CPI Narayana: కార్పొరేట్ సంస్థలను కాపాడుకోవడానికి ప్రధాని మోడీ అబద్ధాలు..!
- సమ్మెట్లో అబద్ధాలు చెప్పడం విచారకరం
- బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అవినీతి లేదన్నారు
- కాంగ్రెస్లో అవినీతి పెరిగిందని చెప్పడం సరికాదు
- సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కార్పొరేట్ సంస్థలను కాపాడుకోవడానికి ప్రధాని నరేంద్ర మోడీ సమ్మెట్లో అబద్ధాలు చెప్పడం విచారకరమని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు.. ఒక ప్రముఖ ఛానల్ ప్రధానమంత్రితో నిర్వహించిన సమ్మెట్లో దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అవినీతి లేదని, అభివృద్ధి పెరిగిందని, కాంగ్రెస్లో అవినీతి పెరిగిందని చెప్పడం సత్య దూరమని ఆయన అన్నారు. ఎన్. పి. ఎ. కింద 16 లక్షల కోట్లు ఉన్నాయని ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ స్వయంగా చెప్పారని, 2014 కంటే ముందు రెండున్నర లక్షల కోట్లు ఉంటే, బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 16 లక్షల కోట్లకు అవి చేరుకున్నాయని నారాయణ ధ్వజమెత్తారు..
READ MORE: Amit Shah: లోక్సభలో మాట్లాడే అవకాశమిస్తే రాహుల్గాంధీ విదేశాలకు వెళ్లిపోయారు
Also Read
- Bhakthi Anniversary Special: రెండు దశాబ్దాల ఆధ్యాత్మిక ప్రయాణం.. భక్తి టీవీ ప్రత్యేక గీతం మీకోసం.!
- Bhopal Murder: భర్త, భార్య, ప్రియురాలు, మాజీ ప్రియుడు.. ఈ హత్య కేసులో ట్విస్టులే ట్విస్టులు!
- మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో 'కాజూ కట్లీ' తయారీ చేయండి ఇలా.!
- Asim Munir: పాకిస్థాన్ మళ్లీ యుద్ధానికి సిద్ధమవుతోందా? ఆయుధ కర్మాగారాన్ని సందర్శించిన మునీర్..
డబ్బులు ఎగవేతలో ఒక విజయ్ మాల్య తప్ప, 28 మంది గుజరాత్ రాష్ట్రానికే చెందినవారని, ఎక్కువ మొత్తం బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాతే మొండి బకాయిల పేర్ల మీద కార్పొరేట్ వ్యక్తులకు డబ్బును మాఫీ చేశారన్నారు. భారతదేశంలో ఉన్న బిలియనీర్స్ బయటికి వెళ్తామని చెప్పారని, ఇది దేశ సంపద తరలిపోయేది కాదా? అని ప్రశ్నించారు. అభివృద్ధిలో భారతదేశం మూడో స్థానంలో ఉందని చెబుతున్నారని, కానీ 170 దేశాల ఆకలి సూచీలో భారతదేశం 112వ స్థానం ఉన్నదని, పేదల జీవన ప్రమాణాలు పెరగలేదని వాపోయారు. సత్వరమే కేసులు పరిష్కరిస్తున్నామని, ఆంధ్రప్రదేశ్లో ఒక చిన్నారిపై జరిగిన అఘాయిత్యం కేసు 20 రోజులలోనే చర్యలు తీసుకున్నామని చెబుతున్న ప్రధాని నరేంద్ర మోడీ 11 ఏళ్లుగా ఆర్థిక కేసులు ఎదుర్కొంటూ జగన్ జైలు బయటనే ఉన్నాడని, కోడి కత్తి కేసు, వైయస్ వివేకానంద రెడ్డి కేసులో ఉన్న ముద్దాయికి ఎందుకు శిక్ష పడటం లేదని నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
India’s New Time Rule: ISTపై కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. దేశవ్యాప్తంగా కొత్త టైమ్ రూల్స్.. ఎప్పటినుంచంటే?
-
Billionaire Web Series: విజయ్ మాల్యా కథతో అర్జున్ రాంపాల్.. నవంబర్లో షూటింగ్
-
Bhakthi Anniversary Special: రెండు దశాబ్దాల ఆధ్యాత్మిక ప్రయాణం.. భక్తి టీవీ ప్రత్యేక గీతం మీకోసం.!
-
GV Prakash : సుధా కొంగర సినిమాకు నో చెప్పిన మహేశ్ బాబు
-
Bhopal Murder: భర్త, భార్య, ప్రియురాలు, మాజీ ప్రియుడు.. ఈ హత్య కేసులో ట్విస్టులే ట్విస్టులు!
ట్రెండింగ్
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!