Pawan Kalyan: నామినేటెడ్ పదవుల భర్తీపై డిప్యూటీ సీఎం కీలక సూచనలు.. వారికే ప్రాధాన్యత..!
Pawan Kalyan: జనసేన పార్టీ నాయకులు, శ్రేణులు తమ పంచాయతీల నుంచి పార్లమెంట్ నియోజకవర్గం వరకు అభివృద్ధిలో భాగం కావాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దిశానిర్దేశం చేశారు. తాజాగా మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో పార్టీ ముఖ్యనేతలతో పవన్ సమావేశం నిర్వహించారు. అనంతరం సమావేశంలో ఆయన మాట్లాడారు. తమ ప్రాంత అభివృద్ధిలో అక్కడ అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనలో క్రియాశీలకంగా వ్యవహరించేలా పార్టీ శ్రేణులను ముందుకు తీసుకువెళ్దామన్నారు. జనసేన పార్టీ కమిటీల నిర్మాణంలో భాగంగామన్నారు. గ్రామ స్థాయిలో అయిదుగురు సభ్యులతో కమిటీని నియమించాలని, వారు గ్రామాభివృద్ధిలో భాగమయ్యేలా చేద్దామని తెలిపారు. అదే విధంగా మండల, అసెంబ్లీ, లోక్ సభ నియోజకవర్గాల అభివృద్ధిపై ఆయా కమిటీలు దృష్టి కేంద్రీకరించేలా ముందుకు తీసుకువెళ్లాలని సూచించారు.
READ MORE: AP Heavy Rains: ప్రయాణికులకు అలర్ట్.. ఆ జిల్లాల్లో భారీ వర్షాల ధాటికి రోడ్లు జలదిగ్భందం..
Also Read
- IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చేశారు..
- Donald Trump: పాకిస్తాన్ మధ్యవర్తిత్వం విఫలం.. ట్రంప్ సంచలన నిర్ణయం..
- Barrier Free Tolling: భారత్లో కొత్త రకం టోల్ విధానం.. వాహనాలు ఆపాల్సిన అవసరం లేకుండా...
- Off The Record : కాకినాడలో 'పేకాట' జోరు.. వెనుక ఉన్నది ఎమ్మెల్యేల అనుచరులేనా?
రాష్ట్ర స్థాయి నుంచి క్షేత్ర స్థాయి వరకూ జనసేన పొందిన నామినేటెడ్ పదవుల వివరాలను పరిశీలించారు పవన్ కల్యాణ్. మిగిలిన పదవుల భర్తీపై పలు సూచనలు చేశారు. కూటమి ధర్మాన్ని అనుసరించి ముందుకు వెళ్లడంతోపాటు, పార్టీ కోసం చిత్తశుద్ధితో పని చేసినవారికి వివిధ దశల్లో గుర్తింపు, బాధ్యతలను అందించే దిశగా కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. పార్టీ కమిటీల నియామకంపై పవన్ పలు సూచనలు ఇచ్చారు. పవన్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామ స్థాయి నుంచి నియోజక వర్గ స్థాయి వరకూ పార్టీ కార్యక్రమాల నిర్వహణ బాధ్యతలకు అయిదుగురు చొప్పున సభ్యులతో కమిటీలు ఏర్పాటు చేయాలి. ఆ సభ్యులు స్థానికంగా అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించాలి. ఇప్పటికే పైలెట్ ప్రాజెక్ట్ గా పిఠాపురంలో నియోజకవర్గ స్థాయిలో అయిదుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటైంది.. ఆ కమిటీ పని తీరును మదింపు చేసి రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, మండల, నియోజకవర్గ కమిటీలు రూపకల్పన చేయాలి. పార్టీ అంతర్గత వ్యవహారాలకు సంబంధించి నెలకొనే అంశాలను పరిష్కరించేందుకు ఉద్దేశించిన కాన్ ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ విభాగాన్ని కేంద్ర కార్యాలయం నుంచే పర్యవేక్షించాలి. ఈ విభాగంలో 11 మంది వరకు సభ్యులను నియమించాలి. ఈ విభాగం ముందుకు వచ్చే అంశం ప్రాధాన్యం, తీవ్రతను బట్టి ముగ్గురు లేదా మొత్తం విభాగంలోని సభ్యులు చర్చించి పరిష్కరించాలని పార్టీ అధినేత పవన్ దిశానిర్దేశం చేశారు. ఇకపై ప్రతి కమిటీలో మహిళలకు స్థానం కల్పించాలని స్పష్టం చేశారు. అయిదుగురు సభ్యులు ఉండే కమిటీలో తప్పనిసరిగా ఒకరు, గరిష్టంగా ఇద్దరు వీర మహిళలు సభ్యులుగా ఉండాలి.. 11మంది సభ్యులు ఉండే కమిటీ ముగ్గురు వీర మహిళలకు స్థానం ఇస్తూ కమిటీలు ఉండాలని నిర్ణయించారు.
తాజావార్తలు
-
Aari Arjunan :‘GS’తో తెలుగులోకి బిగ్ బాస్ విన్నర్ ఆరి అర్జునన్!
-
IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చేశారు..
-
Suhas: సుహాస్, సూరి ‘మండాడి’ షూటింగ్ పూర్తి!
-
Off The Record : నెల్లిమర్ల ఎమ్మెల్యే పీఏపై తీవ్ర ఆరోపణలు
-
TVS Raider 125 2026: కొత్త TVS రైడర్ 125 బైక్.. అదరహో అనిపించే ఫీచర్లతో.. లక్ష రూపాయల కన్నా తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!