు!” కాస్టింగ్ కౌచ్పై సునీత సంచలన నిజాలు
ట్రెండింగ్
-
Door Cleaning Tips : దుమ్ము పట్టిన తలుపులు మెరవాలా.? కిచెన్లోనే ఉంది సూపర్ సొల్యూషన్.!
-
Kitchen Tips : చెక్క, ప్లాస్టిక్, స్టీల్.. వంటగదికి ఏ చాపింగ్ బోర్డు ఆరోగ్యకరమో తెలుసా..?
-
సూపర్కార్ డిజైన్, ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. Infinix NOTE 60 Pro Pininfarina Limited Edition లాంచ్.!
-
6.39mm స్లిమ్ డిజైన్, 144Hz AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో TECNO CAMON Slim లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ తోపు అంతే.. ఐపీఎల్ 2026లో రూ.34 కోట్ల పెర్ఫార్మెన్స్!