చంద్రబాబుకు రాజకీయ భవిష్యత్ లేదని అర్థమైందని… అందుకే భార్య పేరుతో ప్రజల్లో సింపతీ పొందాలని ప్రయత్నిస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఆరోపించారు. చంద్రబాబు భార్య భువనేశ్వరిని తాము ఏమీ అనలేదని.. ఒకవేళ అని ఉంటే రికార్డులు చూపించాలని అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. రాజకీయంగా తెలివిగల వాడు కాబట్టే.. భవిష్యత్లో ఏం జరుగుతుందో తెలిసి చంద్రబాబు భార్య పేరుతో సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో అనేక కుటుంబాలను ఏడ్పించిన వ్యక్తి చంద్రబాబు అని……
ప్రతిపక్షం కోరిక మేరకే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయన్నారు వైసీపీ నేత అంబటి రాంబాబు. ఇవాళ సభలో జరిగింది దురదృష్ట సంఘటన అనాలో…ప్రజలకు అదృష్టం అనాలో ప్రజలే నిర్ణయించాలి. శాసనసభకు మళ్లీ రాను అని శపథం చేసి వెళ్ళిపోయారు. ఆయన ఎందుకు వెళ్ళారో మాకు ఎవరికీ అర్థం కాలేదన్నారు అంబటి రాంబాబు. చంద్రబాబు ఏడ్చే ప్రయత్నం చేసినట్లు అనిపించింది. నేను కానీ, మా ఇతర సభ్యులు కానీ చంద్రబాబు భార్యను పల్లెత్తు మాట అనలేదు. మేము తప్పుగా మాట్లాడితే…
విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉక్కు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. సభలో పాల్గొన్న పవన్ ఉక్కు పరిరక్షణ సమితికి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్లాడిన పవన్.. కేంద్రానికి ఇక్కడి సమస్యలు తెలియకుండా చేస్తున్నారని, ఇక్కడి మంత్రులు వెళ్లి కేంద్రానికి సమస్యలు వెల్లడించకుంటే కేంద్రానికి సమస్యలు ఎలా తెలుస్తాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఇక్కడి సమస్యలు కేంద్రానికి తెలియాలంటే…
జనం కొడతారని పారిపోయి ఢిల్లీ పారిపోయిన వ్యక్తి రఘురామ కృష్ణంరాజు అని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. నీచమైన పనులు చేసే వ్యక్తిని చంద్రబాబు వెనకేసుకు వస్తున్నారు. చట్టం తన పని తాను చేసుకుని పోతుంటే కుట్రదారులందరూ రంగంలోకి దిగారు అని తెలిపారు. ఢిల్లీలో కూర్చుని చంద్రబాబు కోసం లాబీయింగ్ చేస్తున్నాడు. చంద్రబాబు స్క్రిప్ట్ ప్రకారమే రఘురామ కృష్ణంరాజు మాట్లాడుతున్నారు అని పేర్కొన్నారు. జైలుకు వెళ్ళకుండా డైరెక్ట్ గా హాస్పిటల్ కు వెళ్ళాలని, పోలీసుల పై…