Sharad Pawar: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) అధినేత శరద్ పవార్ ను చంపేస్తామంటూ ఇటీవల సోషల్ మీడియాలో బెదిరింపులు వచ్చాయి. శుక్రవారం తన తండ్రి శరద్ పవార్ వాట్సాప్ లో బెదిరింపు సందేశాలు వచ్చినట్లు కుమార్తె సుప్రియా సూలే చెప్పారు. శరద్ పవార్ భద్రత బాధ్యత హోం శాఖపై ఉందని, అమిత్ షా జోక్యం చేసుకోవాలని ఆమె కోరారు. మహారాష్ట్ర హోంమంత్రి, కేంద్ర హోంమంత్రి ఈ విషయంలో కలుగజేసుకోవాలని ఆమె కోరారు. ఇలాంటి దిగజారుడు రాజకీయాలను ఆపేయాలంటూ…
NCP: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) అధినేత శనివారం కీలక ప్రకటన చేశారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా సుప్రియా సూలే, ప్రఫుల్ పటేల్ లను నియమించారు. సుప్రియా సూలే, శరద్ పవార్ కుమార్తె, ప్రస్తుతం ఈమె బారామతి నుంచి ఎంపీగా ఉన్నారు. పార్టీ 25వ వార్షికోత్సవంలో శరద్ పవార్ ఈ విషయాన్ని ప్రకటించారు.
శివసేన-బీజేపీ కూటమిని ఓడించేందుకు మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ) మహారాష్ట్ర అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తుందని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) నాయకుడు అజిత్ పవార్ సోమవారం అన్నారు.
శివసేన, సేన పోరుపై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే రాజీనామా చేయాలని డిమాండ్ చేయాల్సిన అవసరం లేదని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత అజిత్ పవార్ శుక్రవారం అన్నారు.
Sharad Pawar: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ రాజీనామా చేయడం ఒక్కసారిగా దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. తదుపరి అధ్యక్షుడి ఎన్నిక కోసం ఈ రోజు ఎన్సీపీ కోర్ కమిటీ ముంబైలో భేటీ అయింది. అయితే శరద్ పవారే ఎన్సీపీ అధినేతగా కొనసాగాలని కమిటీ ఏకగ్రీవంగా తీర్మానించింది.
NCP crisis: దేశరాజకీయాల్లో కీలక నేత, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ( ఎన్సీపీ) అధినేతగా ఉన్న శరద్ పవార్ ఆ పదవికి రాజీనామా చేశారు. అకాస్మత్తుగా ఆయన నిర్ణయం దేశాన్ని ఆశ్చర్యపరిచింది.
మహారాష్ట్ర రాజకీయాలు ఆసక్తి రేపుతున్నాయి. ముఖ్యమంత్రి పదవి నుంచి ఏక్నాథ్ షిండే తప్పుకోనున్నారని ప్రచారం ఊపందుకుంది. రాష్ట్రంలో ఆధిపత్య పోరులో ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే కుర్చీని వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడగా, తదుపరి ముఖ్యమంత్రి ఎవరన్న అంశంపై చర్చ మొదలైంది.
మహారాష్ట్ర రాజకీయాల్లో మరో భూకంపం వస్తుందా? అంటే తాజా పరిస్థితిని బట్టి అవుననే సమాధానం వినిపిస్తోంది. రాష్ట్రంలో అధికార కూటమి- ఎన్డీయేలో అనూహ్య మార్పు రావచ్చు. మూలాల ప్రకారం, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తన పదవిని సీఎం ఏక్నాథ్ షిండేతో మార్చుకోవచ్చు.
ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్నట్లు ఎన్సిపి నేత అజిత్ పవార్ చేసిన ప్రకటనపై మహారాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. అజిత్ పవార్ వ్యాఖ్యలపై మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరైనా ముఖ్యమంత్రి కావాలని కోరుకోవడంలో తప్పు లేదని, అయితే అందరూ ముఖ్యమంత్రి కాలేరని అన్నారు.