NCP: అజిత్ పవార్ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు.. ముగ్గురిని తొలగించిన ఎన్సీపీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sharad Pawar’s NCP Removes 3 Leaders: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ ఆదివారం మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా అజిత్ పవార్ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైనందుకు ముగ్గురు పార్టీ నేతలను తొలగించారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ తిరుగుబాటుదారుడు అజిత్ పవార్కు మద్దతు ఇచ్చిన వారిని తొలగించినట్లు తెలుస్తోంది. బహిష్కరణకు గురైన నాయకులు ముంబై డివిజనల్ ఎన్సీపీ చీఫ్ నరేంద్ర రాథోడ్, అకోలా సిటీ జిల్లా చీఫ్ విజయ్ దేశ్ముఖ్, రాష్ట్ర మంత్రి శివాజీరావు గార్జే. ముగ్గురూ అజిత్ పవార్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు.
Also Read: Sharad Pawar: సమయం వచ్చినప్పుడు అందరూ నాతో ఉంటారు.. ఎన్సీపీ అధినేత కీలక వ్యాఖ్యలు
Also Read
- Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
- Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
- Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
- North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
అధికారంలో ఉన్న శివసేన-బీజేపీ కూటమితో పొత్తు పెట్టుకునేందుకు అజిత్ పవార్ తిరుగుబాటుకు మద్దతు ఇచ్చిన 9 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని ఎన్సీపీ క్రమశిక్షణ కమిటీ పిలుపునిచ్చింది. “9 మంది ఎమ్మెల్యేల ఈ చర్యలు తక్షణం అనర్హత వేటు వేయాలి. ఒకవేళ సభ్యులుగా కొనసాగడానికి అనుమతిస్తే, వారు పార్టీ ప్రయోజనాలను దెబ్బతీసే ప్రయత్నం కొనసాగించే అవకాశం ఉంది” అని ఎన్సీపీ క్రమశిక్షణ కమిటీ ఒక ప్రకటనలో పేర్కొంది. అజిత్ పవార్ అనూహ్యం తిరుగుబాటు చేసిన ఎన్సీపీ అధినేత, బాబాయ్ శరద్ పవార్కు షాక్ ఇచ్చారు.
Also Read: Jharkhand: మంత్రి మరణించిన 2 నెలల తర్వాత మంత్రిగా భార్య ప్రమాణ స్వీకారం
ఆదివారం రాజ్భవన్లో గవర్నర్ రమేష్ బైస్, అజిత్ పవార్ చేత ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. రాష్ట్రంలోని బీజేపీ-శివసేన ప్రభుత్వంలో ఎనిమిది మంది ఎన్సీపీ నేతలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. 2024లో బీజేపీ వ్యతిరేక ఫ్రంట్లో కీలక పాత్ర పోషించాలని భావిస్తున్న 83 ఏళ్ల మరాఠా నాయకుడు శరద్ పవార్ ధైర్యంగా అజిత్ పవార్ తిరుగుబాటును “దోపిడీ”గా పేర్కొన్నాడు. బీజేపీతో అధికారాన్ని పంచుకోవాలన్న తన నిర్ణయాన్ని అజిత్ పవార్ సమర్థించుకున్నారు. శివసేనతో కలిసి వెళ్లగలిగితే బీజేపీతో కూడా వెళ్లగలమని, నాగాలాండ్లో కూడా అదే జరిగింది అని అజిత్ పవార్ అన్నారు. కాంగ్రెస్ను విడిచిపెట్టిన తర్వాత 1999లో తన బాబాయ్ స్థాపించిన ఎన్సీపీలో ఎటువంటి చీలిక లేదని ఆయన నొక్కి చెప్పారు.
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!