Samsung Launches AI TVs in India: దక్షిణ కొరియాకు చెందిన ఎలక్ట్రానిక్ సంస్థ ‘శాంసంగ్’ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పటికప్పుడు సరికొత్త స్మార్ట్ఫోన్స్, టీవీలను రిలీజ్ చేస్తూ.. భారత్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకుంది. తాజాగా కొత్త టీవీలను బుధవారం భారత మార్కెట్లో లాంచ్ చేసింది. నియో క్యూఎల్ఈడీ 8కె, నియో క్యూఎల్ఈడీ 4కె సహా ఓఎల్ఈడీ టీవీ పేరుతో కొత్త స్మార్ట్ టీవీలను రిలీజ్ చేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఫీచర్లతో…
AI Impact : మీరు ఉద్యోగం కోసం చూస్తున్నట్లయితే... ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గొప్ప సలహా అందించారు. ప్రస్తుతం ప్రపంచ మందగమనం, కృత్రిమ మేధస్సు ప్రభావం ప్రపంచవ్యాప్తంగా జాబ్ మార్కెట్పై కనిపిస్తోంది.
బీహార్ పోలీస్ సబార్డినేట్ సర్వీసెస్ కమీషన్ (BPSSC) 1,275 సబ్ ఇన్స్పెక్టర్ల పోస్టుల కోసం రిక్రూట్మెంట్ నిర్వహిస్తుంది. అందుకోసం ప్రిలిమినరీ పరీక్ష సమయంలో మోసాలను నిరోధించడానికి కృత్రిమ మేధస్సు (AI)-ఆధారిత వ్యవస్థను ఉపయోగిస్తుంది. ఆదివారం జరిగిన ప్రిలిమినరీ పరీక్షకు దాదాపు 6.60 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ పరీక్ష రెండు షిఫ్టుల్లో అంటే.. ఉదయం, మధ్యాహ్నం జరుగుతుంది.
PM Modi: ప్రధాని నరేంద్రమోడీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI)పై మరోసారి ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీలో జరిగిన గ్లోబల్ సమ్మిట్ డీప్ఫేక్ టెక్నాలజీ, ఏఐ ద్వారా వచ్చే ప్రమాదాలను గురించి మంగళవారం హెచ్చరించారు. ఏఐ భారతదేశ టెక్నాలజీని విప్లవాత్మకంగా మార్చగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉందని ప్రధని అన్నారు. అయితే ముఖ్యంగా ఉగ్రవాదుల చేతికి ఏఐ చిక్కొద్దని హెచ్చరించారు.
Artificial intelligence (AI): ఇజ్రాయిల్-హమాస్ యుద్ధ నేపథ్యంలో ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) గాజా స్ట్రిప్పై విరుచుకుపడుతోంది. వైమానికి, భూతల దాడుల్ని నిర్వహిస్తోంది. అయితే ఈ యుద్ధంలో ఇజ్రాయిల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) వాడుతోందనే నివేదికలు వెలువడ్డాయి. గాజాలోని హమాస్ లక్ష్యాలను టార్గెట్ చేయడంతో పాటు పౌరమరణాల సంఖ్యను ముందుగానే అంచనా వేయగానికి ఈ వ్యవస్థని ఉపయోగిస్తోంది.
Artificial intelligence (AI): ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్పై ప్రస్తుతం ప్రపంచదేశాలు దృష్టి సారించాయి. అయితే కొంతమంది టెక్ దిగ్గజాలు ఏఐతో రాబోయ కాలంలో విధ్వంసం తప్పదని హెచ్చరిస్తుండగా.. మరికొందరు మానవుల జీవనాన్ని ఏఐ మరింత సులభతరం చేస్తుందని చెబుతున్నారు. ఏదేమైనప్పటికీ.. ఇటీవల డీఫ్ఫేక్ వీడియోలు మనదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా పలువురు సెలబ్రెటీల మార్ఫుడ్ వీడియోలు చర్చనీయాంశంగా మారాయి. ఏఐని దుర్వినియోగం చేయడంపై ఏకంగా ప్రధాన మంత్రి కూడా ఆందోళన వ్యక్తం చేశారు.
Putin: ప్రస్తుతం ప్రపంచం మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) చుట్టూ తిరుగుతోంది. దీనిపై పట్టు సాధించేందుకు అనేక కంపెనీలు ఏఐపై పెట్టుబడులు పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో రష్యా అధినేత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్పై కీలక వ్యాఖ్యలు చేశారు. AIపై వెస్ట్రన్ దేశాల గుత్తాధిపత్యం ఉండకూడదని ఆయన అన్నారు. AI అభివృద్ధికి మరింత ప్రతిష్టాత్మకమైన రష్యా వ్యూహానికి తర్వలో ఆమోదం లభిస్తుందని అన్నారు.
PM Modi: ఆర్టిఫిషియన్ ఇంటెలిజెన్స్(AI) వేగవంతమైన వృద్ధితో భద్రతా సమస్యలు ఏర్పడుతున్నాయని, వీటిని సరిగా పరిశీలించాలని ప్రధాని నరేంద్రమోడీ పిలునిచ్చారు. ఈ సమస్యను పరిష్కరించడానికి జీ-20 దేశాలు సంయుక్తంగా పనిచేయాలని కోరారు. బుధవారం వర్చువల్గా జరిగిన జీ 20 సమ్మిట్లో ప్రధాని నరేంద్రమోడీ ప్రసంగించారు. ప్రస్తుతం ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని డెవలప్ చేయాలని సూచించారు. ఏఐ ప్రజలకు చేరువకావాలి.. ఇది సమాజానికి సురక్షితంగా ఉండాలని ప్రధాని అన్నారు.
Elon Musk: ప్రస్తుతం టెక్ ప్రపంచంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) గురించే చర్చ నడుస్తోంది. ప్రపంచ ప్రఖ్యాత టెక్ కంపెనీలన్నీ కృత్రిమమేథపై పనిచేస్తున్నాయి. అయితే రానున్న కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మానవాళికి ఎంతో సహాయకంగా మారతుందని కొంతమంది భావిస్తుంటే, మరికొంత మంది మాత్రం మానవాళి వినాశనానికి ఇది దోహదం చేసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.