NCP Crisis: బీజేపీతో కలవాలని ఎమ్మెల్యేలంతా శరద్ పవార్ని కోరారు.. ప్రఫుల్ పటేల్ సంచలన వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NCP Crisis: మహారాష్ట్ర రాజకీయాల్లో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) ప్రధానాంశంగా మారింది. ఆదివారం ఆ పార్టీ కీలక నేత అజిత్ పవార్ ఎన్డీయే ప్రభుత్వంలో చేరడం సంచలనంగా మారింది. పార్టీ చీఫ్ శరద్ పవార్ కి అజిత్ పవార్ షాక్ ఇచ్చారు. ఇదిలా ఉంటే మహారాష్ట్ర పరిణామాలు దేశవ్యాప్తంగా సంచలనంగా మారాయి. అజిత్ పవార్ డిప్యూటీ సీఎంగా, మరో 8 మంది ఎన్సీపీ ఎమ్మెల్యేలు మంత్రులుగా ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు.
ఇదిలా ఉంటే అజిత్ పవార్ వర్గంలో చేరిన మరో కీలక నేత ప్రఫుల్ పటేల్ కీలక వ్యాఖ్యలు చేశారు. 2022లో 53 మంది పార్టీ ఎమ్మెల్యేల్లో 51 మంది ఎమ్మెల్యేలు బీజేపీతో చేతులు కలపాలని పార్టీ చీఫ్ శరద్ పవార్ ని కోరారని ఆయన అన్నారు. గతేడాది మహావికాస్ అఘాడీ కూటమి ప్రభుత్వం కూలిపోయిన తర్వాత ఎన్డీయే చేరాలని కోరినట్లు ఆయన వెల్లడించారు. అనిల్ దేశ్ముఖ్, నవాబ్ మాలిక్ మాత్రమే హాజరు కాలేదని ఆయన తెలిపారు.
Also Read
- Modi-Rahul Gandhi: కులగణనపై మోడీకి ఖర్గే, రాహుల్గాంధీ లేఖ.. ఏముందంటే..!
- Operation Sindoor: పాకిస్తాన్ వేడుకున్నా దాడి చేశాం: మాజీ సీడీఎస్ అనిల్ చౌహాన్..
- Operation Sindoor: పాక్ అణుకేంద్రం ‘‘కిరాణా హిల్స్’’పై దాడి.. సంచలన నిజం చెప్పిన మాజీ CDS..
- Rahul Gandhi: కృతి సనన్ రక్షాబంధన్ యాడ్పై కంగనా విమర్శలు.. ఆమె ఇష్టమని రాహుల్గాంధీ మద్దతు
Read Also: PM Modi: ఉగ్రవాదంపై పాక్ పీఎంకి ధమ్కీ ఇచ్చిన మోడీ..
ఎన్సీపీ, శివసేనతో చేతులు కలిపితే.. బీజేపీతో ఎందుకు చేతులు కలపకూడదని ఆయన ఓ స్థానిక న్యూస్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. గత ఏడాది బీజేపీ కూటమిలో చేరడంపై అంతర్గత చర్చలు జరిగాయని పటేల్ చెప్పారు. ఎమ్మెల్యేల మధ్య చర్చ జరిగిందని అన్నారు. అయితే ఆ సమయంలో నిర్ణయం తీసుకోలేదని.. ఇది అజిత్ పవార్ ఒక్కరి వ్యక్తిగత నిర్ణయం కాదని ప్రఫుల్ పటేల్ అన్నారు.
శరద్ పవార్ కి షాకిస్తూ అజిత్ పవార్ ఆదివారం బీజేపీ- ఏక్ నాథ్ షిండే శివసేన కూటమి ప్రభుత్వంలో చేరారు. శరద్ పవార్ అన్ని కుమారుడైన అజిత్ పవార్ గత కొంత కాలంగా అసంతృప్తితో ఉన్నారు. ఇటీవల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా శరద్ పవార్ కూతురు సుప్రియా సూలేని నియమించడం కూడా ఆయన ప్రాధాన్యతను క్రమంగా తగ్గిస్తున్న క్రమంలో ఆయన ఎన్సీపీలో చీలిక తీసుకువచ్చారు. గతంలో పలు సందర్భాల్లో ప్రధాని మోడీ పాలనను కూడా బహిరంగంగా పొగుడారు.
తాజావార్తలు
-
Sandeep Reddy Vanga : ప్రభాస్ ‘స్పిరిట్’ కి A సర్టిఫికెట్ పక్కా.. నేను ఎంత గింజుకున్నా అంతే!
-
Modi-Rahul Gandhi: కులగణనపై మోడీకి ఖర్గే, రాహుల్గాంధీ లేఖ.. ఏముందంటే..!
-
Sandeep Reddy Vanga : ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్!
-
Power Bank Explosion : పవర్ బ్యాంక్ పేలి విద్యార్థికి తీవ్ర గాయాలు
-
OTR: మంత్రి కొండా సురేఖను కేబినెట్ నుంచి తప్పిస్తారా..?
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!