MP Mithun Reddy: అమరావతికి కాదు.. అవినీతికే మేం వ్యతిరేకం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MP Mithun Reddy: అమరావతి అభివృద్ధికి తమ పార్టీ వ్యతిరేకం కాదని, అక్కడ జరిగే అవినీతికే వ్యతిరేకమని స్పష్టం చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి. మదనపల్లిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన కూటమి ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు. మదనపల్లిని జిల్లాగా ప్రకటించడం తప్ప అభివృద్ధి పరంగా ఎలాంటి పురోగతి లేదని ఆయన ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో మంజూరైన మెడికల్ కళాశాలను కూటమి ప్రభుత్వం అడ్డుకుందని విమర్శించారు. మెడికల్ కళాశాలల నిర్మాణం పూర్తైతే పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతాయని పేర్కొన్నారు.
మదనపల్లె టౌన్ బ్యాంక్లో అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపించిన మిథున్ రెడ్డి, ఈ విషయంపై తెలుగుదేశం పార్టీ నేతలే సమాచారం అందించారని తెలిపారు. దీంతో పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతుందని వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. మెడికల్ కళాశాలలు, భూకబ్జాలు, కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజలను చైతన్యపరుస్తామని ఆయన అన్నారు. అభివృద్ధి గురించి ప్రశ్నిస్తే ప్రభుత్వం వైఎస్ జగన్పై వ్యక్తిగత ఆరోపణలు చేయడం తప్ప సమాధానం చెప్పడం లేదని విమర్శించారు.
Also Read
- Gujarat: విషాదం.. ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తుల కళ్లెదుటే బాలుడ్ని చంపిన సింహం
- S Janaki: సిరిసిల్లలో పెరిగిన జానకమ్మ.. వేములవాడలో మధుర క్షణాలు..
- Kejriwal: పెట్రోల్ బంక్ దగ్గర కేజ్రీవాల్ హల్చల్.. E20 పెట్రోల్పై తీవ్ర విమర్శలు
- Israe-Lebanon: లెబనాన్పై మరోసారి ఇజ్రాయెల్ భీకర దాడులు.. పశ్చిమాసియాలో టెన్షన్
డీఎస్సీ పరీక్షల వ్యవహారంపై కూడా మిథున్ రెడ్డి స్పందించారు. మొదటి ర్యాంక్ సాధించిన అభ్యర్థిని పక్కన పెట్టడంతోనే లీకేజీ వ్యవహారం బయటపడిందని అన్నారు. పరీక్షలు రాసి ఉద్యోగాలు సాధించాల్సిన పరిస్థితిలో అడ్డదారుల్లో ఉద్యోగాలు పొందడం అప్రజాస్వామికమని పేర్కొన్నారు. డీఎస్సీ వ్యవహారంపై పూర్తి స్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని మామిడి రైతులు కూటమి ప్రభుత్వ హయాంలో తీవ్రంగా నష్టపోయారని మిథున్ రెడ్డి ఆరోపించారు. రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని కోరారు. అలాగే ఆక్వా రైతులకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎల్లప్పుడూ అండగా ఉంటారని తెలిపారు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి..
తాజావార్తలు
-
OTR : యాదాద్రి ఆలయ పాలకమండలి ప్రమాణ స్వీకారం.. మంత్రుల డుమ్మా!
-
Gujarat: విషాదం.. ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తుల కళ్లెదుటే బాలుడ్ని చంపిన సింహం
-
Harish Rao : షాబాద్ ఆరుగురి హత్యలు ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే
-
S Janaki: సిరిసిల్లలో పెరిగిన జానకమ్మ.. వేములవాడలో మధుర క్షణాలు..
-
Kejriwal: పెట్రోల్ బంక్ దగ్గర కేజ్రీవాల్ హల్చల్.. E20 పెట్రోల్పై తీవ్ర విమర్శలు
ట్రెండింగ్
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!