CPI Narayana: కార్పొరేట్ సంస్థలను కాపాడుకోవడానికి ప్రధాని మోడీ అబద్ధాలు..!
- సమ్మెట్లో అబద్ధాలు చెప్పడం విచారకరం
- బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అవినీతి లేదన్నారు
- కాంగ్రెస్లో అవినీతి పెరిగిందని చెప్పడం సరికాదు
- సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కార్పొరేట్ సంస్థలను కాపాడుకోవడానికి ప్రధాని నరేంద్ర మోడీ సమ్మెట్లో అబద్ధాలు చెప్పడం విచారకరమని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు.. ఒక ప్రముఖ ఛానల్ ప్రధానమంత్రితో నిర్వహించిన సమ్మెట్లో దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అవినీతి లేదని, అభివృద్ధి పెరిగిందని, కాంగ్రెస్లో అవినీతి పెరిగిందని చెప్పడం సత్య దూరమని ఆయన అన్నారు. ఎన్. పి. ఎ. కింద 16 లక్షల కోట్లు ఉన్నాయని ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ స్వయంగా చెప్పారని, 2014 కంటే ముందు రెండున్నర లక్షల కోట్లు ఉంటే, బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 16 లక్షల కోట్లకు అవి చేరుకున్నాయని నారాయణ ధ్వజమెత్తారు..
READ MORE: Amit Shah: లోక్సభలో మాట్లాడే అవకాశమిస్తే రాహుల్గాంధీ విదేశాలకు వెళ్లిపోయారు
Also Read
- Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
- Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్కు నిలిచిపోనున్న రష్యా చమురు..
- Jobs: నిరుద్యోగులకు గొప్ప అవకాశం.. నెలకు శాలరీ రూ.1.99 లక్షలు..
- Petrol-Diesel Price: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై పుకార్లు.. ఎంత పెరగవచ్చంటే..!
డబ్బులు ఎగవేతలో ఒక విజయ్ మాల్య తప్ప, 28 మంది గుజరాత్ రాష్ట్రానికే చెందినవారని, ఎక్కువ మొత్తం బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాతే మొండి బకాయిల పేర్ల మీద కార్పొరేట్ వ్యక్తులకు డబ్బును మాఫీ చేశారన్నారు. భారతదేశంలో ఉన్న బిలియనీర్స్ బయటికి వెళ్తామని చెప్పారని, ఇది దేశ సంపద తరలిపోయేది కాదా? అని ప్రశ్నించారు. అభివృద్ధిలో భారతదేశం మూడో స్థానంలో ఉందని చెబుతున్నారని, కానీ 170 దేశాల ఆకలి సూచీలో భారతదేశం 112వ స్థానం ఉన్నదని, పేదల జీవన ప్రమాణాలు పెరగలేదని వాపోయారు. సత్వరమే కేసులు పరిష్కరిస్తున్నామని, ఆంధ్రప్రదేశ్లో ఒక చిన్నారిపై జరిగిన అఘాయిత్యం కేసు 20 రోజులలోనే చర్యలు తీసుకున్నామని చెబుతున్న ప్రధాని నరేంద్ర మోడీ 11 ఏళ్లుగా ఆర్థిక కేసులు ఎదుర్కొంటూ జగన్ జైలు బయటనే ఉన్నాడని, కోడి కత్తి కేసు, వైయస్ వివేకానంద రెడ్డి కేసులో ఉన్న ముద్దాయికి ఎందుకు శిక్ష పడటం లేదని నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Off The Record : విచ్చలవిడిగా ఇసుక అక్రమాలు.. మైనింగ్ ఏడీ ఫణిభూషణ్ పై తీవ్ర ఆరోపణలు
-
Story Board : నిర్లక్ష్యానికి శిక్షల్లేవా? పిల్లల మానసిక వేదన పట్టించుకోరా?
-
Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
-
DGP CV Anand: ఉగ్ర ముప్పుపై తెలంగాణ అప్రమత్తం.. OCTOPUS యాక్షన్ ప్లాన్..!
-
Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్కు నిలిచిపోనున్న రష్యా చమురు..
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!