Sharad Pawar: కొంతమంది బలైపోయారు.. అజిత్ తిరుగుబాటుపై శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sharad Pawar: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్ సోమవారం మహారాష్ట్రలోని సతారాలో తన పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. తన సోదరుడి కుమారుడు అజిత్ పార్టీకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి బీజేపీ, ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వంలో చేరిన ఒకరోజు తర్వాత ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఇతర పార్టీలను విచ్ఛిన్నం చేసే బీజేపీ వ్యూహాలకు కొంత మంది బలైపోయారని.. అజిత్ పవార్ మరో ఎనిమిది మంది ఎమ్మెల్యేలతో కలిసి పార్టీ నుండి వాకౌట్ చేయడాన్ని పరోక్షంగా ప్రస్తావించారు. గత ఏడాది మహారాష్ట్రలోని మహా వికాస్ అఘాడీ ప్రభుత్వాన్ని శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలు ఎలా పడగొట్టారో కూడా పవార్ మాట్లాడారు. మహారాష్ట్ర ప్రజలకు సేవ చేయడంపై ఎంవీఏ దృష్టి సారించిందని, అయితే ఎన్సీపీ, కాంగ్రెస్, శివసేన కూటమిని కొందరు వ్యక్తులు పడగొట్టారని ఆయన అన్నారు. అధికారంలో ఉన్న బీజేపీని ఉద్దేశించి పవార్, మహారాష్ట్రతో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల్లో కులం, మతం పేరుతో విభేదాలు సృష్టిస్తున్నారని అన్నారు. నేడు మహారాష్ట్ర, దేశంలో కొన్ని వర్గాలు కులం, మతం పేరుతో సమాజంలో చిచ్చు రేపుతున్నాయన్నారు.
Also Read:
Opposition meeting: జూలై 17, 18 తేదీల్లో బెంగళూరులో విపక్ష నేతల రెండో సమావేశం.. స్పష్టం చేసిన కాంగ్రెస్..!
ఎన్సీపీ విభజనపై శరద్ పవార్
శరద్ పవార్ తన సోదరుడి కుమారుడు, అతని విధేయులు అంతర్గత తిరుగుబాటు గురించి చర్చించడానికి జూలై 6న పార్టీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆదివారం, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీలో నిలువునా చీలిపోయి మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అయ్యారు. రాష్ట్రంలోని బీజేపీ-శివసేన ప్రభుత్వంలో ఎనిమిది మంది ఎన్సీపీ నేతలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అజిత్ పవార్ తదితరులపై అనర్హత వేటు వేయాలని కోరుతూ మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నార్వేకర్ ముందు ఎన్సీపీ పిటిషన్ దాఖలు చేసింది. సీనియర్ నాయకుడు అజిత్ పవార్, ఇతర తిరుగుబాటు ఎమ్మెల్యేలు పార్టీ అధినేతకు తెలియకుండా లేదా సమ్మతి లేకుండా రహస్య పద్ధతిలో పార్టీ ఫిరాయించారని పార్టీ పేర్కొంది.
Also Read
- Donald Trump: నన్ను చంపడానికి ట్రై చేస్తే 1,000 క్షిపణులు సిద్ధంగా ఉన్నాయ్.. ట్రంప్ షాకింగ్ ప్రకటన..
- Ashwini Vaishnaw: వికసిత్ భారత్-2047 లక్ష్యంతో టెక్నాలజీ విప్లవం.. హైదరాబాద్కు 3 బుల్లెట్ ట్రైన్ కారిడార్లు.!
- BCCI: టీమ్ ఇండియా కోచింగ్ టీమ్లో మార్పులు..! గంభీర్ సహాయకుల్లో ఇద్దరిని తొలగిస్తారా..?
- Virat Kohli: లండన్లో ఆ ప్లేయర్తో విరాట్ సీక్రెట్ మీటింగ్.. రెండు గంటల్లోనే వైరల్ ఫొటోలు చూసి కోహ్లీ షాక్!
Also Read: Supreme Court: సుప్రీంకోర్టులో వైఫై సేవలు.. ఇక నుంచి అంతా పేపర్లెస్
‘పరిస్థితి కొత్తది కాదు’
అజిత్ పవార్ మహారాష్ట్ర ప్రభుత్వంలో చేరిన వెంటనే, ఎన్సీపి అధినేత శరద్ పవార్ ఆదివారం విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు, ఇందులో తన సహచరులు కొందరు భిన్నమైన వైఖరిని తీసుకున్నారని అన్నారు. తాను జులై 6న నాయకులతో సమావేశమవుతానని, అక్కడ కొన్ని ముఖ్యమైన అంశాలను చర్చించి పార్టీలో కొన్ని మార్పులు చేయవలసి ఉందని శరద్ పవార్ పేర్కొన్నారు. దశాబ్దాల క్రితం కూడా తాను ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నానని, ఈసారి కూడా తాను బలంగా తిరిగి వస్తాననే నమ్మకం ఉందని పవార్ చెప్పారు. “ఇలాంటి పరిస్థితి నాకు కొత్త కాదు. 1980లో కూడా ఇదే జరిగింది. నేను నాయకత్వం వహిస్తున్న పార్టీలో 58 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఆ తర్వాత 5 మంది ఎమ్మెల్యేలు మినహా అందరూ వెళ్లిపోయారు. నేను మళ్ళీ మొదటి నుంచి నిర్మించాను. తరువాత ఎన్నికల సమయంలో, నన్ను విడిచిపెట్టిన వారిలో చాలా మంది ఓడిపోయారు. నేను ప్రజలను నమ్ముతాను. మరింత బలంగా తిరిగి వస్తానని నాకు నమ్మకం ఉంది’ అని పవార్ అన్నారు.
తాజావార్తలు
-
Donald Trump: నన్ను చంపడానికి ట్రై చేస్తే 1,000 క్షిపణులు సిద్ధంగా ఉన్నాయ్.. ట్రంప్ షాకింగ్ ప్రకటన..
-
Ashwini Vaishnaw: వికసిత్ భారత్-2047 లక్ష్యంతో టెక్నాలజీ విప్లవం.. హైదరాబాద్కు 3 బుల్లెట్ ట్రైన్ కారిడార్లు.!
-
VIDA VX2 Plus: 187KM రేంజ్తో హీరో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. ఫాస్ట్ ఛార్జింగ్, రిమూవబుల్ బ్యాటరీ
-
Vinayakan: చిన్నారి ఫోటో పోస్ట్ వివాదం.. ‘జైలర్’ విలన్ వినాయకన్పై మరో కేసు
-
BCCI: టీమ్ ఇండియా కోచింగ్ టీమ్లో మార్పులు..! గంభీర్ సహాయకుల్లో ఇద్దరిని తొలగిస్తారా..?
ట్రెండింగ్
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!
-
మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, HD+ డిస్ప్లే, IR బ్లాస్టర్తో రాబోతున్న Itel Zeno 100 Pro.!
-
డాల్బీ ఆటమ్స్ సపోర్ట్, AI కెమెరా ఫీచర్లతో గ్రాండ్ ఎంట్రీకి సిద్దమైన TECNO CAMON 50 Ultra 5G..!
-
IND vs ENG: భారత్తో సిరీస్లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!