Raj Thackeray: “శరద్ పవార్తో మొదలై, ఆయనతోనే అంతమవుతున్నాయి”.. ఎన్సీపీ సంక్షోభంపై ఘాటు వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Raj Thackeray: మహారాష్ట్రలో రాజకీయ పరిణామాలు, ఎన్సీపీ సంక్షోభంపై మహరాష్ట్ర నవనిర్మాణ్ సేవ(ఎంఎన్ఎస్) అధ్యక్షుడు రాజ్ ఠాక్రే ఆందోళన వ్యక్తం చేశారు. మహారాష్ట్రలో జరుగుతున్న రాజకీయ పరిణామాల వెనక ఎన్సీపీ నేత శరద్ పవార్ హస్తం ఉండవచ్చని అన్నారు. బీజేపీ-శివసేన(ఏక్ నాథ్ షిండే) ప్రభుత్వంలో ఎన్సీపీ చేరడం, ఎన్సీపీలో చీలిక రావడం తదితర పరిణామాల గురించి బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు చాలా అసహ్యంగా ఉన్నాయని.. ఇది రాష్ట్ర ఓటర్లను అవమానించడం తప్ప మరొకటి కాదని ఠాక్రే అన్నారు.
Read Also: MLA Raghunandan Rao: దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్రావు అరెస్ట్.. కారణం ఇదే..
Also Read
- Floods: మధ్యప్రదేశ్ను ముంచెత్తిన వరదలు.. ఉప్పొంగి ప్రవహిస్తున్న నదులు
- Bihar: అందరికి డయాబెటిస్ ఉంది, చక్కెర ధర పెరిగిన పర్వాలేదు: బీహార్ మంత్రి..
- BJP: రాహుల్ గాంధీ డ్రామాలు వీడియోల కోసమే.. బీజేపీ నేతల విమర్శలు..
- CM Revanth Reddy US visit: రేవంత్ యూకే పర్యటనకు ఓకే.. యూఎస్ టూర్కు నో.. ఎందుకంటే..? కేంద్రం క్లారిటీ
మొదటగా శరద్ పవార్ మహారాష్ట్రలో ఇటువంటి రాజకీయాలు ప్రారంభించారని.. పురోగామి లోక్ షాహి దళ్ ప్రభుత్వంతో 1978లో ఇలాంటి ప్రయోగాలే చేశారని.. మహారాష్ట్రలో అంతకుముందు ఇలాంటి పరిణామాలు చూడలేదని.. శరద్ పవార్ తోనే ప్రారంభమయ్యాయి, శరద్ పవార్ తోనే ముగుస్తున్నాయని ఠాక్రే అన్నారు. ఇటీవల పరిణామాల వెనక శరద్ పవార్ హస్తం ఉందని ఆరోపించారు. ప్రఫుల్ పటేల్, దిలీప్ వార్సే పాటిల్, ఛగన్ భుజ్బల్, అజిత్ పవార్ వంటి నేతలు శరద్ పవార్ ఆశీస్సులు లేకుండా వెళ్లే వారు కాదని ఆయన అన్నారు.
గత ఆదివారం నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చీలిక ఏర్పడింది. పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్ అన్న కొడుకు అజిత్ పవార్ తిరుగుబాటు లేవనెత్తారు. అజిత్ పవార్ తో సహా మెజారిటీ ఎమ్మెల్యేలు ఎన్డీయే కూటమిలో చేరి బీజేపీతో జతకట్టారు. ఆదివారం అజిత్ పవార్ ఉపముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు మరో 8 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రభుత్వంలో చేరారు. శరద్ పవార్ కు అత్యంత సన్నిహితులు కూడా అజిత్ పవార్ వెంట నడిచారు. ఎన్సీపీకి మొత్తం 53 మంది ఎమ్మెల్యేలు ఉంటే 40 మందికి పైగా ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు అజిత్ పవార్ వర్గం చెబుతోంది. ఇదిలా ఉంటే బుధవారం రెండు వర్గాలు ముంబై వేదికగా బలనిరూపణ చేసుకోబోతున్నాయి.
తాజావార్తలు
-
Karnataka: కర్ణాటకలో దారుణం.. యువతి కిడ్నాప్, అత్యాచారం, హత్య..
-
Raidurg Land: రాయదుర్గం TGIIC భూమికి జాక్పాట్.. ఎకరం రూ.264 కోట్లు.!
-
India Sri Lanka 2nd Test: కుల్దీప్ ఫామ్లోనే ఉన్నాడు.. టీమిండియా కోచ్ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Floods: మధ్యప్రదేశ్ను ముంచెత్తిన వరదలు.. ఉప్పొంగి ప్రవహిస్తున్న నదులు
-
Telugu Film Industry : తెలుగు సినిమాకు తెలంగాణ సర్కార్ బిగ్ బూస్ట్.. కొత్త జీవోతో గేమ్చేంజ్.!
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!