Sharad Pawar: ద్రోహం చేసిన వారు నా ఫోటోను ఉపయోగించకూడదు..
Sharad Pawar: మహారాష్ట్ర రాజకీయాల్లో ఎన్సీపీ చర్చనీయాంశం అయింది. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ అన్న కొడుకు అజిత్ పవార్ తిరుగుబాటు దేశవ్యాప్తంగా హైలెట్ అయింది. ఏకంగా మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు తనకే ఉందని చెబుతూ.. బీజేపీ-శివసేన(ఏక్ నాథ్ షిండే) ప్రభుత్వంలో ఎన్సీపీ కూడా చేరింది. అజిత్ పవార్ ఉపముఖ్యమంత్రిగా.. మరో 8మంది ఎన్సీపీ ఎమ్మెల్యేలు మంత్రులుగా ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. మరో కీలక నేత ప్రఫుల్ పటేల్ కూడా అజిత్ వర్గంలోనే ఉన్నారు.
Read Also: Viral Video: ఢిల్లీ మెట్రోలో తోటి ప్రయాణికుడి చెంప చెల్లుమనిపించిన మహిళ.. వీడియో వైరల్..!
Also Read
ఇదిలా ఉంటే తన ద్రోహం చేసిన వారు తన ఫోటోను ఉపయోగించకూడదని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్ మంగళవారం అన్నారు. నేను జాతీయ అధ్యక్షుడిగా, జయంత్ పాటిల్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న పార్టీ మాత్రమే నా ఫోటోను ఉపయోగించగలదని స్పష్టం చేశారు. నా ఫోటోను ఎవరు ఉపయోగించాలో నిర్ణయించడం తన హక్కని ఆయన అన్నారు. నా భావజాలానికి ద్రోహం చేసిన వారు మరియు నాకు సైద్ధాంతిక విభేదాలు ఉన్నవారు నా ఛాయాచిత్రాన్ని ఉపయోగించలేరని పరోక్షంగా అజిత్ పవార్ వర్గాన్ని టార్గెట్ చేశారు.
మరోవైపు తనకు మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు ఉందని.. ఎన్సీపీ ఎమ్మెల్యేలు 53 మందిలో 40కి పైగా మంది తమతో ఉన్నారని మరోసారి అజిత్ పవార్ స్పష్టం చేశారు. మరోవైపు జయంత్ పాటిల్ ని రాష్ట్ర ఎన్సీపీ అధ్యక్ష పదవి నుంచి తొలగిస్తూ అజిత్ పవార్ వర్గం కీలక నిర్ణయం తీసుకుంది. జయంత్ పాటిల్ అజిత్ పవార్ వర్గాన్ని అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ అసెంబ్లీ స్పీకర్ కి పిటిషన్ దాఖలు చేశారు. మహరాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలో, కాంగ్రెస్ నేతలు మంగళవారం శరద్ పవార్ తో భేటీ అయ్యారు.
- Tags
- Ajit Pawar
- bjp
- Maharshtra
- NCP
- ncp crisis
తాజావార్తలు
-
Nashik TCS Case: నిదా ఖాన్ బెయిల్ పిటిషన్పై కోర్టులో ముగిసిన కీలక వాదనలు.. ఆసక్తికరంగా మారిన తీర్పు..!
-
Mahesh Babu: రాజమౌళి తర్వాత మహేష్ బాబు ప్లాన్ మామూలుగా లేదుగా!
-
PM Modi: క్రీడాకారులతో కలిసి ఫుట్బాల్ ఆడిన మోడీ.. ఫొటోలు వైరల్
-
CM Revanth Reddy: కాళేశ్వరం ప్రాజెక్ట్పై సీబీఐ విచారణకు ఒత్తిడి పెంచాలి.. మంత్రులకు సీఎం సూచన..
-
Bhuvneshwar Kumar: విమర్శకులకు వికెట్లతో సమాధానం.. భువనేశ్వర్ గణాంకాలు చూస్తే దిమ్మతిరిగి పోవాల్సిందే..
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!