Perni Nani: సిట్ విచారణపై వైసీపీ తీవ్ర అభ్యంతరం.. సాయికృష్ణ కేసులో విచారణ డొల్ల..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Perni Nani: సాయికృష్ణ కేసులో సిట్ విచారణపై మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పేర్ని నాని తీవ్ర విమర్శలు చేశారు.. అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసు విచారణపై తీవ్ర అనుమానాలు వ్యక్తం చేశారు. సిట్ దర్యాప్తు పూర్తిగా లోపభూయిష్టంగా ఉందని ఆరోపించిన ఆయన, ఈ కేసులో అనేక కీలక అంశాలను అధికారులు విస్మరించారని విమర్శించారు. విజయవాడలో జరిగిన సాయికృష్ణ ఘటన రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పరిస్థితిని బయటపెట్టిందని పేర్ని నాని అన్నారు. కస్టోడియల్ డెత్ జరిగిన తర్వాత కూడా శవం ఏమైందో అధికార యంత్రాంగం స్పష్టంగా చెప్పలేకపోవడం విచారకరమని పేర్కొన్నారు. ఈ కేసులో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించిన తర్వాతే చార్జ్షీట్ దాఖలైందని ఆరోపించారు.
సిట్ విచారణపై ప్రశ్నలు లేవనెత్తిన ఆయన, మే 6న సాయికృష్ణను అదుపులోకి తీసుకున్న తర్వాత చట్టపరమైన విధానాలు పాటించలేదని అన్నారు. టాస్క్ఫోర్స్ అధికారులు, సంబంధిత ఉన్నతాధికారుల పాత్రపై కూడా దర్యాప్తు జరగాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. సాయికృష్ణను కొట్టి చంపింది ఒక్కరేనా? శవాన్ని ఎలా తరలించారు? సీసీటీవీ ఫుటేజీ ఎందుకు మాయమైంది? వంటి అనేక ప్రశ్నలకు సమాధానాలు లేవని అన్నారు. సాయికృష్ణ తల్లి పలుమార్లు పోలీసులను ఆశ్రయించినా స్పందన రాలేదని, చివరకు హేబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేయాల్సి వచ్చిందని గుర్తుచేశారు. హైకోర్టు ఆదేశాలు వచ్చిన తర్వాత కూడా పోలీసులు తగిన చర్యలు తీసుకోలేదని విమర్శించారు.
Also Read
- Tirupati Drugs Case : తిరుపతి డ్రగ్స్ కేసులో టీటీడీ ఉద్యోగి అరెస్ట్..
- CM Chandrababu : వియత్నాం బోటు ప్రమాద ఘటనపై సీఎం చంద్రబాబు విచారం
- Nara Lokesh South Korea visit: సౌత్ కొరియాలో మంత్రి లోకేష్ పర్యటన.. 50కి పైగా కంపెనీలతో చర్చలు
- Pawan Kalyan Health Update: పవన్ కల్యాణ్కు శస్త్రచికిత్స విజయవంతం.. ప్రస్తుతం ఆరోగ్యం ఎలా ఉందంటే..?
రాష్ట్రంలో ‘రెడ్బుక్ పాలన’ పేరుతో పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించిన పేర్ని నాని, లా అండ్ ఆర్డర్ పరిస్థితి దిగజారడానికి ప్రభుత్వం బాధ్యత వహించాలని అన్నారు. ఈ కేసులో సీపీ, డీసీపీ, ఏసీపీ స్థాయి అధికారుల పాత్రపైనా స్వతంత్ర విచారణ జరగాలని డిమాండ్ చేశారు. ఇక, సీఐ నాగరాజు ఫోన్లు, ల్యాప్టాప్లు స్వాధీనం చేసుకున్నారా? కాల్ డేటా, ఇంటర్నెట్ కాల్ వివరాలు సేకరించారా? సాయికృష్ణ ఫోన్ ఏమైంది? నగరంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారా? వంటి పలు ప్రశ్నలను ఆయన సంధించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నిజంగా చిత్తశుద్ధితో ఉంటే ఉన్నతాధికారులను పక్కనపెట్టి పారదర్శక విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని..
తాజావార్తలు
-
Srinivasa Mangapuram Trailer: మహేష్ బాబు ఫ్యామిలీ నుంచి కొత్త హీరో.. ట్రైలర్తోనే అంచనాలు పెంచేసిన జై కృష్ణ!
-
Tirupati Drugs Case : తిరుపతి డ్రగ్స్ కేసులో టీటీడీ ఉద్యోగి అరెస్ట్..
-
Success story: గ్రామీణ నేపథ్యం, IIT చదువు లేదు.. కానీ, రూ. 2.6 కోట్ల ప్యాకేజీ సాధించిన కుర్రాడు..
-
Bangladesh: మార్షల్ ఆర్ట్స్ పేరుతో ఉగ్రవాదం..
-
AP CM Chandrababu: ముంబైలో పవన్ కల్యాణ్ను పరామర్శించిన సీఎం చంద్రబాబు..
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో అల్లం-పసుపు టీ ఎందుకు తాగాలి.?
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..