Akhilesh Yadav : లోక్సభలో రాష్ట్రపతి ప్రసంగంపై చర్చలో పాల్గొన్న సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) నేత అఖిలేష్ యాదవ్ పలు అంశాలపై కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పేపర్ లీక్ విషయంలో అఖిలేష్ మాట్లాడుతూ.. ఎవరికీ ఉద్యోగం ఇవ్వాల్సిన అవసరం లేదని ప్రభుత్వం పేపర్ లీక్ చేస్తుందన్నారు. అలాగే, ఈవీఎంల విషయంలో మేం ఎప్పుడూ మద్దతు ఇవ్వలేదని, దానికి వ్యతిరేకంగా పోరాడుతూనే ఉంటామని అఖిలేష్ అన్నారు. అగ్నివీర్ పథకం రద్దుపై అఖిలేష్ మరోసారి మాట్లాడారు. మంగళవారం…
కాబోయే దేశ ప్రధాని అంటూ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ పోస్టర్లు ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో వెలిశాయి. జూలై 1న అఖిలేష్ యాదవ్ పుట్టినరోజు.. దీన్ని పురస్కరించుకుని సమాజ్వాదీ పార్టీ శ్రేణులు, నేతలు పార్టీ కార్యాలయం దగ్గర పెద్ద పెద్ద హోర్డింగ్లు, ఫ్లెక్సీలు, పోస్టర్లు వేశారు.
18వ పార్లమెంట్ సమావేశాలు సోమవారం సందడిగా సాగాయి. సార్వత్రిక ఎన్నికల్లో తమ అద్భుతమైన ప్రదర్శనతో ఉల్లాసంగా ఉన్న ప్రతిపక్ష ఎంపీలు.. 18వ లోక్సభ సభ్యునిగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు రాజ్యాంగం కాపీలను ఊపుతూ నిరసన వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే.. లోక్సభలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ముందు వరుసలో కూర్చుని నాయకత్వం వహించారు. గత పార్లమెంట్ సమావేశాల్లో రాహుల్ గాంధీ రెండో వరుసలో కూర్చున్నారు.…
Akhilesh Yadav: సమాజ్వాదీ పార్టీ(ఎస్పీ) చీఫ్, మాజీ యూపీ సీఎం అఖిలేష్ యాదవ్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఇటీవల ఎన్నికల్ల ఉత్తర్ ప్రదేశ్లోని కన్నౌజ్ ఎంపీ సీటు నుంచి భారీ మెజారిటీతో గెలిచిన అఖిలేష్, కర్హాల్ అసెంబ్లీ ఎమ్మెల్యే పదవికి బుధవారం రాజీనామా చేశారు.
Loksabha Elections 2024 : కేంద్ర రాజకీయాల్లో ఉత్తరప్రదేశ్ పెద్ద పాత్ర పోషిస్తోంది. గత రెండు ఎన్నికల్లో బీజేపీని ఓడించిన ఉత్తరప్రదేశ్ ఈసారి షాక్ ఇచ్చింది. ఫలితంగా బీజేపీ సొంతంగా మెజారిటీ సాధించలేకపోయింది.
Akhilesh Yadav: లోక్సభ ఎన్నికల్లో ఉత్తర్ ప్రదేశ్ ఫలితాలు అందర్ని ఆశ్చర్యపరిచాయి. గత రెండు పర్యాయాలుగా యూపీ బీజేపీకి అత్యధిక స్థానాలను కట్టబెట్టింది. అయితే, ఈ సారి మాత్రం అక్కడి ప్రజలు బీజేపీకి షాక్ ఇచ్చారు.
Akhilesh Yadav: బీజేపీ కంచుకోటగా ఉన్న ఉత్తర్ ప్రదేశ్ని సమాజ్వాదీ(ఎస్పీ) బద్దలు కోట్టింది. ఈ రాష్ట్రంలో బీజేపీతో పోలిస్తే ఎస్పీకి అధికంగా ఎంపీ సీట్లు వచ్చాయి. బీజేపీకి 33 సీట్లు రాగా, ఎస్పీకి 37 సీట్లు దక్కాయి.
ఉత్తరప్రదేశ్లోని అజంగఢ్లోని ఖరేవాన్ సరయ్మీర్లో సమాజ్వాద్ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సమావేశానికి కార్యకర్తలు భారీ ఎత్తున తరలివచ్చారు. అయితే.. పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ అభివాదం అనంతరం ప్రసంగాన్ని ప్రారంభించేందుకు లేవగానే కార్యకర్తల్లో ఉత్సాహం పెరిగి సభా వేదిక వద్ద తొక్కిసలాట జరిగింది. ఒక్కసారిగా కార్యకర్తలు వేదికపైకి వచ్చేందుకు ప్రయత్నించారు. అయితే వెంటనే పోలీసులు వారిని అదుపు చేశారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రమాదం జరగలేదు. కొద్దిసేపటి తర్వాత ప్రశాంత వాతావరణం ఏర్పడింది.