నెల్లూరులో నగర పాలక సంస్థ కార్యాలయంలో వివిధ విభాగాలు, కార్పొరేటర్లతో మంత్రి నారాయణ సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో జగన్ అరాచక పాలన చేశారని.. ఐదేళ్లపాటు నియంత పాలన కొనసాగిందని ఆయన విమర్శించారు.
Daggubati Purandeswari : బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా బీజేపీ కార్యకర్తలు అంకితభావంతో పని చేస్తున్నారని తెలిపారు. 2024 సభ్యత్వ నమోదు కార్యక్రమంలో తక్కువ సమయంలోనే 11 కోట్ల మంది సభ్యత్వం పొందారని, ఆంధ్రప్రదేశ్లో 25 లక్షల మంది కొత్త సభ్యులను చేర్చగలిగినందుకు పార్టీ కార్యకర్తల కృషిని కొనియాడారు. కార్యకర్తల ప్రతిష్ఠాభిమానంతోనే ఇది సాధ్యమైందని, భవిష్యత్తులో పారదర్శకంగా, సమర్థవంతంగా సంస్థాగత ఎన్నికలు నిర్వహించేందుకు ప్రణాళికలు చేస్తున్నామని వివరించారు. బీజేపీకి దేశవ్యాప్తంగా ప్రజల నుంచి…
Dokka Manikya Vara Prasad : మాజీ సీఎం జగన్ మీడియా సమావేశంలో పచ్చి అబద్ధాలు ఆడుతున్నారని మాజీ మంత్రి, టీడీపీ నేత డొక్కా మాణిక్య వరప్రసాద్ విమర్శించారు. ఆయన ఇవాళ మీడియాతో మాట్లాడుతూ.. అమెరికా కోర్ట్ వేసిన చార్జెస్ లో పేరు లేదు అంటున్నారని, నీ హయంలో జరిగిన దానికి నువ్వు కాక ఎవరు బాధ్యత వహించాలన్నారు డొక్కా మాణిక్య వరప్రసాద్. అదానీ డబ్బు నువ్వు తినకపోతే ఎవ్వరూ తిన్నారు నువ్వే చెప్పు అని ఆయన…
Gudivada Amarnath : వైఎస్ జగన్పై గత 15 ఏళ్లగా చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తూనే ఉన్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. ఆదానీ దగ్గర లంచం తీసుకున్నారని ఇప్పుడు ప్రచారం చేస్తున్నారని, దుష్ప్రచారం ఆపకపోతే ఈనాడు ఆంధ్రజ్యోతి పై 100 కోట్లు పరువు నష్టం దావా వేస్తానని జగన్ ప్రకటించారన్నారు. వాస్తవాలను ప్రజల ముందు వైఎస్ జగన్ ఉంచిన దుష్ప్రచారం చేస్తున్నారని, టీడీపీ గెజిట్ పేపర్లు ఈనాడు ఆంధ్రజ్యోతి అదే పనిగా తప్పుడు రాతలు…
ఏపీ హైకోర్టులో వైసీపీ సోషల్ మీడియా నేతలు సజ్జల భార్గవ్ రెడ్డి, అర్జున్రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్లపై నేడు విచారణ చేపట్టింది. మొత్తం 8 కేసుల్లో ముందస్తు బెయిల్ ఇవ్వాలని సజ్జల భార్గవ్రెడ్డి పిటిషన్లు దాఖలు చేశారు.. అయితే... అన్ని పిటిషన్లపై నేడు విచారణ చేసిన ఏపీ హైకోర్టు ఈ నెల 29కి వాయిదా వేసింది.
Raghurama Krishnaraju : సీఐడీ రిటైర్డ్ ఏఎస్పీ విజయ్పాల్ ను అరెస్ట్ చేయడం సంతోషంగా అనిపించిందన్నారు ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు. ఇవాళ ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. సీఐడీ రిటైర్డ్ ఏఎస్పీ విజయ్ పాల్ ఎన్నో దందాలు చేశారని, ఆయన పాపం పండిందన్నారు. తెలియదు అని క్రిమినల్ లాగా సమాధానాలు చెప్తున్నారు అని తెలిసిందని, నన్ను కస్టోడియల్ టార్చర్ చేశారని ఆయన వ్యాఖ్యానించారు. అసలు కుట్ర చేసింది పీవీసునీల్ కుమార్ అని ఆయన అన్నారు.…
Mithun Reddy : రేపటి నుంచి శీతాకాల పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో నేడు ఢిల్లీ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పాల్గొన్న వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి మాట్లాడుతూ… అఖిలపక్ష సమావేశంలో ఏపీకి సంబంధించిన అనేక డిమాండ్లు ప్రస్తావించామని, పోలవరం ప్రాజెక్టు ఎత్తుపై రాష్ట్ర మంత్రులు భిన్న ప్రకటనలు చేస్తున్నారన్నారు. పోలవరం ఎత్తు ఎంత అన్నదానిపై రకరకాల ప్రశ్నలు వస్తున్నాయని, పోలవరం అంశంపై పార్లమెంట్ లో చర్చించాలన్నారు మిథున్ రెడ్డి.…
అవినీతిలో జగన్ అంతర్జాతీయంగా ఎదిగిపోయాడని టీడీపీ సీనియర్ నేత, ఆక్వా కల్చర్ అభివృద్ధి సంస్థ చైర్మన్ ఆనం వెంకటరమణారెడ్డి విమర్శించారు. ఇవాళ ఆయన నెల్లూరులో మీడియాతో మాట్లాడుతూ.. గౌతమ్ అదానీని జగన్ మూడు సార్లు రహస్యంగా ఎందుకు కలిశారని, సీఎం చంద్రబాబు కూడా అనేక మందితో సమావేశమవుతారని, అధికారికంగా వారిని కలిసి మీడియాకి సమాచారం ఇస్తారన్నారు.
AP Legislative Council : ఏపీ శాసనమండలిలో ఈ రోజు సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టులపై ఘర్షణ చోటు చేసుకుంది. వైఎస్సార్సీపీ, టీడీపీ సభ్యుల మధ్య తీవ్ర వాదోపవాదం సాగింది. ఈ సందర్భంగా, వైఎస్సార్సీపీ సభ్యులు సభలో ఆందోళన చేపట్టారు. ఛైర్మన్ పోడియాన్ని చుట్టుముట్టి ఆందోళన చేయడం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా కళ్లకు కట్టిన చర్యలతో సభను అడ్డగించాలని వారు ప్రయత్నించారు. ఈ ఘటనపై మంత్రి గొట్టిపాటి రవికుమార్ తీవ్రంగా స్పందించారు. “సోషల్ మీడియాలో మహిళలపై అసభ్య పదజాలంతో…
Nimmala Ramanaidu : ఏపీ అసెంబ్లీ సమావేశాలు మూడో రోజు ప్రారంభమయ్యాయి. బుధవారం నాడు కొన్ని కీలకమైన చట్ట సవరణలపై శాసనసభలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బిల్లులను ప్రవేశపెట్టింది. అయితే.. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ.. వేదవతి లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మాణానికి 2019 జనవరి 29 న 1942 కోట్లతో పాలన అనుమతులు ఇచ్చామని తెలిపారు. వేదవతి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కోసం 4819 ఎకరాలు భూసేకరణ చేయాల్సి వస్తే , వైసిపి కేవలం 9…