NCP Crisis: బీజేపీతో కలవాలని ఎమ్మెల్యేలంతా శరద్ పవార్ని కోరారు.. ప్రఫుల్ పటేల్ సంచలన వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NCP Crisis: మహారాష్ట్ర రాజకీయాల్లో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) ప్రధానాంశంగా మారింది. ఆదివారం ఆ పార్టీ కీలక నేత అజిత్ పవార్ ఎన్డీయే ప్రభుత్వంలో చేరడం సంచలనంగా మారింది. పార్టీ చీఫ్ శరద్ పవార్ కి అజిత్ పవార్ షాక్ ఇచ్చారు. ఇదిలా ఉంటే మహారాష్ట్ర పరిణామాలు దేశవ్యాప్తంగా సంచలనంగా మారాయి. అజిత్ పవార్ డిప్యూటీ సీఎంగా, మరో 8 మంది ఎన్సీపీ ఎమ్మెల్యేలు మంత్రులుగా ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు.
ఇదిలా ఉంటే అజిత్ పవార్ వర్గంలో చేరిన మరో కీలక నేత ప్రఫుల్ పటేల్ కీలక వ్యాఖ్యలు చేశారు. 2022లో 53 మంది పార్టీ ఎమ్మెల్యేల్లో 51 మంది ఎమ్మెల్యేలు బీజేపీతో చేతులు కలపాలని పార్టీ చీఫ్ శరద్ పవార్ ని కోరారని ఆయన అన్నారు. గతేడాది మహావికాస్ అఘాడీ కూటమి ప్రభుత్వం కూలిపోయిన తర్వాత ఎన్డీయే చేరాలని కోరినట్లు ఆయన వెల్లడించారు. అనిల్ దేశ్ముఖ్, నవాబ్ మాలిక్ మాత్రమే హాజరు కాలేదని ఆయన తెలిపారు.
Also Read
- Ram Temple donation theft: అయోధ్య విరాళాల చోరీ కేసు.. రేపు సిట్ ఫైనల్ రిపోర్ట్.?
- IMD Alert: దక్షిణాదిలో వడగాలులు.. ఈ రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు
- Acid Attack Victims: యాసిడ్ దాడి బాధితులకు శుభవార్త.. కేంద్రం కీలక నిర్ణయం..
- Shraddha Walkar case: శ్రద్ధా వాకర్ హత్య కేసులో సంచలనం.. అఫ్తాబ్ ‘సైకో’గా తేల్చిన ఫోరెన్సిక్ పరీక్షలు..
Read Also: PM Modi: ఉగ్రవాదంపై పాక్ పీఎంకి ధమ్కీ ఇచ్చిన మోడీ..
ఎన్సీపీ, శివసేనతో చేతులు కలిపితే.. బీజేపీతో ఎందుకు చేతులు కలపకూడదని ఆయన ఓ స్థానిక న్యూస్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. గత ఏడాది బీజేపీ కూటమిలో చేరడంపై అంతర్గత చర్చలు జరిగాయని పటేల్ చెప్పారు. ఎమ్మెల్యేల మధ్య చర్చ జరిగిందని అన్నారు. అయితే ఆ సమయంలో నిర్ణయం తీసుకోలేదని.. ఇది అజిత్ పవార్ ఒక్కరి వ్యక్తిగత నిర్ణయం కాదని ప్రఫుల్ పటేల్ అన్నారు.
శరద్ పవార్ కి షాకిస్తూ అజిత్ పవార్ ఆదివారం బీజేపీ- ఏక్ నాథ్ షిండే శివసేన కూటమి ప్రభుత్వంలో చేరారు. శరద్ పవార్ అన్ని కుమారుడైన అజిత్ పవార్ గత కొంత కాలంగా అసంతృప్తితో ఉన్నారు. ఇటీవల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా శరద్ పవార్ కూతురు సుప్రియా సూలేని నియమించడం కూడా ఆయన ప్రాధాన్యతను క్రమంగా తగ్గిస్తున్న క్రమంలో ఆయన ఎన్సీపీలో చీలిక తీసుకువచ్చారు. గతంలో పలు సందర్భాల్లో ప్రధాని మోడీ పాలనను కూడా బహిరంగంగా పొగుడారు.
తాజావార్తలు
-
Rohit Sharma and Virat Kohli: రోహిత్-కోహ్లీ ఫ్లాప్ షో.. తొలి వన్డేలో వరుస ఓవర్లలో పెవిలియన్ బాట
-
Off The Record: నోరు అదుపులో లేక.. మాట పొదుపు లేక ఆ తండ్రి కొడుకులు ఇరుకున పడ్డారా?
-
OTR: సింగనమల వైసీపీలో సెగలు..
-
OTR: తాడేపల్లిగూడెం వైసీపీలో ముదిరిన వర్గపోరు..
-
Trump-Iran: ట్రంప్ సంచలన ప్రకటన.. హార్ముజ్ కార్గో ఫీజు రద్దు.. ఇరాన్ నౌకలపై దిగ్బంధం అమలు
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్రూఫ్తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్తో ఎఫైర్!