Sharad Pawar: కొంతమంది బలైపోయారు.. అజిత్ తిరుగుబాటుపై శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sharad Pawar: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్ సోమవారం మహారాష్ట్రలోని సతారాలో తన పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. తన సోదరుడి కుమారుడు అజిత్ పార్టీకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి బీజేపీ, ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వంలో చేరిన ఒకరోజు తర్వాత ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఇతర పార్టీలను విచ్ఛిన్నం చేసే బీజేపీ వ్యూహాలకు కొంత మంది బలైపోయారని.. అజిత్ పవార్ మరో ఎనిమిది మంది ఎమ్మెల్యేలతో కలిసి పార్టీ నుండి వాకౌట్ చేయడాన్ని పరోక్షంగా ప్రస్తావించారు. గత ఏడాది మహారాష్ట్రలోని మహా వికాస్ అఘాడీ ప్రభుత్వాన్ని శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలు ఎలా పడగొట్టారో కూడా పవార్ మాట్లాడారు. మహారాష్ట్ర ప్రజలకు సేవ చేయడంపై ఎంవీఏ దృష్టి సారించిందని, అయితే ఎన్సీపీ, కాంగ్రెస్, శివసేన కూటమిని కొందరు వ్యక్తులు పడగొట్టారని ఆయన అన్నారు. అధికారంలో ఉన్న బీజేపీని ఉద్దేశించి పవార్, మహారాష్ట్రతో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల్లో కులం, మతం పేరుతో విభేదాలు సృష్టిస్తున్నారని అన్నారు. నేడు మహారాష్ట్ర, దేశంలో కొన్ని వర్గాలు కులం, మతం పేరుతో సమాజంలో చిచ్చు రేపుతున్నాయన్నారు.
Also Read:
Opposition meeting: జూలై 17, 18 తేదీల్లో బెంగళూరులో విపక్ష నేతల రెండో సమావేశం.. స్పష్టం చేసిన కాంగ్రెస్..!
ఎన్సీపీ విభజనపై శరద్ పవార్
శరద్ పవార్ తన సోదరుడి కుమారుడు, అతని విధేయులు అంతర్గత తిరుగుబాటు గురించి చర్చించడానికి జూలై 6న పార్టీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆదివారం, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీలో నిలువునా చీలిపోయి మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అయ్యారు. రాష్ట్రంలోని బీజేపీ-శివసేన ప్రభుత్వంలో ఎనిమిది మంది ఎన్సీపీ నేతలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అజిత్ పవార్ తదితరులపై అనర్హత వేటు వేయాలని కోరుతూ మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నార్వేకర్ ముందు ఎన్సీపీ పిటిషన్ దాఖలు చేసింది. సీనియర్ నాయకుడు అజిత్ పవార్, ఇతర తిరుగుబాటు ఎమ్మెల్యేలు పార్టీ అధినేతకు తెలియకుండా లేదా సమ్మతి లేకుండా రహస్య పద్ధతిలో పార్టీ ఫిరాయించారని పార్టీ పేర్కొంది.
Also Read
- Kakinada Accident: ఉపాధి కూలీలపైకి దూసుకెళ్లిన టిప్పర్.. అక్కడికక్కడే నలుగురు మహిళల మృతి
- Ragi Ambali Recipe: పాల కంటే 3 రెట్లు ఎక్కువ కాల్షియం.. శరీరాన్ని కూల్గా ఉంచే రాగి అంబలి తయారి విధానం ఇలా..
- Best Flour for Roti: ఏ పిండి రొట్టె ఆరోగ్యానికి మంచిది..? గోధుమ, రాగి, జొన్నల్లో సరైన ఎంపిక ఏది..?
- Akki On Fire: రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్ ల వికెట్ల తీసిన ఆనందం.. నోట్ సెలబ్రేషన్ వైరల్.!
Also Read: Supreme Court: సుప్రీంకోర్టులో వైఫై సేవలు.. ఇక నుంచి అంతా పేపర్లెస్
‘పరిస్థితి కొత్తది కాదు’
అజిత్ పవార్ మహారాష్ట్ర ప్రభుత్వంలో చేరిన వెంటనే, ఎన్సీపి అధినేత శరద్ పవార్ ఆదివారం విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు, ఇందులో తన సహచరులు కొందరు భిన్నమైన వైఖరిని తీసుకున్నారని అన్నారు. తాను జులై 6న నాయకులతో సమావేశమవుతానని, అక్కడ కొన్ని ముఖ్యమైన అంశాలను చర్చించి పార్టీలో కొన్ని మార్పులు చేయవలసి ఉందని శరద్ పవార్ పేర్కొన్నారు. దశాబ్దాల క్రితం కూడా తాను ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నానని, ఈసారి కూడా తాను బలంగా తిరిగి వస్తాననే నమ్మకం ఉందని పవార్ చెప్పారు. “ఇలాంటి పరిస్థితి నాకు కొత్త కాదు. 1980లో కూడా ఇదే జరిగింది. నేను నాయకత్వం వహిస్తున్న పార్టీలో 58 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఆ తర్వాత 5 మంది ఎమ్మెల్యేలు మినహా అందరూ వెళ్లిపోయారు. నేను మళ్ళీ మొదటి నుంచి నిర్మించాను. తరువాత ఎన్నికల సమయంలో, నన్ను విడిచిపెట్టిన వారిలో చాలా మంది ఓడిపోయారు. నేను ప్రజలను నమ్ముతాను. మరింత బలంగా తిరిగి వస్తానని నాకు నమ్మకం ఉంది’ అని పవార్ అన్నారు.
తాజావార్తలు
-
Kakinada Accident: ఉపాధి కూలీలపైకి దూసుకెళ్లిన టిప్పర్.. అక్కడికక్కడే నలుగురు మహిళల మృతి
-
RJ Balaji: థియేటర్లో త్రిషను హగ్ చేసుకుని ఏడ్చేసిన RJ బాలాజీ.. వీడియో వైరల్
-
Moto G37 Power, Moto G37: మోటో జి37 పవర్, మోటో జి37 రిలీజ్ డేట్ ఫిక్స్.. డైమెన్సిటీ 6400, 7,000mAh భారీ బ్యాటరీ
-
Ragi Ambali Recipe: పాల కంటే 3 రెట్లు ఎక్కువ కాల్షియం.. శరీరాన్ని కూల్గా ఉంచే రాగి అంబలి తయారి విధానం ఇలా..
-
Peddi : ‘పెద్ది’ కోసం జాన్వీ రిస్క్..
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..