Dharmana Prasada Rao: కూటమి ప్రభుత్వంలో ప్రజారోగ్యానికి ప్రాధాన్యత లేదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dharmana Prasada Rao: శ్రీకాకుళం జిల్లాలో డయేరియా బాధిత ప్రాంతాల్లో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 20 నెలలుగా టీడీపీ పాలనలో ప్రజారోగ్యం నిర్లక్ష్యం చేశారు.. ప్రభుత్వ నిర్ణయాలు ప్రజలకు శాపంలా మారాయి.. ప్రతి జిల్లాకు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇవ్వాలనుకున్నాం.. ప్రైవేటీకరణతో ఒక ప్రభుత్వ ఆలోచనలు తొక్కేశారు.. కూటమి ప్రభుత్వంలో ప్రజారోగ్యానికి ప్రాధాన్యత లేదన్నారు. బలగ ప్రాంతంలో డయేరియా డిసెంబర్ లో ఇలానే వచ్చింది.. 100 మందికి పైగా డయేరియా పేషెంట్లు ఉన్నారు.. మంచి ప్రభుత్వం అని స్టిక్కర్లు అంటించుకుంటారు తప్ప ప్రజా సమస్యలు పట్టించుకోరంటూ మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ రావు మడిపడ్డారు.
Read Also: Neena Gupta: పెళ్లి కాకుండానే..ఆ క్రికెటర్తో బిడ్డను కన్నాను.. బాలీవుడ్ నటి షాకింగ్ కామెంట్స్
Also Read
- YS Jagan Srikakulam Tour: శ్రీకాకుళంలో జగన్ పర్యటన పూర్తి షెడ్యూల్.. పోలీసుల కఠిన ఆంక్షలు..!
- YS Jagan Srikakulam Visit: వైఎస్ జగన్ శ్రీకాకుళం పర్యటనపై ఉత్కంఠ.. పోలీసుల ఆంక్షలు.. ర్యాలీలు, సభలకు నో పర్మిషన్..
- Dharmana Krishnadas: 'ఈరోజు అప్పలరాజు.. రేపు మేమే'.. కూటమి ప్రభుత్వంపై ధర్మాన సంచలన వ్యాఖ్యలు
- Srikakulam Couple Murder: శ్రీకాకుళంలో జంట హత్యల కలకలం.. చేతబడి నెపంతో భార్యాభర్తల దారుణ హత్య
అయితే, అతిసారంతో నలుగురు చనిపోతే ఒకరు లేదా ఇద్దరే చనిపోయారంటున్నారు.. వాంతులు, విరోచనాలతో ప్రజలు చనిపోతుంటే పోస్టుమార్టం అంటున్నారని మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ రావు పేర్కొన్నారు. కుటుంబాలను ఆదుకుందామనే బాధ్యత ఈ ప్రభుత్వానికి లేదన్నారు. బాధ్యత లేకుండా రాజధాని పేరుతో డబ్బును ఒకే దగ్గర పెడుతున్నారని విమర్శించారు. అన్ని రంగాలను నిర్లక్ష్యం చేస్తున్నారు.. యూరియా బస్తా కోసం రైతు వెళ్తే యూరియా బస్తా లేదు.. ఇంగ్లీషు మీడియం చదువుకుంటాననే విద్యార్థికి విద్య లేదు.. ధాన్యానికి కనీస మద్దతు ధర లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం రెండు కేజీ లు ఎక్కువ తీసుకుంటున్న పట్టించుకోలేదని ప్రసాద్ రావు చెప్పారు.
Read Also: AJITH KUMAR : డైరెక్టర్స్ని రిపీట్ చేస్తోన్న అజిత్.. ఫ్లాప్ దర్శకుడికి మరో ఛాన్స్
ఇక, నదుల్లో సిల్ట్ క్లియర్ చేయాల్సిన ప్రాంతాల్లో కాకుండా వేరే ప్రాంతాల్లో తీస్తున్నారని మాజీ మంత్రి ధర్మాన అన్నారు. దోపిడి, నిర్లక్ష్యంతో పాలన చేస్తున్నారని విమర్శించారు. మున్సిపాలిటీని ప్రైవేట్ ఏజెన్సీల తయారు చేశారు.. ప్రభుత్వం వైఫల్యం చెందిందని అన్ని ప్రాంతాల ప్రజల్లో వచ్చింది.. ఇచ్చిన హామీల కోసం రూ. 1000 కోట్ల అయినా శ్రీకాకుళంలో ఖర్చు చేశారా అని క్వశ్చన్ చేశారు. ప్రజాస్వామ్యంలో మిమ్మల్ని బొందా పెట్టే రోజు దగ్గర లోనే ఉందని ప్రసాద్ రావు వెల్లడించారు.
తాజావార్తలు
-
Women’s Asia Cup 2026: మరోసారి తలపడనున్న భారత్, పాకిస్థాన్.. మహిళల ఆసియా కప్ షెడ్యూల్ రిలీజ్
-
Story Board: తమిళనాడులో ప్రతీకారమే రాజకీయమా..? కరుణ, జయ దగ్గర నుంచి విజయ్ దాకా అదే తీరా..?
-
Krishna River Management Board: శ్రీశైలం, సాగర్ నీటిపై ఏపీ కీలక ప్రతిపాదన.. కేఆర్ఎంబీకి లేఖ
-
PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
-
Off The Record: ఆసిఫాబాద్ కాంగ్రెస్లో అసంతృప్తి అగ్గి.. డీసీసీ అధ్యక్షురాలిపై తిరుగుబాటు?
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!