Ambati Rambabu: సత్యహరిశ్చంద్రునికి చంద్రబాబు పూర్తి విరుద్ధం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘గడప గడపకు మన ప్రభుత్వం’ పేరుతో వైసీపీ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమంలో భాగంగా పలుచోట్ల నేతలకు ప్రజల నుంచి వ్యతిరేకత ఎదురైంది. దీన్ని బట్టే వైసీపీ పాలన పట్ల ప్రజలు ఎంత వ్యతిరేకంగా ఉన్నారో తెలిసిపోతోందని టీడీపీ నేతలు విమర్శలు చేయడం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలోనే ఈ అంశంపై వివరణ ఇచ్చేందుకు ఏపీ మంత్రి అంబటి రాంబాబు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలేనంటూ ఆయన తీవ్ర ఆగ్రహావేశాలకు గురయ్యారు.
తమ వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాల్లో 95% పూర్తి చేశామని రాంబాబు అన్నారు. అందులో తామేం చేశామని, ఏం చేయలేదన్న విషయాల్ని రాసి.. గడప గడప కార్యక్రమంలో భాగంగా ప్రజలకు ఇస్తున్నమమన్నారు. ప్రపంచంలో ఏ ఒక్క ప్రభుత్వం కూడా ఈ స్థాయిలో ఇచ్చిన వాగ్దానాల్ని పూర్తి చేసి ఉండదని చెప్పారు. తాము ధైర్యంగా ప్రతి పనిని చేశామని ప్రజలకు చెప్తున్నామని, కానీ టీడీపీ అధికారంలోకి వచ్చినప్పుడు మేనిఫెస్టోనే దాచేసిందని ఎద్దేవా చేశారు. ఎన్నికల సమయంలో ఒక దస్తాలాగా 45 పేజీల మేనిఫెస్టోని సిద్ధం చేసిన టీడీపీ.. అధికారంలోకి రాగానే దాన్ని దాచేసిందని, ప్రజలు నిలదీస్తారనే ఉద్దేశంతో వెబ్సైట్లో నుంచి కూడా తొలగించిందని తెలిపారు.
Also Read
- CM Chandrababu: బుల్లెట్ వేగంతో రాష్ట్రంలో 'బుల్లెట్ మోటార్ సైకిల్' ప్రాజెక్టు ఏర్పాటు..!
- Heat Wave Alert: ఇంటి నుంచి బయటకు రాకపోవడమే మంచిది.. రాబోయే మూడు రోజులు 47°C వరకు ఉష్ణోగ్రతలు..!
- Inter Results Error: 60 మార్కులొస్తే 6 మార్కులు వేసిన లెక్చరర్.. దిమ్మతిరిగే పనిష్మెంట్ ఇచ్చిన సర్కార్..!
- AP Heatwave Alert: ఏపీలో ఎండల తీవ్రత.. వారం రోజుల పాటు హీట్వేవ్స్ హెచ్చరిక
‘మనం ఇతిహాసాల్లో, పురాణాల్లో అబద్ధాలు చెప్పని వ్యక్తి ఎవరని ప్రశ్నిస్తే.. సత్యహరిశ్చంద్రుడు అని ఠక్కున చెప్తాం. ప్రాణం పోయినా, ఆస్తులు పోయినా.. ఆయన ఎప్పుడు అబద్ధం ఆడడు. కానీ, అందుకు పూర్తి భిన్నంగా తన జీవితంలో అబద్ధాలు తప్ప నిజాలు చెప్పని వ్యక్తి చంద్రబాబు నాయుడు’’ అంటూ మంత్రి ఆరోపించారు. వైస్సార్సీపీ ప్రభుత్వ పాలన పట్ల ప్రజలు సంతృప్తిగానే ఉన్నారని.. ప్రతిపక్షాలు బురద జల్లే ప్రయత్నంలో తప్పుడు వ్యాఖ్యానాలు చేస్తున్నారని మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Tamil Nadu: షాకింగ్.. 13 ఏళ్ల బాలుడిని చంపి పాతిపెట్టిన మైనర్ స్నేహితులు
-
Kamal Haasan: స్టార్ హీరోల కళ్ళు తెరిపించిన కమల్ హాసన్.. నెట్టింట ప్రశంసల వెల్లువ!
-
Twisha Sharma: తెలుగు నటి ట్విషా శర్మ మృతి కేసులో కొత్త ట్విస్ట్.. వెలుగులోకి వీడియో
-
Jananayagan : కళ్లు చెదిరే రేటుకు ‘జననాయగన్’ తెలుగు రైట్స్?
-
Oil Companies: పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచినా.. ఇంకా నష్టాల్లోనే చమురు సంస్థలు.. కారణం ఇదే..
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!