ఇన్ స్టెంట్ మెసేజింగ్ యాప్ గా పిలవబడే వాట్సాప్ తన వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడానికి అనేక కొత్త ఫీచర్లను పరిచయం చేస్తోంది. యాప్ వినియోగంలో సౌలభ్యం పెరిగేలా చర్యలు తీసుకుంటుంది. ఎప్పటికప్పుడు కొత్త అప్ డేట్ లు చేస్తూ కొత్త ఫీచర్లను ప్రవేశపెడుతోంది.
గూగుల్ సంస్థ మరో కొత్త ఫూచర్ ను తీసుకురాబోతోంది. ఇది వినియోగదారులకు మరింత నచ్చుతుందని గూగుల్ పేర్కొంది. ప్రాజెక్ట్ ఆస్ట్రా, గూగుల్ కొత్త మల్టీమోడల్ ఏఐ (AI) అసిస్టెంట్. ఈ సంవత్సరం గూగుల్ I/O తో, ఆండ్రాయిడ్ కంపెనీ, వర్క్స్పేస్, ఫోటోలు, ఇతర యాప్లలో సేవల కోసం ఏఐ ప్రయత్నాలు, మోడల్లు, ఫీచర్లను ప్రదర్శించింది.
బాలీవుడ్ సూపర్ స్టార్ నటుడు రణ్వీర్ సింగ్ సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. కాకపోతే అది ఫేక్ వీడియో అని తేలింది. ఇకపోతే వైరల్ గా మారిన వీడియోలో దేశ రాజకీయాలపై హీరో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు కనబడుతుంది. ముఖ్యంగా భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా రణ్వీర్ సింగ్ కామెంట్ చేసినట్లు అందులో కనబడుతుంది. మరోవైపు ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ కు ఓటు వేసి…
Samsung Launches AI TVs in India: దక్షిణ కొరియాకు చెందిన ఎలక్ట్రానిక్ సంస్థ ‘శాంసంగ్’ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పటికప్పుడు సరికొత్త స్మార్ట్ఫోన్స్, టీవీలను రిలీజ్ చేస్తూ.. భారత్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకుంది. తాజాగా కొత్త టీవీలను బుధవారం భారత మార్కెట్లో లాంచ్ చేసింది. నియో క్యూఎల్ఈడీ 8కె, నియో క్యూఎల్ఈడీ 4కె సహా ఓఎల్ఈడీ టీవీ పేరుతో కొత్త స్మార్ట్ టీవీలను రిలీజ్ చేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఫీచర్లతో…
AI Impact : మీరు ఉద్యోగం కోసం చూస్తున్నట్లయితే... ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గొప్ప సలహా అందించారు. ప్రస్తుతం ప్రపంచ మందగమనం, కృత్రిమ మేధస్సు ప్రభావం ప్రపంచవ్యాప్తంగా జాబ్ మార్కెట్పై కనిపిస్తోంది.
బీహార్ పోలీస్ సబార్డినేట్ సర్వీసెస్ కమీషన్ (BPSSC) 1,275 సబ్ ఇన్స్పెక్టర్ల పోస్టుల కోసం రిక్రూట్మెంట్ నిర్వహిస్తుంది. అందుకోసం ప్రిలిమినరీ పరీక్ష సమయంలో మోసాలను నిరోధించడానికి కృత్రిమ మేధస్సు (AI)-ఆధారిత వ్యవస్థను ఉపయోగిస్తుంది. ఆదివారం జరిగిన ప్రిలిమినరీ పరీక్షకు దాదాపు 6.60 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ పరీక్ష రెండు షిఫ్టుల్లో అంటే.. ఉదయం, మధ్యాహ్నం జరుగుతుంది.
PM Modi: ప్రధాని నరేంద్రమోడీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI)పై మరోసారి ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీలో జరిగిన గ్లోబల్ సమ్మిట్ డీప్ఫేక్ టెక్నాలజీ, ఏఐ ద్వారా వచ్చే ప్రమాదాలను గురించి మంగళవారం హెచ్చరించారు. ఏఐ భారతదేశ టెక్నాలజీని విప్లవాత్మకంగా మార్చగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉందని ప్రధని అన్నారు. అయితే ముఖ్యంగా ఉగ్రవాదుల చేతికి ఏఐ చిక్కొద్దని హెచ్చరించారు.
Artificial intelligence (AI): ఇజ్రాయిల్-హమాస్ యుద్ధ నేపథ్యంలో ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) గాజా స్ట్రిప్పై విరుచుకుపడుతోంది. వైమానికి, భూతల దాడుల్ని నిర్వహిస్తోంది. అయితే ఈ యుద్ధంలో ఇజ్రాయిల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) వాడుతోందనే నివేదికలు వెలువడ్డాయి. గాజాలోని హమాస్ లక్ష్యాలను టార్గెట్ చేయడంతో పాటు పౌరమరణాల సంఖ్యను ముందుగానే అంచనా వేయగానికి ఈ వ్యవస్థని ఉపయోగిస్తోంది.
Artificial intelligence (AI): ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్పై ప్రస్తుతం ప్రపంచదేశాలు దృష్టి సారించాయి. అయితే కొంతమంది టెక్ దిగ్గజాలు ఏఐతో రాబోయ కాలంలో విధ్వంసం తప్పదని హెచ్చరిస్తుండగా.. మరికొందరు మానవుల జీవనాన్ని ఏఐ మరింత సులభతరం చేస్తుందని చెబుతున్నారు. ఏదేమైనప్పటికీ.. ఇటీవల డీఫ్ఫేక్ వీడియోలు మనదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా పలువురు సెలబ్రెటీల మార్ఫుడ్ వీడియోలు చర్చనీయాంశంగా మారాయి. ఏఐని దుర్వినియోగం చేయడంపై ఏకంగా ప్రధాన మంత్రి కూడా ఆందోళన వ్యక్తం చేశారు.
Putin: ప్రస్తుతం ప్రపంచం మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) చుట్టూ తిరుగుతోంది. దీనిపై పట్టు సాధించేందుకు అనేక కంపెనీలు ఏఐపై పెట్టుబడులు పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో రష్యా అధినేత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్పై కీలక వ్యాఖ్యలు చేశారు. AIపై వెస్ట్రన్ దేశాల గుత్తాధిపత్యం ఉండకూడదని ఆయన అన్నారు. AI అభివృద్ధికి మరింత ప్రతిష్టాత్మకమైన రష్యా వ్యూహానికి తర్వలో ఆమోదం లభిస్తుందని అన్నారు.