Home
Andhra Pradesh Politics
Andhra Pradesh Politics News
-
YS Jagan: చీకటి కొంతకాలమే.. వెలుగు రాక తప్పదు.. పాదయాత్ర ప్రారంభిస్తా..
YS Jagan: రాష్ట్రంలో ప్రస్తుతం అత్యంత దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. రంపచోడవరం నియోజకవర్గ పార్టీ నేతలతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడు ప్రభుత్వ పాలనపై ప్రతి ఇంట్లో చర్చ జరుగుతోందని పేర్కొన్నారు. తమ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిని ప్రజలు ప్రస్తుత పరిస్థితులతో పోల్చుకుంటున్నారని చెప్పారు. ఐదేళ్ల పాలనలో ప్రజలకు మంచి పరిపాలన అందించామని గర్వంగా చెప్పగలమని జగన్… -
Off The Record: సత్యవేడు టీడీపీలో ఆల్ సెట్ అయినట్టేనా..?
Off The Record: తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గ తమ్ముళ్ల మధ్య నడిచిన హైడ్రామా చూస్తుంటే.. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరన్న విషయం మరోసారి రుజువైందని అంటున్నారు. నిన్నటి వరకు తిరుపతి ప్రెస్ క్లబ్ వేదికగా పరస్పరం నిప్పులు చెరిగిన నేతలు.. ఇప్పుడు ఒకే ఆఫీసులో, పక్కపక్కనే కూర్చుని నవ్వులు పూయిస్తున్న ఫోటో జిల్లాలో హాట్ టాపిక్ అయింది. సరిగ్గా నెల క్రితం వరకు నియోజకవర్గంలో ఆధిపత్య పోరు ఎంత పీక్స్లో చేరిందంటే, ఏకంగా… -
Off The Record: రెండేళ్లకే ఇలా ఎందుకు..? అధికారంలో ఉన్నవాళ్లను కంగారు పెడుతుందేంటీ..?
Off The Record: వివిధ వర్గాల బాధితులు…. సమస్యల పరిష్కారం కోసం మాజీ ముఖ్యమంత్రి జగన్ దగ్గరకు ఎందుకు క్యూ కడుతున్నారు,,? ఇంకా మూడేళ్ళ పాలన మిగిలి ఉండగానే… ఏంటీ పరిస్థితి…? మనం ప్రతి రోజు అర్జీలు తీసుకుంటున్నా.. ఎందుకు ఇలా జరుగుతోంది…? ఎక్కడ తేడా కొడుతోంది? అంధ్రప్రదేశ్లో ప్రస్తుతం కూటమి వర్గాల్లో ఈ తరహా చర్చలు పెరిగిపోతున్నాయట. సమస్యలు ఉంటే పరిష్కారం కోసం అధికారంలో ఉన్నవాళ్ళ దగ్గరికి రావాలిగానీ… ప్రతిపక్ష పార్టీ అధ్యక్షుడిని కలిసి విన్నవించుకోవడం… -
Off The Record: కూటమి నేతలకు తలనొప్పిగా ఫీడ్ ఫైర్..
Off The Record: ఏపీలో చెలరేగిన ఆక్వా ఫీడ్ ఫైర్ అధికార కూటమి నేతలకు తలనొప్పిగా మారుతోందట. కొద్ది రోజులుగా రైతులు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నా… ఇటు ప్రభుత్వం నుంచి గాని అటు మేత తయారు చేసే కంపెనీల నుంచిగాని స్పందన లేదు. దాంతో ఆందోళనలు ఉధృతం అవుతున్నాయి. మరోవైపు ఆక్వా రైతుల నిరసనలు, వారు ప్రస్తావిస్తున్న సమస్యల పరిష్కారం కోరుతూ మద్దతు పెరుగుతోంది. ఇదే కూటమి నాయకులకు తలనొప్పిగా మారుతోందని చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం ఆందోళన బాట… -
Sai Krishna Incident: సాయికృష్ణ ఘటనపై సీఎం సీరియస్.. ఉన్నతస్థాయి విచారణకు ఆదేశాలు
Sai Krishna Incident: విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న గాదె సాయికృష్ణ ఘటనను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత సీరియస్గా తీసుకుంది. ఈ ఘటనపై సమగ్రంగా, నిష్పక్షపాతంగా విచారణ జరిపి వాస్తవాలను వెలికితీయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. గాదె సాయికృష్ణను పోలీస్ లాకప్లో కొట్టి చంపారనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో, ఈ కేసుపై ఉన్నతస్థాయి విచారణ నిర్వహించాలని ముఖ్యమంత్రి డీజీపీకి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఘటనకు సంబంధించిన అన్ని కోణాలను పరిశీలించి… -
Shyamala: శాంతిభద్రతలపై మౌనం.. మేకప్పై స్పందన.. హోంమంత్రి వ్యాఖ్యలకు ఆరే శ్యామల కౌంటర్..
Shyamala: హోంమంత్రి వంగలపూడి అనిత చేసిన వ్యాఖ్యలపై వైసీపీ అధికార ప్రతినిధి ఆరే శ్యామల తీవ్ర స్థాయిలో స్పందించారు. హోంమంత్రి వ్యాఖ్యలు చూస్తుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉన్నాయని ఆమె విమర్శించారు. గతంలో తమ పార్టీ నేతలపై, పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు విజయమ్మ, భారతమ్మలపై అధికార పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలను ఒకసారి గుర్తు చేసుకోవాలని సూచించారు. ఒక మహిళా హోంమంత్రిగా హుందాగా మాట్లాడాల్సిన బాధ్యత అనితపై ఉందని… -
Minister Nimmala Ramanaidu: జగన్ పాలనపై మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర విమర్శలు.. మేనమామనని చెప్పి మోసం చేశారు..!
Minister Nimmala Ramanaidu: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తోందని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. రాజమండ్రిలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికీ ‘తల్లికి వందనం’ పథకం ద్వారా ఆర్థిక సాయం అందిస్తున్నామని మంత్రి తెలిపారు. అయితే, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇద్దరు పిల్లలకు మేనమామనని చెప్పి, ‘అమ్మఒడి’ పథకం… -
Off The Record: నంద్యాల టీడీపీలో కోవర్ట్ పాలిటిక్స్..?
Off The Record: నంద్యాల జిల్లాలోని సగానికిపైగా నియోజకవర్గాల్లో టీడీపీ నేతల మధ్య నిత్యం వివాదాలు నడుస్తున్నాయి. నియోజకవర్గ వ్యవహారాలైనా, అధికారిక కార్యక్రమాలైనా, పార్టీ ప్రోగ్రామ్స్ అయినా సరే… రచ్చ జరక్కపోతే… ఆ కార్యక్రమం నిర్వహించిన ఫీల్ ఉండటం లేదని సొంత పార్టీలోనే సెటైర్స్ పడుతున్నాయంటే పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చని అంటున్నారు. తాజాగా జరిగిన నంద్యాల జిల్లా స్థాయి పార్టీ సమావేశాన్నే ఇందుకు ఉదాహరణగా చెబుతున్నారు. ఆ సందర్భంగా వినిపించిన కోవర్ట్ వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి.… -
Off The Record: నైరుతి రెడ్డికి సొంత పార్టీ నేతలే స్పీడ్ బ్రేకర్స్ అయ్యారా?
Off The Record: కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన, ప్రజావ్యతిరేక విధానాలు అంటూ… విపక్షం వైసీపీ దూకుడుగా వెళ్తుంటే.. కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం ఇప్పటికీ అంతర్గత కలహాలతోనే కునారిల్లుతోందట. అలాంటి లిస్ట్లో గుంతకల్లును ప్రస్తావిస్తున్నారు వైసీపీ నాయకులు. వాస్తవంగా గుంతకల్లు నియోజకవర్గ వైసీపీలో ఎలాంటి గ్రూపులు లేవు. 2014కు ముందు నుంచే వై.వెంకట్రామిరెడ్డి ఇక్కడ కీలకంగా ఉన్నారు. ఆయన స్థాయిలో ప్రత్యామ్నాయ నాయకత్వం కూడా గుంతకల్లు వైసీపీకి లేదు. ఉన్న కొద్దిమంది కూడా మండల స్థాయికే పరిమితమయ్యేవారు… -
YS Jagan: ప్రతి ఓటును కాపాడుకోవాలి.. వైసీపీ నేతలకు జగన్ దిశానిర్దేశం
YS Jagan: తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ సీనియర్ నేతలు, ముఖ్య నాయకులతో కీలక సమావేశం నిర్వహించారు. ఓటర్ల జాబితా సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియపై ప్రత్యేకంగా చర్చించిన జగన్, రాబోయే నాలుగు వారాలు అత్యంత కీలకమని పేర్కొంటూ పార్టీ శ్రేణులు పూర్తి అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ కో-ఆర్డినేటర్లు, బూత్ స్థాయి నాయకులు నిర్లక్ష్యం చేయకుండా ప్రతిరోజూ పరిస్థితులను సమీక్షించాలని…
తాజావార్తలు
-
AP Collectors Conference: సీఎం అధ్యక్షతన 8వ కలెక్టర్ల కాన్ఫరెన్స్.. రెండు రోజులు కీలక సమీక్షలు.. అజెండా ఇదే
-
Kia Syros Flex Fuel: 100% ఇథనాల్తోనూ నడుస్తుంది.. కియా సైరస్ ఫ్లెక్స్-ఫ్యూయల్ వచ్చేసింది..
-
Karnataka: ఫ్రీ బస్సు కోసం కోటి ‘శక్తి’ స్మార్ట్ కార్డులు పంపిణీ.. రూ.250 కోట్లు ఖర్చు!
-
YS Jagan: మెగా డీఎస్సీపై జగన్ సంచలన ఆరోపణలు.. అర్హత లేనివారికి ఉద్యోగాలా?
-
Cyber Crime: ఖమ్మంలో సైబర్ మోసాలకు చెక్.. రంగంలోకి టీజీసీఎస్బీ..
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!