Parliament Session: లోక్సభలో ముందు వరుసలో కూర్చున్న రాహుల్ గాంధీ.. ఆయనతో పాటు
- 18వ పార్లమెంట్ సమావేశాలు లోక్సభలో ముందు వరుసలో కూర్చున్న రాహుల్ గాంధీ
- గత పార్లమెంట్ సమావేశాల్లో రెండో వరుసలో కూర్చున్న రాహుల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
18వ పార్లమెంట్ సమావేశాలు సోమవారం సందడిగా సాగాయి. సార్వత్రిక ఎన్నికల్లో తమ అద్భుతమైన ప్రదర్శనతో ఉల్లాసంగా ఉన్న ప్రతిపక్ష ఎంపీలు.. 18వ లోక్సభ సభ్యునిగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు రాజ్యాంగం కాపీలను ఊపుతూ నిరసన వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే.. లోక్సభలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ముందు వరుసలో కూర్చుని నాయకత్వం వహించారు. గత పార్లమెంట్ సమావేశాల్లో రాహుల్ గాంధీ రెండో వరుసలో కూర్చున్నారు. అయితే.. ప్రతిపక్ష హోదాలో మొదటి వరుసలో కూర్చోవడంపై అతని ముఖంలో సంతోషం కనిపిస్తుంది.
AP Crime: బయటకు పొక్కిన గుట్టు.. వదిన, మరిది ఆత్మహత్య..
Also Read
- Tilak Varma: ఆకాశమే హద్దుగా చెలరేగిన తిలక్ వర్మ.. 136 పరుగులు సాధించి ఒంటి చేత్తో మ్యాచ్ గెలిపించిన వర్మ..
- Qatar LNG Plant Explosion: 12 మంది భారతీయులు సహా 13 మంది మృతి.. అత్యవసర హెల్ప్లైన్ ఏర్పాటు
- Off The Record: బాల్కొండలో పొలిటికల్ ఫైట్.. ప్రశాంత్ రెడ్డికి చెక్ ఎవరు పెడతారు?
- Off The Record: ఎన్నికలకు ముందే బీఆర్ఎస్ మాస్టర్ ప్లాన్ స్టార్ట్?
ముందు వరుసలో కూర్చున్న వారిలో.. రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్లతో పాటు సమాజ్వాదీ పార్టీ ఎంపీ అవధేష్ ప్రసాద్, తృణమూల్ కాంగ్రెస్కు చెందిన సుదీప్ బందోపాధ్యాయ ఉన్నారు. అయోధ్యలోని రామమందిరం ఉన్న ఫైజాబాద్ ఎన్నికల్లో విజయం సాధించిన అవధేష్ ప్రసాద్పై అఖిలేష్ యాదవ్ స్పెషల్ ఫోకస్ పెట్టారు. పార్లమెంట్లోకి అడుగుపెడుతున్నప్పుడు అఖిలేష్ యాదవ్తో పాటు అతని భార్య డింపుల్ యాదవ్, మామ రామ్ గోపాల్ యాదవ్, సమాజ్వాదీ పార్టీ ఎంపీలందరూ తనను ముందుకు తీసుకొచ్చారు. అంతేకాకుండా.. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీతో సమావేశమైన సమయంలో కూడా అఖిలేష్ యాదవ్ అవధేష్ ప్రసాద్ ను తన పక్కనే ఉంచుకున్నాడు.
CM Revanth Reddy: కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో సీఎం రేవంత్ భేటీ
మరోవైపు.. ప్రతిపక్ష నేతలు లోక్ సభలోకి అడుగుపెడుతున్న సమయంలో ప్రధాని మోడీతో సహా.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా రాజ్యాంగ ప్రతులను ఊపుతూ ప్రతిపక్షాలకు స్వాగతం పలికారు. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రమాణస్వీకారం చేస్తున్న సమయంలో ప్రతిపక్ష ఎంపీలు ‘నీట్, నీట్’ అంటూ నినాదాలు చేశారు. మరోవైపు.. లోక్సభ లో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ‘రాజ్యాంగంపై ప్రధాని మోడీ, అమిత్ షా చేసిన దాడి మాకు ఆమోదయోగ్యం కాదు, అలా జరగనివ్వబోం. అందుకే ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు రాజ్యాంగాన్ని నిర్వహించాం…” అని తెలిపారు. లోక్సభలో భారత కూటమికి 233 మంది ఎంపీలు ఉండగా.. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి 293 మంది ఎంపీలు ఉన్నారు.
తాజావార్తలు
-
Rainy Season Tips: వర్షా కాలంలో ఉతికిన బట్టలు త్వరగా ఆరాలంటే ఇలా చేయండి.. బ్యాడ్ స్మెల్ కూడా రాదు!
-
Astrology: ఉదయం లేవగానే ఈ 3 రాశులవారు చేసే అలవాట్లు.. విజయానికి అదే కారణమా?
-
Tilak Varma: ఆకాశమే హద్దుగా చెలరేగిన తిలక్ వర్మ.. 136 పరుగులు సాధించి ఒంటి చేత్తో మ్యాచ్ గెలిపించిన వర్మ..
-
Qatar LNG Plant Explosion: 12 మంది భారతీయులు సహా 13 మంది మృతి.. అత్యవసర హెల్ప్లైన్ ఏర్పాటు
-
Off The Record: బాల్కొండలో పొలిటికల్ ఫైట్.. ప్రశాంత్ రెడ్డికి చెక్ ఎవరు పెడతారు?
ట్రెండింగ్
-
120Hz నుంచి 144Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, 48MP కెమెరాతో Ai+ కొత్త 5G ఫోన్లు లాంచ్.. ధరలు, ఫీచర్లు ఇవే!
-
Thoothukudi Storm: సుడిగాలి బీభత్సం.. భారీ నష్టం, ఆరుగురికి తీవ్ర గాయాలు.!
-
Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
-
Floor Cleaning Tips : ఇంట్లో జిడ్డు నేలకు గుడ్బై.. అద్దంలా మెరిపించే సూపర్ చిట్కాలు.!
-
Gas Burner Cleaning Tips: బర్నర్ రంధ్రాలు బ్లాక్ అయ్యాయా.? ఈ ట్రిక్ సూపర్.!