Narayanaswamy: నారాయణస్వామి సంచలన వ్యాఖ్యలు.. ప్రజల విశ్వాసం పొందాలంటే సీబీఐ విచారణే మార్గం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Narayanaswamy: సాయికృష్ణ లాకప్ డెత్ కేసును సీబీఐకి అప్పగించాలని వైసీపీ సీనియర్ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి డిమాండ్ చేశారు. చిత్తూరులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని నమ్మాలంటే ఈ కేసుపై స్వతంత్ర సంస్థతో విచారణ జరిపించాలని అన్నారు. సాయికృష్ణ నిజంగా నేరస్తుడే అయితే కోర్టులు శిక్షించి ఉండేవని నారాయణస్వామి పేర్కొన్నారు. టెర్రరిస్టులను ఎన్కౌంటర్ చేసిన సందర్భాల్లో కూడా వారి మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగిస్తారని గుర్తు చేశారు. సాయికృష్ణ తల్లి తన కుమారుడు కనిపించడం లేదని ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు పట్టించుకోలేదని, అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమెను పిలిపించి మాట్లాడటం ఆశ్చర్యకరంగా ఉందని విమర్శించారు.
తమిళనాడులో జరిగిన పోలీసుల లాకప్ డెత్ ఘటనలపై కోర్టులు తీవ్ర వ్యాఖ్యలు చేశాయని, అదే విధంగా సాయికృష్ణ కేసులో కూడా పూర్తి స్థాయి విచారణ జరగాలని కోరారు నారాయణస్వామి.. అలాగే క్రాంతికుమార్ను సీఐ నాగరాజ్ వేధించిన అంశాన్ని కూడా సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. రెడ్బుక్ పాలన వల్లే క్రాంతికుమార్, సాయికృష్ణ మృతికి కారణమైన పరిస్థితులు ఏర్పడ్డాయని ఆయన ఆరోపించారు. హోంమంత్రి శాంతిభద్రతల పరిరక్షణ బాధ్యతలను విస్మరించి ముఖ్యమంత్రి చంద్రబాబు భజనకే పరిమితమయ్యారని విమర్శించారు. తిరుపతిలో మంత్రి లోకేష్ రెడ్బుక్ గురించి ప్రస్తావించిన తర్వాత పోలీసులు మరింత రెచ్చిపోతున్నారని ఆరోపించారు.
Also Read
- MLA Jagan Controversy: మరో వివాదంలో ఎమ్మెల్యే జగన్.. చిత్తూరులో హైటెన్షన్ రాజకీయాలు
- MLA Jagan: కన్నడిగులపై నాకు గౌరవం ఉంది.. ఎవరైనా నొచ్చుకుని ఉంటే క్షమించండి..
- MLA Jagan: 'బెంగళూరును ఏలుతున్నాం' వ్యాఖ్యలపై దుమారం.. ఎమ్మెల్యే జగన్పై కన్నడ సంఘాల ఆగ్రహం
- Nara Bhuvaneswari Emotional: ద్రౌపది నుంచి నేటి రాజకీయాల వరకు.. కుప్పంలో నారా భువనేశ్వరి ఎమోషనల్ స్పీచ్..
తనను రెడ్బుక్తో పాటు ఎన్ని పుస్తకాల ద్వారా ఇరికించేందుకు ప్రయత్నించినా తాను భయపడబోనని నారాయణస్వామి స్పష్టం చేశారు. తనపై అవినీతి ఆరోపణలు చేయలేమని గతంలో చంద్రబాబే చెప్పారని గుర్తు చేశారు. ఇక, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్పై కూడా నారాయణస్వామి విమర్శలు గుప్పించారు. పవన్ సినిమా నటుడని, ఆయన ఎప్పుడు ఏమి మాట్లాడతారో ఆయనకే తెలియదని వ్యాఖ్యానించారు. ముందుగా కూటమి నాయకులపై ఉన్న క్రిమినల్ కేసులపై చర్యలు తీసుకోవాలని పవన్ కల్యాణ్ను కోరారు. మామిడి రైతులకు ప్రభుత్వం ప్రకటించిన కిలోకు రూ.4 మద్దతు ధర కూడా వైసీపీ చేపట్టిన పోరాటాల ఫలితమేనని నారాయణస్వామి అన్నారు. రైతుల సమస్యల పరిష్కారం కోసం వైసీపీ నిరంతరం పోరాడుతుందని తెలిపారు వైసీపీ సీనియర్ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి.
తాజావార్తలు
-
Hardik Pandya: గర్ల్ఫ్రెండ్తో తిరుమలలో హార్దిక్ పాండ్యా.. శ్రీవారికి తలనీలాలు సమర్పించి కొత్త లుక్తో షాక్..!
-
Varanasi : వారణాసి షూట్ ఆల్మోస్ట్ ఫినిష్.. సైలెంట్గా పని కనిచేస్తున్న రాజమౌళి
-
Gulveer Singh History: గుల్వీర్ సింగ్ నయా చరిత్ర.. తొలి భారత అథ్లెట్గా!
-
Huawei MatePad 11.5 2026: హువావే మేట్ప్యాడ్ 11.5 భారత్లో లాంచ్.. 10,100mAh బ్యాటరీ, 120Hz పేపర్మ్యాట్ డిస్ప్లే
-
Tilak Varma: స్టార్ బాయ్కి ప్రమోషన్.. సౌత్ జోన్ కెప్టెన్గా ఛాన్స్.!
ట్రెండింగ్
-
Best Smartphones: రూ.50 వేలలో స్మార్ట్ఫోన్లు.. పెర్ఫార్మెన్స్, గేమింగ్, కెమెరా, బ్యాటరీలలో బెస్ట్ ఛాయస్ ఇవే.!
-
144Hz LTPO OLED డిస్ప్లే, 2nm Dimensity 9600 Pro చిప్సెట్తో రానున్న Vivo X500 Pro..!
-
Onion Cleaning Hack : ఉల్లిపాయతో గ్లాస్ మెరుస్తుందా.? వైరల్ హ్యాక్లో నిజం ఎంత.!
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్కార్ట్లో ‘పే లేటర్’ సదుపాయం!