Dharmana Prasada Rao: కూటమి ప్రభుత్వంలో ప్రజారోగ్యానికి ప్రాధాన్యత లేదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dharmana Prasada Rao: శ్రీకాకుళం జిల్లాలో డయేరియా బాధిత ప్రాంతాల్లో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 20 నెలలుగా టీడీపీ పాలనలో ప్రజారోగ్యం నిర్లక్ష్యం చేశారు.. ప్రభుత్వ నిర్ణయాలు ప్రజలకు శాపంలా మారాయి.. ప్రతి జిల్లాకు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇవ్వాలనుకున్నాం.. ప్రైవేటీకరణతో ఒక ప్రభుత్వ ఆలోచనలు తొక్కేశారు.. కూటమి ప్రభుత్వంలో ప్రజారోగ్యానికి ప్రాధాన్యత లేదన్నారు. బలగ ప్రాంతంలో డయేరియా డిసెంబర్ లో ఇలానే వచ్చింది.. 100 మందికి పైగా డయేరియా పేషెంట్లు ఉన్నారు.. మంచి ప్రభుత్వం అని స్టిక్కర్లు అంటించుకుంటారు తప్ప ప్రజా సమస్యలు పట్టించుకోరంటూ మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ రావు మడిపడ్డారు.
Read Also: Neena Gupta: పెళ్లి కాకుండానే..ఆ క్రికెటర్తో బిడ్డను కన్నాను.. బాలీవుడ్ నటి షాకింగ్ కామెంట్స్
Also Read
- Chintada Ravi Kumar Arrest: పోలీసుల అదుపులో వైసీపీ నేత చింతాడ రవికుమార్.. సర్కార్పై సంచలన వ్యాఖ్యలు
- YS Jagan Srikakulam Tour: శ్రీకాకుళంలో జగన్ పర్యటన పూర్తి షెడ్యూల్.. పోలీసుల కఠిన ఆంక్షలు..!
- YS Jagan Srikakulam Visit: వైఎస్ జగన్ శ్రీకాకుళం పర్యటనపై ఉత్కంఠ.. పోలీసుల ఆంక్షలు.. ర్యాలీలు, సభలకు నో పర్మిషన్..
- Dharmana Krishnadas: 'ఈరోజు అప్పలరాజు.. రేపు మేమే'.. కూటమి ప్రభుత్వంపై ధర్మాన సంచలన వ్యాఖ్యలు
అయితే, అతిసారంతో నలుగురు చనిపోతే ఒకరు లేదా ఇద్దరే చనిపోయారంటున్నారు.. వాంతులు, విరోచనాలతో ప్రజలు చనిపోతుంటే పోస్టుమార్టం అంటున్నారని మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ రావు పేర్కొన్నారు. కుటుంబాలను ఆదుకుందామనే బాధ్యత ఈ ప్రభుత్వానికి లేదన్నారు. బాధ్యత లేకుండా రాజధాని పేరుతో డబ్బును ఒకే దగ్గర పెడుతున్నారని విమర్శించారు. అన్ని రంగాలను నిర్లక్ష్యం చేస్తున్నారు.. యూరియా బస్తా కోసం రైతు వెళ్తే యూరియా బస్తా లేదు.. ఇంగ్లీషు మీడియం చదువుకుంటాననే విద్యార్థికి విద్య లేదు.. ధాన్యానికి కనీస మద్దతు ధర లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం రెండు కేజీ లు ఎక్కువ తీసుకుంటున్న పట్టించుకోలేదని ప్రసాద్ రావు చెప్పారు.
Read Also: AJITH KUMAR : డైరెక్టర్స్ని రిపీట్ చేస్తోన్న అజిత్.. ఫ్లాప్ దర్శకుడికి మరో ఛాన్స్
ఇక, నదుల్లో సిల్ట్ క్లియర్ చేయాల్సిన ప్రాంతాల్లో కాకుండా వేరే ప్రాంతాల్లో తీస్తున్నారని మాజీ మంత్రి ధర్మాన అన్నారు. దోపిడి, నిర్లక్ష్యంతో పాలన చేస్తున్నారని విమర్శించారు. మున్సిపాలిటీని ప్రైవేట్ ఏజెన్సీల తయారు చేశారు.. ప్రభుత్వం వైఫల్యం చెందిందని అన్ని ప్రాంతాల ప్రజల్లో వచ్చింది.. ఇచ్చిన హామీల కోసం రూ. 1000 కోట్ల అయినా శ్రీకాకుళంలో ఖర్చు చేశారా అని క్వశ్చన్ చేశారు. ప్రజాస్వామ్యంలో మిమ్మల్ని బొందా పెట్టే రోజు దగ్గర లోనే ఉందని ప్రసాద్ రావు వెల్లడించారు.
తాజావార్తలు
-
Irummudi Collections: ఒక్క అడుగు దూరంలో ‘ఇరుముడి’.. ఆ మార్క్ సాధ్యమేనా?
-
Rs 50 Lakh Bribe: రూ.50 లక్షల లంచం.. రెడ్హ్యాండెడ్గా దొరికిపోయిన తహసీల్దార్..
-
Mahesh Babu: మహేష్ బాబును కలిసిన స్టార్ డైరెక్టర్.. కథ కూడా చెప్పేశాడు?
-
‘Koh-e-Zafar’ Friendship Dinner: భారత్కు అఫ్గానిస్థాన్ ప్రత్యేక విందు.. ‘కోహ్-ఏ-జఫర్’ పేరుతో ఫ్రెండ్షిప్ డిన్నర్.!
-
43 Jersey Cows Gifted to Bhutan: భూటాన్కు భారత్ ప్రత్యేక బహుమతి.. 43 స్వచ్ఛమైన జెర్సీ ఆవులు అందజేత
ట్రెండింగ్
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!